పురాణమంటే అర్థమేమిటో చూద్దాం
పురాణం అంటాం కదా!
అసలీ పురాణమంటే అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం….
పురాణాలలో సర్వశాస్త్రాలు ఇమిడి ఉన్నాయని పెద్దలంతా చెబుతూ ఉంటారు. అసలీ పురాణమంటే అర్థమేమిటి? పురాణాలు ఎన్ని ఉన్నాయి? వాటన్నిటినీ ఎవరితో పోల్చి చెబుతారు? అనే విషయాలను గురించి వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం. పద్మపురాణం ఆది ఖండంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది.
పురాణాలు మొత్తం పద్దెనిమిది. వీటికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి. అందుకే శ్రీమహావిష్ణువును పురాణ పురుషుడని అంటూ ఉంటారు. ఆ నారాయణుడి యొక్క…..
1) హృదయం - పద్మపురాణం
2) చర్మం - వామన పురాణం
3) తొడలు - భాగవత పురాణం
4) మెదడు - మత్స్యపురాణం
5) పృష్ణభాగం - కూర్మపురాణం
6) కుడికాలు చీలమండ - వరాహ పురాణం
7) బొడ్డు - నారదపురాణం
8) వెంట్రుకలు - స్కందపురాణం
9) ఎడమ భుజం - శివపురాణం
10) కుడి భుజం - విష్ణుపురాణం
11) ఎడమపాదం - అగ్నిపురాణం
12) కుడిపాదం - మార్కండేయ పురాణం
13) కుడి మోకాలు - భవిష్యపురాణం అని పద్మపురాణంతోపాటు ఇతర పురాణాలు కూడా వివరించి చెబుతున్నాయి.
పురాణానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలున్నదే పురాణం అవుతుంది. ప్రధానంగా పురాణానికి అయిదు లక్షణాలను పేర్కొన్నారు. కాలక్రమంలో కొంతమంది పది లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు.
అయిదు లక్షణాలలో
1) సర్గం
2) ప్రతిసర్గం
3) వంశం
4) మన్వంతరం
5) వంశాను చరితం
పురాణానికి ఈ అయిదు లక్షణాలు ఉంటాయని పురాణాలతోపాటు, నిఘంటువులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అయిదు లక్షణాలు మనకున్న పద్దెనిమిది పురాణాలలో ఒక్కోదానిలో ఒక్కొక్క లక్షణం ఎక్కువగా, మరో లక్షణం తక్కువగా వర్ణితమై కనిపిస్తుంది. ఎక్కువ తక్కువుల మాట ఎలాఉన్నా అయిదు లక్షణాలు మాత్రం ఉండి తీరాల్సిందే.
వీటిలో
1) మొదటిదైన సర్గం అనే దానికి అర్థం సృష్టి అని, ఈ సృష్టి అంతా ఎలా జరిగింది? పంచతన్మాత్రలు, పంచభూతాలు ఎలా ఉద్భవించాయి? అని వివరించటమే సర్గం.
2) రెండో లక్షణం ప్రతిసర్గం. సర్గానికి వ్యతిరేకం ప్రతిసర్గం. అంటే సృష్టి ఎలా లయమవుతుంది? ప్రళయాలు ఎన్ని రకాలు? అవి ఎలా ఏర్పడుతాయి? అని వివరించటమే ప్రతిసర్గం
3) మూడో లక్షణమైన వంశంలో సృష్టి ప్రారంభం నుంచి ఎంతమంది రాజులు, వారి వంశాలు, ఆవిర్భవించాయి. వారి వంశాలు వర్ణనతో పాటు ఋషుల వంశాలకు సంబంధించిన విషయ వివరణలు ఈ లక్షణంలో కనిపిస్తాయి.
4) నాలుగో లక్షణం మన్వంతరం. ఇది కాలగణనాన్ని చెబుతుంది. పద్నాలుగు మన్వంతరాల విషయాలు, వాటి అధిపతులు, వారికి సంబంధించిన విషయాలన్నీ దీనిలో వస్తాయి.
5) అయిదో లక్షణమే వంశాను చరితం. దీనిలో సృష్టి మొదలైన దగ్గర నుంచి పాలించిన రాజులు, చక్రవర్తుల, ఋషుల వంశ చరిత్రలు వర్ణితమవుతాయి.
ఇలా ఈ అయిదు ప్రధాన లక్షణాలు పురాణాలకు ఉంటాయని, ఉండాలని పూర్వం నుంచి అందరూ చెబుతున్న విషయమే. కాలక్రమంలో కొంతమంది ఈ అయిదు లక్షణాలను పది లక్షణాలుగా చేసి అలాంటి పది లక్షణాలు వుంటేనే అది పురాణామని చెప్పారు. సర్గ, విసర్గ, వృత్తి, రక్షణ, అంతరాలు, వంశం, వంశాను చరితం, సంస్థ, హేతువు, అపాశ్రయం అనే పది లక్షణాలను అనంతర కాలంలో వచ్చిన వారు పేర్కొన్నారు.
1) సర్గ అంటే ఇక్కడ కూడా సృష్టి అనే అర్థం.
2) విసర్గ అంటే జీవుల సృష్టి అని అర్థం చెబుతారు.
3) వృత్తి అనే పదానికి మనిషి తన జీవితాన్ని సాగించటానికి ఏ ఏ వస్తువులను వాడుతారో వాటిని గురించిన విషయాల వివరణ.
4) రక్షణ అంటే భగవంతుడు ధర్మ రక్షణకోసం అవతరించే తీరు అని అర్థం.
5) అంతరాలు అంటే మన్వంతరాల వివరణ.
6) వంశం అంటే రాజుల, ఋషుల, వంశాల వివరణ.
7) వంశాను చరితం అంటే రాజుల, ఋషుల వంశ క్రమంలో ఉన్న అన్ని తరాల చరిత్ర వివరణ.
8) సంస్థ అంటే ప్రళయానికి సంబంధించిన వివరణ.
9) హేతువు అని అంటే జీవుడి జనన మరణాలకు మధ్యన ఉన్న కర్మ సంబంధమైన విషయం. జీవుడు చేసే కర్మను బట్టే అతడి జీవితమైనా, సృష్టి అయినా అంతమవుతుందని చెప్పే విషయానికి సంబంధించిన వివరణ.
10) అపాశ్రయం అని అంటే పరబ్రహ్మం అని అర్థం. ఆ పరబ్రహ్మ శక్తినే అపాశ్రయ శక్తి అని అంటారు. దానికి సంబంధించిన వివరాలు దీంట్లో ఉంటాయి.
ఈ పది లక్షణాలు భాగవతం ద్వితీయ స్కందంలో మళ్ళీ కొద్దిపాటి తేడాతో కనిపిస్తున్నాయి. సర్గ, ప్రతిసర్గ, స్థానం, పోషణం, ఊతయం, మన్వంతరం, ఈశాను కథ, నిరోధం, ముక్తి, ఆశ్రయం... ఈ పది లక్షణాలు పేర్లలో తేడా ఉన్నా అర్థం మాత్రం ఒకటేనని పురాణజ్ఞులు వివరించి చెబుతున్నారు.
తెలుగుపథం TELUGUPATHAM
THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Thursday, December 4, 2025
Wednesday, December 3, 2025
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర చివరి భాగం (28వ అధ్యాయం)
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర చివరి భాగం ..!!
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸ఈ రోజున పూజా మందిరంలో ఇండ్లలో అయ్యప్పస్వామి , ఇతర దేవీ దేవతల మూర్తులతో బాటు ‘విషుకణి’ అని ఒక అద్దాన్ని ఉంచి , అద్దానికి బొట్టు , పూలమాలలు వేసి అద్దం ముందర నవధాన్యాలు , వివిధ రకాలైన కాయగూరలు , పండ్లు , బంగారు , వెండి , రాగి నాణాలు మొదలైనవి అమర్చుతారు !
🌿ఒక పళ్ళెంలో పైకం నోట్లు వుంచుతారు ! ప్రొద్దున లేచిన వెంటనే ముందుగా ఈ అద్దంలో ముఖం చూసుకుని , కళ్లు నీటితో తుడుచుకుని , నుదుట బొట్టు పెట్టుకుని అద్దం ముందర వున్న వాటినన్నిటిని చూడటం వల్ల ఆ సంవత్సరమంతా శుభప్రదంగా జరుగు తుందని కేరళీయుల నమ్మకం! ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇండ్లలో ‘విషుకణి’ దర్శనానంతరం స్నానాదికాలు ముగించుకుని కొత్త బట్టలు ధరించి పూజాదికాలు జరుపుతారు. తరువాత అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు.
🌸చాలామంది ఈ రోజుకు శబరిమల చేరుకుని స్వామిని దర్శించుకుంటారు ! ప్రధాన పూజారులు ఆ రోజు ప్రత్యేకంగా స్వామి దగ్గర భక్తులకోసం ఉంచిన రూపాయ బిళ్లలను ప్రసాదంతోపాటు ఇస్తారు ! ఆ బిళ్ల లభించినవారు ఇంటికి తెచ్చుకుని పూజామందిరంలో భద్రపరుచుకుంటారు ! వ్యాపారులు పెట్టుబడులతో ఆ బిళ్లను కలపటంవల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు.
🌹సన్నిధానం మూయటం:🌹
🌿జనవరి 19న గానీ , లేకపోతే 20వ తారీఖున గానీ భక్తులందరి సమక్షంలో ప్రధాన పూజారి స్వామివారి చేతిలో విల్లు , బాణము వుంచి శిరస్సుకు నీలివస్త్రం చుట్టి , విభూతితో అభిషేకం జరిపి దేవాలయం మూసేస్తారు ! తాళం పెడతారు ! శబరిగిరికి వెళ్లటం కష్టం కనుక ఈ విధంగా ముఖ్యమైన రోజులలో మాత్రమే తెరిచి వుంచే ఏర్పాటు చేయబడింది ! ఇతర ప్రాంతాలలో మామూలుగా అన్ని అలయాలలోలాగే రోజూ పూజార్చనలు రెండు పూటలా జరుగు తుంటాయి !
🌹అయ్యప్ప స్వామి పూజకు సంబంధించిన కొన్ని వివరాలు:🌹
🌸స్వామి పూజకు బుధవారం, శనివారం ముఖ్యమైనవి. బుధవారం పుణ్యఫలాన్ని విశేషంగానూ, శనివారం శనిగ్రహ దోష నివారణను అనుగ్రహిస్తాయి !
🌿స్వామికి ఆవునెయ్యితో దీపారాధన చేయాలి ! కుటుంబానికి సంపత్తి , ఆరోగ్యం , సుఖ సంతోషాలు లభిస్తాయి !
రెండు వత్తులు కలిపి దీపం వెలిగించాలి ! సుఖ సంతోషాలు ప్రసాదిస్తుంది !
🌸మూడు వత్తుల దీపం సత్సంతానాన్ని ,
నాలుగు వత్తుల దీపం పశు సంపదను ,
పంచవత్తుల దీపం సర్వమంగళాలు ప్రసాదిస్తాయి !
🌿అయ్యప్ప స్వామి పటాన్ని తూర్పు దిశగా గానీ , ఈశాన్య దిశగాగానీ వుంచి పూజించాలి !
తూర్పు దిశగా పూజ ఆరోగ్యాన్నీ , ఐశ్వర్యాన్నీ ,
ఈశాన్య దిశగా పూజ కీర్తిప్రతిష్ఠలను వృద్ధి చేస్తాయి !
🌸బెల్లంతో చేసిన అప్పాలు , చక్కెర పొంగలి , పానకం స్వామికి ప్రీతికరమైనవి ! వీటిని నివేదన చేయటంవల్ల సర్వ శుభాలు అనుగ్రహిస్తాడు అయ్యప్ప స్వామి !
అన్ని ద్రవ్యాలలో నెయ్యాభిషేకం అయ్యప్ప స్వామికి ప్రీతికరం !
🌿 దీక్షాధారులు కొబ్బరి ముద్రలో నెయ్యిని తీసుకువెళ్లి అభిషేకం చేయించి ప్రసాదంగా కొంత తీసుకుని వెళతారు ఇండ్లకు ! ఈ నెయ్యిని సేవించడంవల్ల దీర్ఘరోగాలు , ఉబ్బసం వంటి శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు నయమౌతాయి .
🌹అయ్యప్పస్వామి పూజా విధానం🌹
🌸తూర్పు దిశగా పీఠం పెట్టే స్థలంలో , నీళ్లు జల్లి , శుభ్రం చేసి ముగ్గులు తీర్చిదిద్దారు ! ఆ స్థలంలో పీఠాన్ని అమర్చి దానిమీద కొత్త బట్ట వేసి అయ్యప్పస్వామి పటాన్ని ఆ వస్త్రంమీద మధ్యగా వుంచి నమస్కరించారు !
🌿ఆ పటంలో స్వామి చిన్ముద్ర , అభయముద్రలతో , పట్టుబంధంతో ఆసీనుడై దేదీప్యమానంగా కనిపిస్తున్నాడు ! కుంకుమ , చందనం బొట్టు పెట్టి పూలమాలలు వేయడంతో మరింత శోభాయమానంగా దర్శనమిచ్చాడు అయ్యప్పస్వామి పటంలోనుండి ! పీఠం రెండు ప్రక్కలా దీపాలు అమర్చి , పూజకు కావలసిన వస్తువులన్నీ సర్దుకున్నారు పూజారులు ! అరిటాకు మీద పసుపు వినాయకుడిని వుంచి పటం ముందర ఉంచారు !
🌸 ‘‘భక్తులారా ! గుడిలో చేసినట్లే మేము మా విశిష్ట పద్ధతిలో అయ్యప్పస్వామి పూజ జరిపించ బోతున్నాము ! ఇది వౌనంగా మానసికంగా చేసే పూజ ! చేతితో ముద్రలు వేసి స్వామికి చూపుతూ మనస్సులోనే ఉపచార మంత్రాలు చదువుతాము ! మీరందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చుని మేము చేయబోయే పూజను చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ అంటూ పూజారులు చెప్పడంతో అందరూ తలలూపారు !
🌿‘‘స్వామియే శరణం అయ్యప్ప’’ అంటూ పెద్దగా ఒక్కసారి శరణుఘోష చెప్పి స్వామి పీఠం ముందు వేసిన పీటల మీద ఇంటి పెద్దవారిని వచ్చి కూర్చోమన్నారు. మనస్సులో గణపతిని , గురువును ధ్యానించి దీపాలు వెలిగించమని చెప్పడంతో , ఆవు నేతిని దీపపు సెమ్మెలలో పోసి పంచ ముఖాలున్న వత్తులు వేసి వెలిగించారు దంపతులిద్దరూ !
🌸పసుపు వినాయకుడిమీద పుష్పాలు , పసుపు , కుంకుమలు జల్లుతూ చేతులతో ముద్రలు చూపుతూ మనస్సులో ఉపచార మంత్రాలు చెబుతూ , గణపతి పూజ పూర్తిచేశారు పూజారులు ! అగరు ధూపం, దీపాలు చూపి
నైవేద్యంగా బెల్లం ముక్కలు , అరటిపళ్లు అర్పించారు ! కర్పూర హారతి ఇచ్చి అందరికీ చూపమని చెప్పడంతో అలాగే చేశారాయన !
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర చివరి భాగం ..!!
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸ఈ రోజున పూజా మందిరంలో ఇండ్లలో అయ్యప్పస్వామి , ఇతర దేవీ దేవతల మూర్తులతో బాటు ‘విషుకణి’ అని ఒక అద్దాన్ని ఉంచి , అద్దానికి బొట్టు , పూలమాలలు వేసి అద్దం ముందర నవధాన్యాలు , వివిధ రకాలైన కాయగూరలు , పండ్లు , బంగారు , వెండి , రాగి నాణాలు మొదలైనవి అమర్చుతారు !
🌿ఒక పళ్ళెంలో పైకం నోట్లు వుంచుతారు ! ప్రొద్దున లేచిన వెంటనే ముందుగా ఈ అద్దంలో ముఖం చూసుకుని , కళ్లు నీటితో తుడుచుకుని , నుదుట బొట్టు పెట్టుకుని అద్దం ముందర వున్న వాటినన్నిటిని చూడటం వల్ల ఆ సంవత్సరమంతా శుభప్రదంగా జరుగు తుందని కేరళీయుల నమ్మకం! ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇండ్లలో ‘విషుకణి’ దర్శనానంతరం స్నానాదికాలు ముగించుకుని కొత్త బట్టలు ధరించి పూజాదికాలు జరుపుతారు. తరువాత అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు.
🌸చాలామంది ఈ రోజుకు శబరిమల చేరుకుని స్వామిని దర్శించుకుంటారు ! ప్రధాన పూజారులు ఆ రోజు ప్రత్యేకంగా స్వామి దగ్గర భక్తులకోసం ఉంచిన రూపాయ బిళ్లలను ప్రసాదంతోపాటు ఇస్తారు ! ఆ బిళ్ల లభించినవారు ఇంటికి తెచ్చుకుని పూజామందిరంలో భద్రపరుచుకుంటారు ! వ్యాపారులు పెట్టుబడులతో ఆ బిళ్లను కలపటంవల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు.
🌹సన్నిధానం మూయటం:🌹
🌿జనవరి 19న గానీ , లేకపోతే 20వ తారీఖున గానీ భక్తులందరి సమక్షంలో ప్రధాన పూజారి స్వామివారి చేతిలో విల్లు , బాణము వుంచి శిరస్సుకు నీలివస్త్రం చుట్టి , విభూతితో అభిషేకం జరిపి దేవాలయం మూసేస్తారు ! తాళం పెడతారు ! శబరిగిరికి వెళ్లటం కష్టం కనుక ఈ విధంగా ముఖ్యమైన రోజులలో మాత్రమే తెరిచి వుంచే ఏర్పాటు చేయబడింది ! ఇతర ప్రాంతాలలో మామూలుగా అన్ని అలయాలలోలాగే రోజూ పూజార్చనలు రెండు పూటలా జరుగు తుంటాయి !
🌹అయ్యప్ప స్వామి పూజకు సంబంధించిన కొన్ని వివరాలు:🌹
🌸స్వామి పూజకు బుధవారం, శనివారం ముఖ్యమైనవి. బుధవారం పుణ్యఫలాన్ని విశేషంగానూ, శనివారం శనిగ్రహ దోష నివారణను అనుగ్రహిస్తాయి !
🌿స్వామికి ఆవునెయ్యితో దీపారాధన చేయాలి ! కుటుంబానికి సంపత్తి , ఆరోగ్యం , సుఖ సంతోషాలు లభిస్తాయి !
రెండు వత్తులు కలిపి దీపం వెలిగించాలి ! సుఖ సంతోషాలు ప్రసాదిస్తుంది !
🌸మూడు వత్తుల దీపం సత్సంతానాన్ని ,
నాలుగు వత్తుల దీపం పశు సంపదను ,
పంచవత్తుల దీపం సర్వమంగళాలు ప్రసాదిస్తాయి !
🌿అయ్యప్ప స్వామి పటాన్ని తూర్పు దిశగా గానీ , ఈశాన్య దిశగాగానీ వుంచి పూజించాలి !
తూర్పు దిశగా పూజ ఆరోగ్యాన్నీ , ఐశ్వర్యాన్నీ ,
ఈశాన్య దిశగా పూజ కీర్తిప్రతిష్ఠలను వృద్ధి చేస్తాయి !
🌸బెల్లంతో చేసిన అప్పాలు , చక్కెర పొంగలి , పానకం స్వామికి ప్రీతికరమైనవి ! వీటిని నివేదన చేయటంవల్ల సర్వ శుభాలు అనుగ్రహిస్తాడు అయ్యప్ప స్వామి !
అన్ని ద్రవ్యాలలో నెయ్యాభిషేకం అయ్యప్ప స్వామికి ప్రీతికరం !
🌿 దీక్షాధారులు కొబ్బరి ముద్రలో నెయ్యిని తీసుకువెళ్లి అభిషేకం చేయించి ప్రసాదంగా కొంత తీసుకుని వెళతారు ఇండ్లకు ! ఈ నెయ్యిని సేవించడంవల్ల దీర్ఘరోగాలు , ఉబ్బసం వంటి శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు నయమౌతాయి .
🌹అయ్యప్పస్వామి పూజా విధానం🌹
🌸తూర్పు దిశగా పీఠం పెట్టే స్థలంలో , నీళ్లు జల్లి , శుభ్రం చేసి ముగ్గులు తీర్చిదిద్దారు ! ఆ స్థలంలో పీఠాన్ని అమర్చి దానిమీద కొత్త బట్ట వేసి అయ్యప్పస్వామి పటాన్ని ఆ వస్త్రంమీద మధ్యగా వుంచి నమస్కరించారు !
🌿ఆ పటంలో స్వామి చిన్ముద్ర , అభయముద్రలతో , పట్టుబంధంతో ఆసీనుడై దేదీప్యమానంగా కనిపిస్తున్నాడు ! కుంకుమ , చందనం బొట్టు పెట్టి పూలమాలలు వేయడంతో మరింత శోభాయమానంగా దర్శనమిచ్చాడు అయ్యప్పస్వామి పటంలోనుండి ! పీఠం రెండు ప్రక్కలా దీపాలు అమర్చి , పూజకు కావలసిన వస్తువులన్నీ సర్దుకున్నారు పూజారులు ! అరిటాకు మీద పసుపు వినాయకుడిని వుంచి పటం ముందర ఉంచారు !
🌸 ‘‘భక్తులారా ! గుడిలో చేసినట్లే మేము మా విశిష్ట పద్ధతిలో అయ్యప్పస్వామి పూజ జరిపించ బోతున్నాము ! ఇది వౌనంగా మానసికంగా చేసే పూజ ! చేతితో ముద్రలు వేసి స్వామికి చూపుతూ మనస్సులోనే ఉపచార మంత్రాలు చదువుతాము ! మీరందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చుని మేము చేయబోయే పూజను చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ అంటూ పూజారులు చెప్పడంతో అందరూ తలలూపారు !
🌿‘‘స్వామియే శరణం అయ్యప్ప’’ అంటూ పెద్దగా ఒక్కసారి శరణుఘోష చెప్పి స్వామి పీఠం ముందు వేసిన పీటల మీద ఇంటి పెద్దవారిని వచ్చి కూర్చోమన్నారు. మనస్సులో గణపతిని , గురువును ధ్యానించి దీపాలు వెలిగించమని చెప్పడంతో , ఆవు నేతిని దీపపు సెమ్మెలలో పోసి పంచ ముఖాలున్న వత్తులు వేసి వెలిగించారు దంపతులిద్దరూ !
🌸పసుపు వినాయకుడిమీద పుష్పాలు , పసుపు , కుంకుమలు జల్లుతూ చేతులతో ముద్రలు చూపుతూ మనస్సులో ఉపచార మంత్రాలు చెబుతూ , గణపతి పూజ పూర్తిచేశారు పూజారులు ! అగరు ధూపం, దీపాలు చూపి
నైవేద్యంగా బెల్లం ముక్కలు , అరటిపళ్లు అర్పించారు ! కర్పూర హారతి ఇచ్చి అందరికీ చూపమని చెప్పడంతో అలాగే చేశారాయన !
🌿 అందరూ నిలబడి మంత్ర పుష్పానంతరం పూజారి పుష్పాలు గణపతిమీద వేయమని సైగ చేయడంతో అందరూ పుష్పాలు జల్లి , ఆత్మప్రదక్షిణ నమస్కారాలు చేశారు ! అందరికీ తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు ! పూజారి గారు పసుపు వినాయకుడిని వుంచిన ఆకును జరిపి ఉద్వాసన మంత్రాన్ని ధ్యానించి గణపతి పూజ పూర్తిచేశారు !
🌹శ్రీ అయ్యప్పస్వామి పూజ
" ఓం శ్రీ భూతనాథాయ నమః
అఖిల భువన దీపం భక్తజన చిత్తాబ్జసూనం
సురగణముని సేవ్యం తత్వ మస్యాది లక్ష్యం
హరిహర సుత మీశం తారక బ్రహ్మరూపం
శబరిగిరి నివాసం భావయే శ్రీభూత నాథం "🌹
🌸 పూజారిగారితో పాటు అయ్యప్పస్వామిని ధ్యానించి నమస్కరించారందరూ ! పూజారిగారు మానసికంగా షోడశోపచారాలను చదువుతూ వాటికి సంబంధించిన ముద్రలు చేతులతో , వ్రేళ్ళతో చూపుతుంటే అందరూ ఆసక్తిగా ఏకాగ్రతతో చూస్తున్నారు !
🌿 వాటికి తగ్గ పూజా ద్రవ్యాలు సమర్పించుతూ ఆయన పుష్పాలు తీసుకుని అష్టోత్తర శతనామావళి మానసికంగా చదువుతుంటే ఆయన సహాయకుడు అందరికీ అష్టోత్తర శతనామావళి ముద్రించిన కాగితాలు పంచాడు చదువుకోమంటూ ! అందరూ మనస్సులోనే భక్తిశ్రద్ధలతో స్వామి నామాలు చదువుకున్నారు !
🌹ఓం ధర్మ శాస్త్రే నమః
ఓం వేద శాస్త్రే నమః
ఓం విశ్వశాస్తే నమః
ఓం లోక శాస్త్రేనమః
ఓం హరిహరాత్మజాయ నమః
ఓం దేవ గణ పూజితాయ నమః
ఓం పంబా బాలాయ నమః
ఓం శ్రీధర్మా శాస్తాయ నమః
ఓం శ్రీ భూతనాధాయ నమః
ఓం శ్రీ గురునాధాయ నమః🌹
🌸అష్టోత్తర శతనామావళి చదవటం పూర్తి అయిన తరువాత
అందరూ పుష్పాలు జల్లి కూర్చన్నారు! ధూప , దీపాలు చూపిన తర్వాత సిద్ధమైన నైవేద్యాలు తెచ్చి పటం దగ్గర పెట్టారు. అప్పాలు , చక్కెర , పొంగలి , పానకం , పండ్లు నివేదన చేసి , తాంబూలం సమర్పించారు !
🌿 కర్పూర హారతి చూపించారు ! అందరూ భక్తిగా హారతి కళ్లకద్దుకుని ఆత్మప్రదక్షిణ నమస్కారాలు చేశారు ! నమస్కార శ్లోకాలు పైకి చదువుతూ దండప్రణామాలు ఆచరించారు పూజారి గారు !
🌹అయ్యప్పస్వామి నమస్కార శ్లోకాలు (ఆదిశంకరాచార్య విరచిత)🌹
🌹‘‘భూతనాథ సదానంద సర్వభూత దయాపర
రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః
లోక వీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమాహ్యహం
విశ్వపూజ్యం విశ్వ వంద్యం విఘ శంభోప్రియసుతం
క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం
మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం ! "🌹
🌸తీర్థప్రసాదాల వితరణ
నమస్కార శ్లోకాలు పఠించి అందరికి శంఖంతో తీర్థాన్ని ఇచ్చారు పూజారిగారు శంఖంతో తీర్థం ఇవ్వటం గూర్చి , చెప్పారాయన !
‘‘తీర్థమంటే స్వామి పూజకోసం శంఖంలో, రాగిపాత్రలో పోసి స్వామి ముందర వుంచే మంచినీరు ! ఇందులో తులసీదళాలు వేయటంవల్ల పవిత్రవౌతుంది !
🌿తులసీదళాలు మహాలక్ష్మి రూపాలు ! తీర్థంతో ఈ దళాలను స్వీకరించటంవల్ల ఆరోగ్యం , ఐశ్వర్యం సిద్ధిస్తాయి ! పూజ పూర్తయ్యాక తప్పకుండా తీర్థాన్ని తీసుకోవాలి ! అప్పుడే పూజాఫలం లభిస్తుంది !
🌹తీర్థం తీసుకునే పద్ధతి:🌹
🌸ఎడమచేతిమీద శుభ్రమైన రుమాలునుగానీ , పైబట్టను గానీ వేసుకుని దానిమీద కుడి చేతిని బొటనవ్రేలు లోపలకు మడిచి శంఖం ఆకారంలా వుంచాలి ! దాంట్లో ఉద్ధరిణితో మూడుసార్లు తీర్థాన్ని స్వీకరించి త్రాగాలి !
🌿మొదటి ఉద్ధరిణి తీర్థం శరీరాన్ని శుద్ధి చేస్తుంది !
రెండవ వుద్ధరిణి తీర్థం ధర్మసాధనకు దోహదం చేస్తుంది !
మూడవ వుద్ధరిణి తీర్థం (వుద్ధరిణి అంటే చెంచా) మోక్షమార్గాన నడిపించడానికి సహాయపడుతుంది ! కనుక పూజ చేసిన తీర్థంని మూడుసార్లు తప్పకుండా తీసుకోవాలి !
🌸ఒకేసారి మూడు చెంచాల తీర్థం చేతిలో వేయించుకుని ఒక్కసారే త్రాగటం సరైన పద్దతి కాదు ! తీర్థాన్ని ముందుగా భక్తితో కళ్లకద్దుకుని , తరువాత క్రింద పడకుండా , శబ్దం చేయకుండా నోటితో తీసుకోవాలి’’ అని చెప్పి "అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ సమస్త పాపక్షయ కరం శ్రీ అయ్యప్పస్వామి వారి పాదోదకం పావనం శుభం’’ అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని అందరికీ ఇచ్చారు !
🌿తీర్థాన్ని దేవాలయాలలో నిలబడి , ఇండ్లలో కూర్చుని తీర్థాన్ని తీసుకోవాలని చెప్పడంతో అందరూ వరుసలో పూజారిగారి ముందు కూర్చుని తీర్థాన్ని తీసుకుని కళ్లకద్దుకుని స్వీకరించారు.
🌹అయ్యప్పస్వామి ప్రసాదం:🌹
🌸స్వామికి నివేదన చేసిన ప్రసాదాలను ముందుగా కొంత ఆకులో పెట్టి స్వామి దగ్గరగా మూత పెట్టి వుంచిన తరువాత అందరికీ పంచాలి ! చిన్న దొనెలలో ప్రసాదాన్ని ఉంచి అందరికీ ఇచ్చారు ! అందరూ భక్తితో ఆరగించారు ! తీర్థ ప్రసాదాల వితరణ జరిగాక భజన బృందంవాళ్లు వాళ్ల వాయిద్యాలతో ముందుకు వచ్చి కూర్చున్నారు !
🌿అయ్యప్పస్వామి భజన ప్రియుడు ! అందుచేత ఇండ్లలో స్వామి పూజా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు తప్పకుండా భజన కార్యక్రమం చేయాలి ! అప్పుడే కార్యక్రమానికి నిండుదనం చేకూరుతుంది. రెండు గంటలసేపు గణపతి , సుబ్రహ్మణ్యేశ్వరస్వామి , అమ్మవారులమీద పాటలు పాడి అయ్యప్పస్వామి మీద పాడసాగారు !
🌹అయ్యప్పస్వామి భజన🌹
🌿‘‘అదిగదిగో శబరిమల
- అయ్యప్ప దేవుడుండుమల
అదియే మనకు పుణ్యమల -
స్వామియే శరణం అయ్యప్ప!
🌹శ్రీ అయ్యప్పస్వామి పూజ
" ఓం శ్రీ భూతనాథాయ నమః
అఖిల భువన దీపం భక్తజన చిత్తాబ్జసూనం
సురగణముని సేవ్యం తత్వ మస్యాది లక్ష్యం
హరిహర సుత మీశం తారక బ్రహ్మరూపం
శబరిగిరి నివాసం భావయే శ్రీభూత నాథం "🌹
🌸 పూజారిగారితో పాటు అయ్యప్పస్వామిని ధ్యానించి నమస్కరించారందరూ ! పూజారిగారు మానసికంగా షోడశోపచారాలను చదువుతూ వాటికి సంబంధించిన ముద్రలు చేతులతో , వ్రేళ్ళతో చూపుతుంటే అందరూ ఆసక్తిగా ఏకాగ్రతతో చూస్తున్నారు !
🌿 వాటికి తగ్గ పూజా ద్రవ్యాలు సమర్పించుతూ ఆయన పుష్పాలు తీసుకుని అష్టోత్తర శతనామావళి మానసికంగా చదువుతుంటే ఆయన సహాయకుడు అందరికీ అష్టోత్తర శతనామావళి ముద్రించిన కాగితాలు పంచాడు చదువుకోమంటూ ! అందరూ మనస్సులోనే భక్తిశ్రద్ధలతో స్వామి నామాలు చదువుకున్నారు !
🌹ఓం ధర్మ శాస్త్రే నమః
ఓం వేద శాస్త్రే నమః
ఓం విశ్వశాస్తే నమః
ఓం లోక శాస్త్రేనమః
ఓం హరిహరాత్మజాయ నమః
ఓం దేవ గణ పూజితాయ నమః
ఓం పంబా బాలాయ నమః
ఓం శ్రీధర్మా శాస్తాయ నమః
ఓం శ్రీ భూతనాధాయ నమః
ఓం శ్రీ గురునాధాయ నమః🌹
🌸అష్టోత్తర శతనామావళి చదవటం పూర్తి అయిన తరువాత
అందరూ పుష్పాలు జల్లి కూర్చన్నారు! ధూప , దీపాలు చూపిన తర్వాత సిద్ధమైన నైవేద్యాలు తెచ్చి పటం దగ్గర పెట్టారు. అప్పాలు , చక్కెర , పొంగలి , పానకం , పండ్లు నివేదన చేసి , తాంబూలం సమర్పించారు !
🌿 కర్పూర హారతి చూపించారు ! అందరూ భక్తిగా హారతి కళ్లకద్దుకుని ఆత్మప్రదక్షిణ నమస్కారాలు చేశారు ! నమస్కార శ్లోకాలు పైకి చదువుతూ దండప్రణామాలు ఆచరించారు పూజారి గారు !
🌹అయ్యప్పస్వామి నమస్కార శ్లోకాలు (ఆదిశంకరాచార్య విరచిత)🌹
🌹‘‘భూతనాథ సదానంద సర్వభూత దయాపర
రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః
లోక వీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమాహ్యహం
విశ్వపూజ్యం విశ్వ వంద్యం విఘ శంభోప్రియసుతం
క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం
మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం ! "🌹
🌸తీర్థప్రసాదాల వితరణ
నమస్కార శ్లోకాలు పఠించి అందరికి శంఖంతో తీర్థాన్ని ఇచ్చారు పూజారిగారు శంఖంతో తీర్థం ఇవ్వటం గూర్చి , చెప్పారాయన !
‘‘తీర్థమంటే స్వామి పూజకోసం శంఖంలో, రాగిపాత్రలో పోసి స్వామి ముందర వుంచే మంచినీరు ! ఇందులో తులసీదళాలు వేయటంవల్ల పవిత్రవౌతుంది !
🌿తులసీదళాలు మహాలక్ష్మి రూపాలు ! తీర్థంతో ఈ దళాలను స్వీకరించటంవల్ల ఆరోగ్యం , ఐశ్వర్యం సిద్ధిస్తాయి ! పూజ పూర్తయ్యాక తప్పకుండా తీర్థాన్ని తీసుకోవాలి ! అప్పుడే పూజాఫలం లభిస్తుంది !
🌹తీర్థం తీసుకునే పద్ధతి:🌹
🌸ఎడమచేతిమీద శుభ్రమైన రుమాలునుగానీ , పైబట్టను గానీ వేసుకుని దానిమీద కుడి చేతిని బొటనవ్రేలు లోపలకు మడిచి శంఖం ఆకారంలా వుంచాలి ! దాంట్లో ఉద్ధరిణితో మూడుసార్లు తీర్థాన్ని స్వీకరించి త్రాగాలి !
🌿మొదటి ఉద్ధరిణి తీర్థం శరీరాన్ని శుద్ధి చేస్తుంది !
రెండవ వుద్ధరిణి తీర్థం ధర్మసాధనకు దోహదం చేస్తుంది !
మూడవ వుద్ధరిణి తీర్థం (వుద్ధరిణి అంటే చెంచా) మోక్షమార్గాన నడిపించడానికి సహాయపడుతుంది ! కనుక పూజ చేసిన తీర్థంని మూడుసార్లు తప్పకుండా తీసుకోవాలి !
🌸ఒకేసారి మూడు చెంచాల తీర్థం చేతిలో వేయించుకుని ఒక్కసారే త్రాగటం సరైన పద్దతి కాదు ! తీర్థాన్ని ముందుగా భక్తితో కళ్లకద్దుకుని , తరువాత క్రింద పడకుండా , శబ్దం చేయకుండా నోటితో తీసుకోవాలి’’ అని చెప్పి "అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ సమస్త పాపక్షయ కరం శ్రీ అయ్యప్పస్వామి వారి పాదోదకం పావనం శుభం’’ అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని అందరికీ ఇచ్చారు !
🌿తీర్థాన్ని దేవాలయాలలో నిలబడి , ఇండ్లలో కూర్చుని తీర్థాన్ని తీసుకోవాలని చెప్పడంతో అందరూ వరుసలో పూజారిగారి ముందు కూర్చుని తీర్థాన్ని తీసుకుని కళ్లకద్దుకుని స్వీకరించారు.
🌹అయ్యప్పస్వామి ప్రసాదం:🌹
🌸స్వామికి నివేదన చేసిన ప్రసాదాలను ముందుగా కొంత ఆకులో పెట్టి స్వామి దగ్గరగా మూత పెట్టి వుంచిన తరువాత అందరికీ పంచాలి ! చిన్న దొనెలలో ప్రసాదాన్ని ఉంచి అందరికీ ఇచ్చారు ! అందరూ భక్తితో ఆరగించారు ! తీర్థ ప్రసాదాల వితరణ జరిగాక భజన బృందంవాళ్లు వాళ్ల వాయిద్యాలతో ముందుకు వచ్చి కూర్చున్నారు !
🌿అయ్యప్పస్వామి భజన ప్రియుడు ! అందుచేత ఇండ్లలో స్వామి పూజా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు తప్పకుండా భజన కార్యక్రమం చేయాలి ! అప్పుడే కార్యక్రమానికి నిండుదనం చేకూరుతుంది. రెండు గంటలసేపు గణపతి , సుబ్రహ్మణ్యేశ్వరస్వామి , అమ్మవారులమీద పాటలు పాడి అయ్యప్పస్వామి మీద పాడసాగారు !
🌹అయ్యప్పస్వామి భజన🌹
🌿‘‘అదిగదిగో శబరిమల
- అయ్యప్ప దేవుడుండుమల
అదియే మనకు పుణ్యమల -
స్వామియే శరణం అయ్యప్ప!
🌸అదిగదిగో కైలాసం -
ఇదిగిదిగో వైకుంఠం
ఈ రెండూ కలిసిన శబరిమల
- అదియే మనకు మోక్షమల
🌿అదిగదిగో పంబానది -
దక్షిణ భారత గంగానది
అదిగదిగో అళుదానది
- కన్నెస్వాములకు ముఖ్యనది
అదిగదిగో కాంతిమల -
🌸కలియుగ జ్యోతి వెలయు మల
మకరజ్యోతి వెలయు మల -
అయ్యప్పదేవుని కిష్టమైన మల!
శరణం శరణం అయ్యప్పా
అయ్యప్ప శరణం స్వామి శరణం
స్వామియే శరణం అయ్యప్పా’’
భజన చేస్తున్నవాళ్ల పాటల్లో తాదాత్మ్యం చెంది అందరూ చేతులు చప్పట్లు. కోడుతూ ‘శరణం అయ్యప్పా’ అంటూ గొంతులు కలిపారు !.
🌿సూతమహర్షి కనులు తెరిచి చూడగా..ముని బృందాలు ముక్తకంఠాలతో హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి దివ్య చరిత్రను
మీ నోట వివరంగా తెలుసుకోనే భాగ్యని పొందము స్వామి అనగా..
🌸సుతామహర్షి లింగ వాయు పురాణాలలో భూతనాథోపాఖ్యానము లో చెప్పబడ్డ మణికంఠుడు, ధర్మశాస్త్రా ఉపాఖ్యానాన్ని చిత్తులై శ్రద్దతో విన్నారు పుణ్యఫలని పొందరు
🌿స్వామి దివ్య చరిత్రను విన్న.. చదివిన పారాయణం చేసిన కష్టాలు తిరి శుక శాంతులు కలుగుతాయి అని చెప్పి ముని బృందాలను ఆశీర్వదించి నైమిశారణ్యం గుండా ప్రయాణం సాగించారు..సూతనమహర్షి..🙏
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర సంపూర్ణం..🌞🙏🌹🎻
🌹🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🌹
ఇదిగిదిగో వైకుంఠం
ఈ రెండూ కలిసిన శబరిమల
- అదియే మనకు మోక్షమల
🌿అదిగదిగో పంబానది -
దక్షిణ భారత గంగానది
అదిగదిగో అళుదానది
- కన్నెస్వాములకు ముఖ్యనది
అదిగదిగో కాంతిమల -
🌸కలియుగ జ్యోతి వెలయు మల
మకరజ్యోతి వెలయు మల -
అయ్యప్పదేవుని కిష్టమైన మల!
శరణం శరణం అయ్యప్పా
అయ్యప్ప శరణం స్వామి శరణం
స్వామియే శరణం అయ్యప్పా’’
భజన చేస్తున్నవాళ్ల పాటల్లో తాదాత్మ్యం చెంది అందరూ చేతులు చప్పట్లు. కోడుతూ ‘శరణం అయ్యప్పా’ అంటూ గొంతులు కలిపారు !.
🌿సూతమహర్షి కనులు తెరిచి చూడగా..ముని బృందాలు ముక్తకంఠాలతో హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి దివ్య చరిత్రను
మీ నోట వివరంగా తెలుసుకోనే భాగ్యని పొందము స్వామి అనగా..
🌸సుతామహర్షి లింగ వాయు పురాణాలలో భూతనాథోపాఖ్యానము లో చెప్పబడ్డ మణికంఠుడు, ధర్మశాస్త్రా ఉపాఖ్యానాన్ని చిత్తులై శ్రద్దతో విన్నారు పుణ్యఫలని పొందరు
🌿స్వామి దివ్య చరిత్రను విన్న.. చదివిన పారాయణం చేసిన కష్టాలు తిరి శుక శాంతులు కలుగుతాయి అని చెప్పి ముని బృందాలను ఆశీర్వదించి నైమిశారణ్యం గుండా ప్రయాణం సాగించారు..సూతనమహర్షి..🙏
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర సంపూర్ణం..🌞🙏🌹🎻
🌹🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🌹
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 27వ అధ్యాయం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 27 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿అమ్మను దర్శించుకున్న భక్తులు , ఆ రవికలు అమ్మకు ఇచ్చి పూజ చేయించి , తీసుకుని వచ్చి ఆ కన్యలకు ఇస్తారు
వారు రవికెలు కుట్టించుకుంటారు ! ఆ తల్లి తన వివాహ కోర్కెను , వీరికి వివాహ ప్రాప్తిని కలిగించి , వరం ప్రసాదించి తృప్తి పడుతుంది. ఇక్కడ టెంకాయలు కొట్టరు ! ఇరుముడి లోని ఆ కాయను , దొర్లించి గుడిలో వదిలేస్తారు ! పేలాలు , అటుకులు జల్లుతూ ప్రదక్షిణలు చేస్తారు ! ఏడాదికి ఒకమారు , అమ్మ , - అయ్యప్ప చెప్పిన మాటపై కోలాహలంగా, శరంగుత్తి వచ్చి చూస్తుంది.
🌸అక్కడి కన్నిస్వాములు విడిచిన శరములను చూచి,ఈ సంవత్సరం కూడా కన్నిస్వాములు వచ్చినట్లు గ్రహించి ప్రతి సంవత్సరంలా నిరుత్సాహం చెందుతూ ఉంటుంది మాలికాపురత్తమ్మ ! (కన్నిస్వాములు రాని సంవత్సరం , ఆమెను వివాహం చేసుకుంటానని మణికంఠస్వామి చెప్పారు) అందువల్ల ఆ విధంగా జరగటానికి అవకాశం లేకుండా ప్రతి సంవత్సరం కన్నిస్వాముల సంఖ్య ఎక్కువవుతూనే వుంటున్నది.
🌿మాలికాపురత్తమ్మ ఆలయం దర్శించిన తర్వాత గణపతి ఆలయం, నాగరాజు - నాగయక్షిణిల ఆలయాలను దర్శించుతారు ! ఇక్కడ పూజలు చేసి , నాగులమీద పాటలు పాడతారు ! ఆ విధముగా చేయడంవల్ల సర్వ సర్పదోషాలు , జాతక రీత్యా సంభవించు కష్ట నష్టాలు , తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. పిదప మధ్యలో వచ్చే, అయ్యప్ప మిత్రుల ఆలయాలను కూడా దర్శిస్తారు !
🌸భస్మకొలను
ప్రస్తుతం ఈ కోనేరు స్వామి గుడి వెనుక భస్మకొలను పేరిటనున్నది. ఇందులో భక్తులు స్నానం ఆచరించి , తడిబట్టలతో , స్వామి ఆలయమునకు , పొర్లు దండాలు చేస్తారు. బసకు తిరిగి వెళతారు
🌹ఇరుముడి విప్పటం:🌹
🌿మండల దీక్ష , యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని , ఇతర దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని ఎంతో తృప్తినిండిన హృదయాలతో ఇరుముడలను , గురుస్వాములకు అప్పగిస్తారు దీక్షాధారులు ! గురుస్వామి ఇరుముడులను విప్పి పూజా సామగ్రిని వేరుచేస్తారు ! ముందుగా ముద్ర కాయను పగులగొట్టి అందులోని నేతిని వేరుగా ఒక పాత్రలోకి వేస్తారు !
🌸ఈ నేతి పాత్రతో , గంధం , పంచామృతాలు, విభూది వేరు వేరు పాత్రలలో తీసుకుని దీక్షాధారులు తిరిగి అయ్యప్ప గుడికి వెళ్లి స్వామికి నెయ్యాభిషేకం చేయించి, ఆ నేతిని ప్రసాదంగా స్వీకరించి తమ వెంట తీసుకువెళతారు ! స్వామికి అభిషేకం చేసిన ఈ నెయ్యి పరమ పవిత్రమైనది ! సర్వరోగ నివారిణి !
🌿 దీర్ఘరోగాలతో భాధపడేవారు , ఈ నెయ్యిని కొద్దిగా సేవించటం వల్ల సత్వరంగా ఉపశమనం లభిస్తుంది ! ప్రసాదపు నెయ్యిని జాగ్రత్తగా ఇళ్ళకు తీసుకువెళతారు. అభిషేకానంతరం పూజా ద్రవ్యాలను , గంధం , కొబ్బరికాయలను సమర్పించుతారు !
🌸 ముద్ర కాయ కొబ్బరి చిప్పలు గుడి ముందున్న హోమ గుండంలో వేస్తారు. గణపతి హోమంలో వేసిన కొన్నిటిని ప్రసాదంగా తీసుకుంటారు. తరువాత విభూదిని పళ్లెంలో వేసుకుని , కర్పూర హారతి చూపి , భస్మం ఇతరభక్తులమీద జల్లుతూ అమ్మవారి గుడిని చేరి , ఇరుముడిలో నుండి వేరు చేసిన రవిక గుడ్డలు , పూజాద్రవ్యాలు సమర్పించి తిరిగి రవిక గుడ్డలు ప్రసాదంగా తీసుకొని వస్తారు !
🌿ఇరుముడిలో కట్టి తెచ్చిన మిరియాలను వావరు స్వామి గుడిలో సమర్పిస్తారు ! ఇరుముడి తలమీద పెట్టుకుని స్వామిని దర్శించటం , తిరిగి దానిని విప్పి తెచ్చిన నెయ్యి , ఇతర పూజా ద్రవ్యాలు స్వామికి సమర్పించి ప్రసాదాల తో తిరుగుప్రయాణం కోసం భద్రపరచుకోవడం పూర్తయిన తర్వాత సాయంత్రం మకర జ్యోతి దర్శనం కోసం ఆత్రంగా ఎదురుచూడటం మొదలౌతుంది ! స్వామివారి ఆభరణాలు కూడా ఆ రోజు సాయంత్రానికే సన్నిధానం చేరుకుంటాయి !
🌹స్వామివారి ఆభరణాలు: 🌹
🌸స్వామి రాకుమారుడుగా ధరించిన ఆభరణాలను పందల రాజు , స్వామి తండ్రి అయిన రాజశేఖరుని విన్నపాన్ని అంగీకరించి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతినాడు వాటిని స్వామి విగ్రహానికి అలంకరించడం జరుగుతున్నది ! ఆ ఆభరణాలు వుంచిన మూడు పెట్టెలు పంబల రాజవంశీయుల అధీనంలో ఉంటాయి ! మకర సంక్రాంతినాడు పెట్టెలను ఉత్సవంగా మేళతాళాలతో తలమీద వుంచుకుని బయలుదేరుతారు.
🌿 ప్రస్తుత రాజవంశం రాజు , అప్పుడు స్వయంగా , అయ్యప్ప ఇచ్చిన కరవాలంతో నగల తో పాటు వస్తారు. ఆ సమయం లోనే ఆకాశమార్గాన పెద్ద గరుడ పక్షి ఎగురుతూ, పెట్టెలకు రక్షణగా , శబరిమల దాకా వచ్చి ఆలయం పై ప్రదక్షణాలు చేసి వెళ్ళి పోతుంది. శబరిమలమీద వున్న భక్తులకు ఆ పక్షి కనబడుతుంటుంది. దాన్ని చూసి ఆభరణాల పెట్టెలు బయలుదేరాయని గ్రహిస్తారు భక్తజనం !
🌸అయ్యప్ప దీక్ష విరమణ
తిరిగి తమ ఊర్లకు చేరుకున్న తరువాత ఇరుముడిలో కట్టి తెచ్చిన బియ్యంతో పొంగలి తయారుచేసి ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి ! తరువాత ముందుగా మాల వేయించుకున్న గుడికి వెళ్లి గురు స్వాములను దర్శించుకుంటారు మాలధారులు ! గురుస్వామి మంత్రపూర్వకంగా వారి మెడలనుండి మాల తీసివేయడంతో దీక్ష విరమణ జరుగుతుంది !
🌹అయ్యప్ప మాలావిసర్జన మంత్రం
"అపూర్వమచలా రోగాద్దివ్య దర్శన కారణః
శాస్త్రుముద్రాత్ మహదేవ దేహిమే
వ్రత విమోచన సమస్త సలీద రక్షకన
శరణమయ్యప్ప స్వామియే శరణం " 🌹
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 27 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿అమ్మను దర్శించుకున్న భక్తులు , ఆ రవికలు అమ్మకు ఇచ్చి పూజ చేయించి , తీసుకుని వచ్చి ఆ కన్యలకు ఇస్తారు
వారు రవికెలు కుట్టించుకుంటారు ! ఆ తల్లి తన వివాహ కోర్కెను , వీరికి వివాహ ప్రాప్తిని కలిగించి , వరం ప్రసాదించి తృప్తి పడుతుంది. ఇక్కడ టెంకాయలు కొట్టరు ! ఇరుముడి లోని ఆ కాయను , దొర్లించి గుడిలో వదిలేస్తారు ! పేలాలు , అటుకులు జల్లుతూ ప్రదక్షిణలు చేస్తారు ! ఏడాదికి ఒకమారు , అమ్మ , - అయ్యప్ప చెప్పిన మాటపై కోలాహలంగా, శరంగుత్తి వచ్చి చూస్తుంది.
🌸అక్కడి కన్నిస్వాములు విడిచిన శరములను చూచి,ఈ సంవత్సరం కూడా కన్నిస్వాములు వచ్చినట్లు గ్రహించి ప్రతి సంవత్సరంలా నిరుత్సాహం చెందుతూ ఉంటుంది మాలికాపురత్తమ్మ ! (కన్నిస్వాములు రాని సంవత్సరం , ఆమెను వివాహం చేసుకుంటానని మణికంఠస్వామి చెప్పారు) అందువల్ల ఆ విధంగా జరగటానికి అవకాశం లేకుండా ప్రతి సంవత్సరం కన్నిస్వాముల సంఖ్య ఎక్కువవుతూనే వుంటున్నది.
🌿మాలికాపురత్తమ్మ ఆలయం దర్శించిన తర్వాత గణపతి ఆలయం, నాగరాజు - నాగయక్షిణిల ఆలయాలను దర్శించుతారు ! ఇక్కడ పూజలు చేసి , నాగులమీద పాటలు పాడతారు ! ఆ విధముగా చేయడంవల్ల సర్వ సర్పదోషాలు , జాతక రీత్యా సంభవించు కష్ట నష్టాలు , తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. పిదప మధ్యలో వచ్చే, అయ్యప్ప మిత్రుల ఆలయాలను కూడా దర్శిస్తారు !
🌸భస్మకొలను
ప్రస్తుతం ఈ కోనేరు స్వామి గుడి వెనుక భస్మకొలను పేరిటనున్నది. ఇందులో భక్తులు స్నానం ఆచరించి , తడిబట్టలతో , స్వామి ఆలయమునకు , పొర్లు దండాలు చేస్తారు. బసకు తిరిగి వెళతారు
🌹ఇరుముడి విప్పటం:🌹
🌿మండల దీక్ష , యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని , ఇతర దేవీ దేవతల మందిరాలను దర్శించుకుని ఎంతో తృప్తినిండిన హృదయాలతో ఇరుముడలను , గురుస్వాములకు అప్పగిస్తారు దీక్షాధారులు ! గురుస్వామి ఇరుముడులను విప్పి పూజా సామగ్రిని వేరుచేస్తారు ! ముందుగా ముద్ర కాయను పగులగొట్టి అందులోని నేతిని వేరుగా ఒక పాత్రలోకి వేస్తారు !
🌸ఈ నేతి పాత్రతో , గంధం , పంచామృతాలు, విభూది వేరు వేరు పాత్రలలో తీసుకుని దీక్షాధారులు తిరిగి అయ్యప్ప గుడికి వెళ్లి స్వామికి నెయ్యాభిషేకం చేయించి, ఆ నేతిని ప్రసాదంగా స్వీకరించి తమ వెంట తీసుకువెళతారు ! స్వామికి అభిషేకం చేసిన ఈ నెయ్యి పరమ పవిత్రమైనది ! సర్వరోగ నివారిణి !
🌿 దీర్ఘరోగాలతో భాధపడేవారు , ఈ నెయ్యిని కొద్దిగా సేవించటం వల్ల సత్వరంగా ఉపశమనం లభిస్తుంది ! ప్రసాదపు నెయ్యిని జాగ్రత్తగా ఇళ్ళకు తీసుకువెళతారు. అభిషేకానంతరం పూజా ద్రవ్యాలను , గంధం , కొబ్బరికాయలను సమర్పించుతారు !
🌸 ముద్ర కాయ కొబ్బరి చిప్పలు గుడి ముందున్న హోమ గుండంలో వేస్తారు. గణపతి హోమంలో వేసిన కొన్నిటిని ప్రసాదంగా తీసుకుంటారు. తరువాత విభూదిని పళ్లెంలో వేసుకుని , కర్పూర హారతి చూపి , భస్మం ఇతరభక్తులమీద జల్లుతూ అమ్మవారి గుడిని చేరి , ఇరుముడిలో నుండి వేరు చేసిన రవిక గుడ్డలు , పూజాద్రవ్యాలు సమర్పించి తిరిగి రవిక గుడ్డలు ప్రసాదంగా తీసుకొని వస్తారు !
🌿ఇరుముడిలో కట్టి తెచ్చిన మిరియాలను వావరు స్వామి గుడిలో సమర్పిస్తారు ! ఇరుముడి తలమీద పెట్టుకుని స్వామిని దర్శించటం , తిరిగి దానిని విప్పి తెచ్చిన నెయ్యి , ఇతర పూజా ద్రవ్యాలు స్వామికి సమర్పించి ప్రసాదాల తో తిరుగుప్రయాణం కోసం భద్రపరచుకోవడం పూర్తయిన తర్వాత సాయంత్రం మకర జ్యోతి దర్శనం కోసం ఆత్రంగా ఎదురుచూడటం మొదలౌతుంది ! స్వామివారి ఆభరణాలు కూడా ఆ రోజు సాయంత్రానికే సన్నిధానం చేరుకుంటాయి !
🌹స్వామివారి ఆభరణాలు: 🌹
🌸స్వామి రాకుమారుడుగా ధరించిన ఆభరణాలను పందల రాజు , స్వామి తండ్రి అయిన రాజశేఖరుని విన్నపాన్ని అంగీకరించి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతినాడు వాటిని స్వామి విగ్రహానికి అలంకరించడం జరుగుతున్నది ! ఆ ఆభరణాలు వుంచిన మూడు పెట్టెలు పంబల రాజవంశీయుల అధీనంలో ఉంటాయి ! మకర సంక్రాంతినాడు పెట్టెలను ఉత్సవంగా మేళతాళాలతో తలమీద వుంచుకుని బయలుదేరుతారు.
🌿 ప్రస్తుత రాజవంశం రాజు , అప్పుడు స్వయంగా , అయ్యప్ప ఇచ్చిన కరవాలంతో నగల తో పాటు వస్తారు. ఆ సమయం లోనే ఆకాశమార్గాన పెద్ద గరుడ పక్షి ఎగురుతూ, పెట్టెలకు రక్షణగా , శబరిమల దాకా వచ్చి ఆలయం పై ప్రదక్షణాలు చేసి వెళ్ళి పోతుంది. శబరిమలమీద వున్న భక్తులకు ఆ పక్షి కనబడుతుంటుంది. దాన్ని చూసి ఆభరణాల పెట్టెలు బయలుదేరాయని గ్రహిస్తారు భక్తజనం !
🌸అయ్యప్ప దీక్ష విరమణ
తిరిగి తమ ఊర్లకు చేరుకున్న తరువాత ఇరుముడిలో కట్టి తెచ్చిన బియ్యంతో పొంగలి తయారుచేసి ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి ! తరువాత ముందుగా మాల వేయించుకున్న గుడికి వెళ్లి గురు స్వాములను దర్శించుకుంటారు మాలధారులు ! గురుస్వామి మంత్రపూర్వకంగా వారి మెడలనుండి మాల తీసివేయడంతో దీక్ష విరమణ జరుగుతుంది !
🌹అయ్యప్ప మాలావిసర్జన మంత్రం
"అపూర్వమచలా రోగాద్దివ్య దర్శన కారణః
శాస్త్రుముద్రాత్ మహదేవ దేహిమే
వ్రత విమోచన సమస్త సలీద రక్షకన
శరణమయ్యప్ప స్వామియే శరణం " 🌹
🌿పై మంత్రాన్ని చెప్పిస్తూ మాలను తీయిస్తారు గురుస్వామి ! ఆయనకు కృతజ్ఞతా పూర్వకంగా దక్షిణ తాంబూలాలు సమర్పించి ఇండ్లకు చేరుకుంటారు దీక్ష తీసుకుని యాత్ర చేసుకువచ్చిన భక్తులు !
🌸దీక్షవస్త్రాల పవిత్రత
యాత్రలో ఎన్నో తీర్థాలలో మునిగి, కాలినడకన వెళ్ళేటప్పుడు ఆ ప్రాంత ధూళి సోకి పునీతవౌతాయి దీక్షాధారులు ధరించే వస్త్రాలు ! వాటిని ధరించి స్వామి దర్శనం చేయడంవల్ల వాటికి మరింత పవిత్రత చేకూరుతుంది !
🌿అందుచేత ఇండ్లకు చేరుకోగానే ముందుగా ఆ వస్త్రాలను విప్పి ఒక పాత్రలో తడిపి , ఆ తడిపిన నీటిని ఇల్లంతా ప్రోక్షించాలి ! తరువాత వస్త్రాలను శుభ్రంగా వుతికి , ఆరిన తరువాత శుభ్రమైన స్థానంలో భద్రపరచుకుని తిరిగి యాత్రకు మరుసటి సంవత్సరం వెళ్ళేటప్పుడు వాడుకోవచ్చును !
🌸ఈ వస్త్రదారణవల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ! మనోధైర్యం పెరుగుతుంది ! దీక్షాకాలంలో వాడుకున్న చాప , దుప్పట్లను దీర్ఘరోగాలతో బాధ పడుతున్న వారికి దానం చేయవచ్చును ! మాలలు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఇతరులకు ఇవ్వకుండా ! మరు సంవత్సరం వాటినే ధరించాలి ! దీక్షకాలంలో చేసే నియమాలు వచ్చే పుణ్యఫలమంతా మాలలోనే విలీనమై వుంటుంది !
🌿 ‘‘శబరిమల అయ్యప్పను ప్రతిరోజూ వెళ్లి దర్శనం చేసుకోవడానికి వీలుకాదు ! ఆలయం కొన్ని ప్రత్యేక కాలాలలోనే తెరిచి వుంటుంది !
ఆలయం తెరిచి వుంచే రోజులు
ప్రతి సంవత్సరం నవంబర్ 16 నుండి డిసెంబర్ 27 వరకు ఆలయం తెరిచి ఉంచుతారు ! ఈ కాలాన్ని మండల పూజాకాలం అంటారు.
🌸జనవరి 1 నుండి 20వ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ సమయంలో దేశ విదేశాల నుండి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. మకరజ్యోతి , మకర విళక్కు (దీపం) ఉత్సవాలు చూడటానికి !
మలయాళ పంచాంగం ప్రకారం ప్రతి నెలా మొదటి ఐదు రోజులు ఆలయం తెరిచి వుంటుంది !
🌿అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పంచమి , ఉత్తరా నక్షత్రంతో కూడిన పర్వదినం ! మార్చి ఆఖరు - ఏప్రిల్ మొదటివారంలో వచ్చే ఈ రోజున ‘ఫాల్గుణి ఉత్తర’ పూజ అని స్వామివారికి జన్మనక్షత్ర విశేష పూజలు జరుగుతాయి !
🌸విషు మహోత్సవం:
మలయాళీయుల కొత్త సంవత్సరాదిని ‘విషు ’ అని అంటారు ! ఈ రోజు కేరళ రాష్టమ్రంతటా అయ్యప్పస్వామి వారిని గుడులలో పండ్లు , పూలు , ధాన్యాలతో అలంకరిస్తారు......సశేషం...
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
🌸దీక్షవస్త్రాల పవిత్రత
యాత్రలో ఎన్నో తీర్థాలలో మునిగి, కాలినడకన వెళ్ళేటప్పుడు ఆ ప్రాంత ధూళి సోకి పునీతవౌతాయి దీక్షాధారులు ధరించే వస్త్రాలు ! వాటిని ధరించి స్వామి దర్శనం చేయడంవల్ల వాటికి మరింత పవిత్రత చేకూరుతుంది !
🌿అందుచేత ఇండ్లకు చేరుకోగానే ముందుగా ఆ వస్త్రాలను విప్పి ఒక పాత్రలో తడిపి , ఆ తడిపిన నీటిని ఇల్లంతా ప్రోక్షించాలి ! తరువాత వస్త్రాలను శుభ్రంగా వుతికి , ఆరిన తరువాత శుభ్రమైన స్థానంలో భద్రపరచుకుని తిరిగి యాత్రకు మరుసటి సంవత్సరం వెళ్ళేటప్పుడు వాడుకోవచ్చును !
🌸ఈ వస్త్రదారణవల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ! మనోధైర్యం పెరుగుతుంది ! దీక్షాకాలంలో వాడుకున్న చాప , దుప్పట్లను దీర్ఘరోగాలతో బాధ పడుతున్న వారికి దానం చేయవచ్చును ! మాలలు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఇతరులకు ఇవ్వకుండా ! మరు సంవత్సరం వాటినే ధరించాలి ! దీక్షకాలంలో చేసే నియమాలు వచ్చే పుణ్యఫలమంతా మాలలోనే విలీనమై వుంటుంది !
🌿 ‘‘శబరిమల అయ్యప్పను ప్రతిరోజూ వెళ్లి దర్శనం చేసుకోవడానికి వీలుకాదు ! ఆలయం కొన్ని ప్రత్యేక కాలాలలోనే తెరిచి వుంటుంది !
ఆలయం తెరిచి వుంచే రోజులు
ప్రతి సంవత్సరం నవంబర్ 16 నుండి డిసెంబర్ 27 వరకు ఆలయం తెరిచి ఉంచుతారు ! ఈ కాలాన్ని మండల పూజాకాలం అంటారు.
🌸జనవరి 1 నుండి 20వ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ సమయంలో దేశ విదేశాల నుండి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. మకరజ్యోతి , మకర విళక్కు (దీపం) ఉత్సవాలు చూడటానికి !
మలయాళ పంచాంగం ప్రకారం ప్రతి నెలా మొదటి ఐదు రోజులు ఆలయం తెరిచి వుంటుంది !
🌿అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పంచమి , ఉత్తరా నక్షత్రంతో కూడిన పర్వదినం ! మార్చి ఆఖరు - ఏప్రిల్ మొదటివారంలో వచ్చే ఈ రోజున ‘ఫాల్గుణి ఉత్తర’ పూజ అని స్వామివారికి జన్మనక్షత్ర విశేష పూజలు జరుగుతాయి !
🌸విషు మహోత్సవం:
మలయాళీయుల కొత్త సంవత్సరాదిని ‘విషు ’ అని అంటారు ! ఈ రోజు కేరళ రాష్టమ్రంతటా అయ్యప్పస్వామి వారిని గుడులలో పండ్లు , పూలు , ధాన్యాలతో అలంకరిస్తారు......సశేషం...
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 26వ అధ్యాయం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 26 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿 ఇప్పటికీ ఈ మార్గాన చాలామంది భక్తులు పంబా నదీ తీరాన్ని చేరుకుంటున్నారు. అడవి మార్గాన సుమారుగా 50-60 కి.మీ నడవవలసి వుంటుంది ! అడవి మార్గాన కాకుండా వాహనాలమీద ప్రక్కగా వుండే రహదారి మార్గాన (చిన్నపాదం) కూడా భక్తులు పంబానదీ తీరాన్ని చేరి ఆ రోజుకు అక్కడ విశ్రమిస్తారు ! (అక్కడ నుండి 6 కి.మీ మార్గం నడిచి కొండ ఎక్కి సన్నిధానం చేరుకుంటారు)
🌹పంబానది:🌹
🌸పంబ అంటే పాపవినాశిని అని అర్థం ! దక్షిణదేశపు గంగానదిగా ప్రఖ్యాతిగాంచింది ఈ పంబానది ! ‘దక్షిణ గంగ’ అని కూడా పిలువబడుతున్నది. ఔషధ మూలికల సారంతో ప్రవహించే ఈ నదీ జలాలలో స్నానం శరీరానికి , మనసుకు శాంతిని , ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది !
🌿 పాపవినాశిని గనక భక్తులు ఈ నదీ స్నానం చేయడంవల్ల వారిలోని రజోతమోగుణాలు నశిస్తాయనీ , సాత్విక గుణం మాత్రం కలిగి వుంటారనీ చెప్పబడింది ! శ్రీరామచంద్రుడు కూడా వనవాస కాలంలో ఈ నదిలో స్నానం ఆచరించినట్లు స్థల పురాణంలో చెప్పబడింది ! అందుకు గుర్తుగా పంబా తీరాన రాతి శ్రీరామ పాదాలు దర్శనమిస్తాయి !
🌸అయ్యప్పస్వామి శిశువుగా పంబళరాజుకు పంబాతీరానే దొరకటంవల్ల పంబా తీర దర్శనం , పంబా స్నానం పవిత్రంగా భావించబడుతున్నాయి !
🌹పంబాతర్పణం: 🌹
🌿అయ్యప్పస్వామి సైన్యాలకు , ఉదయనుడి సైన్యాలకు యుద్ధం జరిగినప్పుడు రెండు ప్రక్కల ఎందరో సైనికులు మరణించడం జరిగింది ! చనిపోయినవారికి పంబా తీరానే పిండప్రదానం కావిస్తారు మిగిలిన సైనికులు అయ్యప్ప చెప్పడంతో ! పంబా నీటితో తర్పణాలు విడవటం , పిండ ప్రదానాలు చేయడంవల్ల పితరులకు సద్గతులు కలుగుతాయి. అనంతమైన పుణ్యం లభిస్తుంది ! భక్తులు తమ పూర్వీకులకు పిండప్రదానాలు కావిస్తారు , తర్పణాలు విడుస్తారు ! పంబానదిలో స్నానం ఆచరించి పవిత్రులౌతారు ! దీక్షాకాలంలో ధరించిన నల్లవస్త్రాలు విడిచి కొంతమంది సత్వగుణానికి చిహ్నమైన తెల్లని వస్త్రాలు ధరిస్తారు !
🌹పంబా సద్ది: 🌹
స్నానం, తర్పణాలు ఇవ్వడం పూర్తయిన తర్వాత ఈ తీరాన ‘పంబాసద్ది’ అనే విందు భోజనం తయారుచేస్తారందరూ కలిసి ! ఇక్కడ కాయగూరలు , వంటసామగ్రి కట్టెలు , విస్తరాకులు మొదలైన సరుకులు అమ్మకానికి తీసుకువస్తారు ఆ ప్రాంతంవాళ్లు ! వాటిని కొనుక్కుని విందుభోజనం తయారుచేస్తారు ! ముందుగా ఇరుముడులు వుంచిన స్థలంలో ఒక విస్తరి వేసి అందులో వడ్డిన పదార్థాలన్నిటిని వుంచి అయ్యప్పస్వామికి నివేదన చేస్తారు !
🌸అందులో స్వామి భోజనం ఆరగించుతారని భక్తుల విశ్వాసం ! భక్తులందరూ స్వామి నామస్మరణ చేస్తూ తృప్తిగా భుజించిన తరువాత స్వామి కోసం వేసిన విస్తరాకును వేలం వేస్తారు ! ఆరోగ్యం , సంతానం , ఐశ్వర్యం మొదలైన కోరికలు తీరడం కోసం భక్తులందరూ ఉత్సాహంగా వేలంపాటలో పాల్గొంటారు !
🌿అందరికంటే ఎక్కువ పాడిన భక్తుడు ఆకును స్వంతం చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరగించటం జరుగుతుంది ! తరువాత ఆ ఆకును భక్తిశ్రద్ధలతో తలమీద వుంచుకుని పంబాతీరానికివచ్చి ఆకును నదిలో విడిచిపెట్టడంతో పంబాసద్ది కార్యక్రమం పూర్తవుతుంది !
🌹పంబావిళక్కు: 🌹
🌸విళక్కు అంటే దీపం అని అర్థం ! రాత్రి కాగానే చిన్న ఆకు దొన్నేలలో దీపాలు వెలిగించి నదిలో వదలిపెడతారు ! దీప జ్యోతులు మెల్లగా సాగిపోతూ నయనానందకరంగా కనిపిస్తాయి ! ఈ దీపాలు వదిలే కార్యక్రమాన్ని కన్నిస్వాములు చేస్తారు ! పంబా నదీ తీరంలో వున్న గణపతి , ఆంజనేయస్వాముల గుడులను దర్శించి కొబ్బరికాయలు కొట్టి యాత్ర నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించి రాత్రి పంబా తీరంలో విశ్రమిస్తారు !
🌹నాలుగవ రోజు ప్రయాణం: 🌹
🌿ఉదయాన్నె బయలుదేరి భక్తులు నీలిమల మార్గాన అప్పాచిమేడు చేరుకుంటారు ! ఇక్కడినుండి శబరిగిరి మీదకు ఎక్కటం ప్రారంభిస్తారు ! ముందుగా గిరికి రెండువైపులా వున్న లోయలలోకి భూతగణాల తృప్తికోసం బియ్యపు వుండలు విసురుతారు ! ఆ విధంగా చేయడంవల్ల అవి యాత్రకు ఆటంకం కలిగించవని భక్తుల విశ్వాసం !
🌹శబరిపీఠం: 🌹
🌸మార్గంలో ముందుగా వచ్చేది శబరిపీఠం ! ఈ ప్రాంతంలోనే అయ్యప్ప భక్తురాలు స్వామిని తపస్సుతో సాక్షాత్కరింపజేసుకుని , దర్శించి మోక్షప్రాప్తిని పొందింది ! తర్వాతికాలంలో పంబలరాజ వంశీయులు ఇక్కడ శబరి పేరుమీద విద్యాపీఠాన్ని ఏర్పర్చటం జరిగింది ! ఈ పీఠాన్ని దర్శించి ముందుకు సాగి ‘శీరం గుత్తి’ అనే ప్రాంతాన్ని చేరుకుంటారు.
🌹శీరంగుత్తి:🌹
🌿ఇక్కడే అయ్యప్ప స్వామి సైనికుల ఆయుధాలు రావిచెట్టు క్రింద పెట్టించినందువల్ల యాత్రకు దీక్ష స్వీకరించి వచ్చిన స్వాములు తాము తెచ్చిన శరము , కత్తి , గద మొదలైన ఆయుధాలను ఈ ప్రదేశంలో వుంచుతారు ! గంట తెచ్చిన వాళ్లు గంటను గుడిలో కడతారు ! శీరం గుత్తినుండి కొద్ది దూరంలో శబరిగిరీశుని ఆలయం దర్శనమిస్తుంది ! అదే స్వామి సన్నిధానం ! అక్కడికి చేరడంతో శ్రమ అంతా మాయమై అలౌకికానందంతో మనస్సు , శరీరం పరవశించిపోతాయి !
🌹స్వామి సన్నిధానం 🌹
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 26 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿 ఇప్పటికీ ఈ మార్గాన చాలామంది భక్తులు పంబా నదీ తీరాన్ని చేరుకుంటున్నారు. అడవి మార్గాన సుమారుగా 50-60 కి.మీ నడవవలసి వుంటుంది ! అడవి మార్గాన కాకుండా వాహనాలమీద ప్రక్కగా వుండే రహదారి మార్గాన (చిన్నపాదం) కూడా భక్తులు పంబానదీ తీరాన్ని చేరి ఆ రోజుకు అక్కడ విశ్రమిస్తారు ! (అక్కడ నుండి 6 కి.మీ మార్గం నడిచి కొండ ఎక్కి సన్నిధానం చేరుకుంటారు)
🌹పంబానది:🌹
🌸పంబ అంటే పాపవినాశిని అని అర్థం ! దక్షిణదేశపు గంగానదిగా ప్రఖ్యాతిగాంచింది ఈ పంబానది ! ‘దక్షిణ గంగ’ అని కూడా పిలువబడుతున్నది. ఔషధ మూలికల సారంతో ప్రవహించే ఈ నదీ జలాలలో స్నానం శరీరానికి , మనసుకు శాంతిని , ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది !
🌿 పాపవినాశిని గనక భక్తులు ఈ నదీ స్నానం చేయడంవల్ల వారిలోని రజోతమోగుణాలు నశిస్తాయనీ , సాత్విక గుణం మాత్రం కలిగి వుంటారనీ చెప్పబడింది ! శ్రీరామచంద్రుడు కూడా వనవాస కాలంలో ఈ నదిలో స్నానం ఆచరించినట్లు స్థల పురాణంలో చెప్పబడింది ! అందుకు గుర్తుగా పంబా తీరాన రాతి శ్రీరామ పాదాలు దర్శనమిస్తాయి !
🌸అయ్యప్పస్వామి శిశువుగా పంబళరాజుకు పంబాతీరానే దొరకటంవల్ల పంబా తీర దర్శనం , పంబా స్నానం పవిత్రంగా భావించబడుతున్నాయి !
🌹పంబాతర్పణం: 🌹
🌿అయ్యప్పస్వామి సైన్యాలకు , ఉదయనుడి సైన్యాలకు యుద్ధం జరిగినప్పుడు రెండు ప్రక్కల ఎందరో సైనికులు మరణించడం జరిగింది ! చనిపోయినవారికి పంబా తీరానే పిండప్రదానం కావిస్తారు మిగిలిన సైనికులు అయ్యప్ప చెప్పడంతో ! పంబా నీటితో తర్పణాలు విడవటం , పిండ ప్రదానాలు చేయడంవల్ల పితరులకు సద్గతులు కలుగుతాయి. అనంతమైన పుణ్యం లభిస్తుంది ! భక్తులు తమ పూర్వీకులకు పిండప్రదానాలు కావిస్తారు , తర్పణాలు విడుస్తారు ! పంబానదిలో స్నానం ఆచరించి పవిత్రులౌతారు ! దీక్షాకాలంలో ధరించిన నల్లవస్త్రాలు విడిచి కొంతమంది సత్వగుణానికి చిహ్నమైన తెల్లని వస్త్రాలు ధరిస్తారు !
🌹పంబా సద్ది: 🌹
స్నానం, తర్పణాలు ఇవ్వడం పూర్తయిన తర్వాత ఈ తీరాన ‘పంబాసద్ది’ అనే విందు భోజనం తయారుచేస్తారందరూ కలిసి ! ఇక్కడ కాయగూరలు , వంటసామగ్రి కట్టెలు , విస్తరాకులు మొదలైన సరుకులు అమ్మకానికి తీసుకువస్తారు ఆ ప్రాంతంవాళ్లు ! వాటిని కొనుక్కుని విందుభోజనం తయారుచేస్తారు ! ముందుగా ఇరుముడులు వుంచిన స్థలంలో ఒక విస్తరి వేసి అందులో వడ్డిన పదార్థాలన్నిటిని వుంచి అయ్యప్పస్వామికి నివేదన చేస్తారు !
🌸అందులో స్వామి భోజనం ఆరగించుతారని భక్తుల విశ్వాసం ! భక్తులందరూ స్వామి నామస్మరణ చేస్తూ తృప్తిగా భుజించిన తరువాత స్వామి కోసం వేసిన విస్తరాకును వేలం వేస్తారు ! ఆరోగ్యం , సంతానం , ఐశ్వర్యం మొదలైన కోరికలు తీరడం కోసం భక్తులందరూ ఉత్సాహంగా వేలంపాటలో పాల్గొంటారు !
🌿అందరికంటే ఎక్కువ పాడిన భక్తుడు ఆకును స్వంతం చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరగించటం జరుగుతుంది ! తరువాత ఆ ఆకును భక్తిశ్రద్ధలతో తలమీద వుంచుకుని పంబాతీరానికివచ్చి ఆకును నదిలో విడిచిపెట్టడంతో పంబాసద్ది కార్యక్రమం పూర్తవుతుంది !
🌹పంబావిళక్కు: 🌹
🌸విళక్కు అంటే దీపం అని అర్థం ! రాత్రి కాగానే చిన్న ఆకు దొన్నేలలో దీపాలు వెలిగించి నదిలో వదలిపెడతారు ! దీప జ్యోతులు మెల్లగా సాగిపోతూ నయనానందకరంగా కనిపిస్తాయి ! ఈ దీపాలు వదిలే కార్యక్రమాన్ని కన్నిస్వాములు చేస్తారు ! పంబా నదీ తీరంలో వున్న గణపతి , ఆంజనేయస్వాముల గుడులను దర్శించి కొబ్బరికాయలు కొట్టి యాత్ర నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించి రాత్రి పంబా తీరంలో విశ్రమిస్తారు !
🌹నాలుగవ రోజు ప్రయాణం: 🌹
🌿ఉదయాన్నె బయలుదేరి భక్తులు నీలిమల మార్గాన అప్పాచిమేడు చేరుకుంటారు ! ఇక్కడినుండి శబరిగిరి మీదకు ఎక్కటం ప్రారంభిస్తారు ! ముందుగా గిరికి రెండువైపులా వున్న లోయలలోకి భూతగణాల తృప్తికోసం బియ్యపు వుండలు విసురుతారు ! ఆ విధంగా చేయడంవల్ల అవి యాత్రకు ఆటంకం కలిగించవని భక్తుల విశ్వాసం !
🌹శబరిపీఠం: 🌹
🌸మార్గంలో ముందుగా వచ్చేది శబరిపీఠం ! ఈ ప్రాంతంలోనే అయ్యప్ప భక్తురాలు స్వామిని తపస్సుతో సాక్షాత్కరింపజేసుకుని , దర్శించి మోక్షప్రాప్తిని పొందింది ! తర్వాతికాలంలో పంబలరాజ వంశీయులు ఇక్కడ శబరి పేరుమీద విద్యాపీఠాన్ని ఏర్పర్చటం జరిగింది ! ఈ పీఠాన్ని దర్శించి ముందుకు సాగి ‘శీరం గుత్తి’ అనే ప్రాంతాన్ని చేరుకుంటారు.
🌹శీరంగుత్తి:🌹
🌿ఇక్కడే అయ్యప్ప స్వామి సైనికుల ఆయుధాలు రావిచెట్టు క్రింద పెట్టించినందువల్ల యాత్రకు దీక్ష స్వీకరించి వచ్చిన స్వాములు తాము తెచ్చిన శరము , కత్తి , గద మొదలైన ఆయుధాలను ఈ ప్రదేశంలో వుంచుతారు ! గంట తెచ్చిన వాళ్లు గంటను గుడిలో కడతారు ! శీరం గుత్తినుండి కొద్ది దూరంలో శబరిగిరీశుని ఆలయం దర్శనమిస్తుంది ! అదే స్వామి సన్నిధానం ! అక్కడికి చేరడంతో శ్రమ అంతా మాయమై అలౌకికానందంతో మనస్సు , శరీరం పరవశించిపోతాయి !
🌹స్వామి సన్నిధానం 🌹
🌸గర్భగుడిలోని స్వామిని ఎప్పుడెప్పుడు కన్నుల కరువుదీరా దర్శిద్దామా అన్న ఆత్రుత అందరూ దీక్షాధారులలో , భక్తులలో అధికమౌతుంటుంది ! ఒక వరుసలో శరణుఘోష చెప్పుకుంటూ తూర్పు నుండి స్వామి సన్నిధికి తీసుకువెళ్ళే పద్ధెనిమిది పవిత్రమైన మెట్లును దీక్షాధారులు ఎక్కటం ప్రారంభిస్తారు.
🌹పదునెట్టాంబడి - పద్ధెనిమిది మెట్లు: 🌹
🌿ఇవి పరశురాముని చేత ప్రథమంగా నిర్మింపబడినవి ! పద్ధెనిమిది మంది దేవతలు తమ శక్తులను వీటిలో విలీనం కావించటం, ఈ మెట్ల మీదగా నడిచి అయ్యప్పస్వామి తన పీఠాన్ని చేరి ఆసీనుడు కావటం జరిగాయి ! స్వామి పాద స్పర్శ నోచుకున్న ఈ మహిమాన్వితమైన మెట్లపై కాలు పెట్టడానికి దీక్షాధారులు మాత్రమే అర్హులు ! ఇతరులు ఈ మెట్లపై నుండి కాకుండా మరో ప్రక్కగా వున్న మార్గాన వెళ్లి స్వామిని దర్శించుకుంటారు.
🌹పడిపూజ: 🌹
🌸ఈ మెట్లకు రోజు వాటి పవిత్రత చెదరకుండా వుండటానికి ప్రధాన తంత్రి పూజారులు షోడశోపచారాలతో పూజలు నిర్వర్తిస్తూ వుంటారు ! ఇందువల్ల పొరబాటున దీక్ష స్వీకరించని వాళ్లు ఎవరైనా పాదాలు మోపడం జరిగితే అందువల్ల జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం జరిగి వాటి పవిత్రత తరిగిపోకుండా ఉంటుంది !
🌹మెట్లు ఎక్కటం:🌹
🌿మెట్ల మొదట్లో ఒక ప్రక్క స్వామి మిత్రుడైన కరప్ప స్వామి , మరోప్రక్క కడుత్తన్ స్వామి విగ్రహాలు ఉంటాయి ! వాటికి కొబ్బరికాయలు కొట్టి నమస్కరించి దీక్షాధారులు ఇరుముడి తలమీద జాగ్రత్తగా పెట్టుకుని ఒక్కొక్క మెట్టుగా ఎక్కడం ప్రారంభిస్తారు ! మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్కటి చొప్పున కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్య , ఈర్ష్య , దంబం లనే అష్టరాగాలను మొదటి ఎనిమిది మెట్లు ఎక్కుతూ వాటిని విడిచిపెడుతున్నట్లు స్వామికి మానసికంగా చెప్పుకోవాలి ! మెట్లు యొక్క దేవతకు నమస్కరించుకోవాలి !
🌸తరువాతి ఐదు మెట్లు ఎక్కేటప్పుడు వరసగా నాలుకతో పలికిన తప్పులను కళ్లతో చూసిన చెడును , చెవులతో విన్న పాపపు మాటలను , చేతులతో కాళ్ళతో చేసిన పాపాలను (పంచేంద్రియాలవల్ల జరిగిన అపరాధాలను) మన్నించమని ప్రార్థిస్తూ దేవతలకు నమస్కరిస్తూ ఎక్కాలి ! తరువాత మూడు మెట్లమీద వరసగా సత్వగుణాన్ని వృద్ధి చేయమనీ , రజో , తమో గుణాలను అణివేయమనీ ప్రార్థిస్తూ పైకెక్కాలి !
🌿చివరగా వున్న రెండు మెట్లలో పదిహేడవ మెట్టుమీద అవిద్యవల్ల వచ్చే అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. పద్ధెనిమిదవ మెట్టు మీద నిలబడి జ్ఞానాన్ని ప్రసాదించే సద్విద్య ప్రసాదించమని నమస్కరిస్తూ స్వామి సన్నిధానాన్ని చేరుకోవాలి ! ఈ విధంగా అష్టరాగాలను , పంచతత్వాల చేత జరిగే పాపాలను , త్రిగుణాలను విద్య , అవిద్యలనే వాటిని మొత్తం పద్దెనిమిదింటిని పద్ధెనిమిది మెట్లమీద అదుపు చేసి పరిశుద్ధాత్మలతో మెట్ల మార్గాన సన్నిధానాన్ని చేరుకుంటారు దీక్షాధారులైన భక్తులు.
🌸(ప్రారంభంలో దీక్షాధారులు మెట్లు కొక్కటి చొప్పున కొబ్బరికాయలు కొడుతుండేవారు ! ఆ విధంగా చేయడంవల్ల రాతి మెట్లు శిథిలమవుతుండటం గమనించి కొబ్బరికాయలు కొట్టకూడదని నియమం ఏర్పర్చటం , మెట్లకు రక్షణగా పంచలోహపు తొడుగులను (తాంత్రిక పూజాదులతో శక్తివంతం చేసినవి) ప్రధాన తంత్రుల సహాయంతో రాతిమెట్లకు అమర్చడం జరిగింది. 1985 ప్రాంతంలో)
🌿ఇప్పుడు లోహపు తొడుగుతో బంగారంలా మెరుస్తున్న పద్ధెనిమిది మెట్లను ఎక్కి స్వామి సన్నిధిని చేరుకుంటారు దీక్షాధారులు !
🌹మూల విగ్రహం: 🌹
🌸మెట్లు ఎక్కగానే ముందుగా ద్వజస్తంభం కనిపిస్తుంది! ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేస్తుంటే గణపతి , నాగరాజుల చిన్న గుడులు కనిపిస్తాయి ! వాటికి నమస్కరించి అయ్యప్పస్వామి మూల విగ్రహం ను దర్శించుకుంటారు ! మణికంఠుని మూల విగ్రహం సుమారు 18 అంగుళాల ఎత్తులో , పంచలోహ మూర్తిగా , చిన్ముద్రా , అభయముద్రలతో పట్టబంధముతో పీఠంపై ఆసీనమై దర్శనమిస్తుంది ! అత్యంత మనోహరము , శక్తివంతమూ అయిన మూల విగ్రహాన్ని చూస్తూ భక్త్యావేశంతో పరవశించిపోతారు దీక్షాధారులు . మరొకదారినుండి వచ్చి దర్శించుకున్న ఇతర భక్తజనులు ! ఈ విగ్రహానికే అన్ని రకాల అభిషేకాలు , పూజలు జరుగుతుంటాయి.
🌿ఆ దివ్యమంగళ స్వరూపుడు, భక్తుల పాలిట సులభ సాద్యుడు , అభయ ప్రదాయకుడు , ఆ శాస్తా రూపం లో ఇమిడి ఉన్న అయ్యప్పస్వామిని కన్నుల కరువు తీరా దర్శించి పడమర దిక్కునుంచి క్రిందికి దిగి వస్తారు భక్తులు ! అయ్యప్పస్వామిని దర్శించి ప్రశాంతత నిండిన హృదయాలతో భక్తులు మాలికాపురత్తమ్మ గుడిని చేరుకుంటారు (ఇప్పుడు రెండు గుడుల మధ్య వంతెన కట్టబడి వున్నది)
🌹మాలికాపురత్తమ్మ ఆలయం🌹
🌸మణికంఠుని చేత దైవత్వాన్ని పొందిన మహిషి , మంజల్ మాతా పేరిట , దేవీ శక్తిగా లోకపావని అని పిలువబడుతూ ఇక్కడ కొలువై వున్నది ! మాలికాపురత్తమ్మగా భక్తులను కాపాడుతూ , వారి కోర్కెలను తీర్చ వలసిందిగా అయ్యప్ప చెప్పిన ప్రకారం తనను దర్శించేవారికి శుభాలు ప్రసాదిస్తుంది మాలికాపురత్తమ్మ ! ఈమెను దర్శించుకుని రవిక గుడ్డలు , పసుపు , కుంకుమలు సమర్పిస్తారు !
🌹పదునెట్టాంబడి - పద్ధెనిమిది మెట్లు: 🌹
🌿ఇవి పరశురాముని చేత ప్రథమంగా నిర్మింపబడినవి ! పద్ధెనిమిది మంది దేవతలు తమ శక్తులను వీటిలో విలీనం కావించటం, ఈ మెట్ల మీదగా నడిచి అయ్యప్పస్వామి తన పీఠాన్ని చేరి ఆసీనుడు కావటం జరిగాయి ! స్వామి పాద స్పర్శ నోచుకున్న ఈ మహిమాన్వితమైన మెట్లపై కాలు పెట్టడానికి దీక్షాధారులు మాత్రమే అర్హులు ! ఇతరులు ఈ మెట్లపై నుండి కాకుండా మరో ప్రక్కగా వున్న మార్గాన వెళ్లి స్వామిని దర్శించుకుంటారు.
🌹పడిపూజ: 🌹
🌸ఈ మెట్లకు రోజు వాటి పవిత్రత చెదరకుండా వుండటానికి ప్రధాన తంత్రి పూజారులు షోడశోపచారాలతో పూజలు నిర్వర్తిస్తూ వుంటారు ! ఇందువల్ల పొరబాటున దీక్ష స్వీకరించని వాళ్లు ఎవరైనా పాదాలు మోపడం జరిగితే అందువల్ల జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం జరిగి వాటి పవిత్రత తరిగిపోకుండా ఉంటుంది !
🌹మెట్లు ఎక్కటం:🌹
🌿మెట్ల మొదట్లో ఒక ప్రక్క స్వామి మిత్రుడైన కరప్ప స్వామి , మరోప్రక్క కడుత్తన్ స్వామి విగ్రహాలు ఉంటాయి ! వాటికి కొబ్బరికాయలు కొట్టి నమస్కరించి దీక్షాధారులు ఇరుముడి తలమీద జాగ్రత్తగా పెట్టుకుని ఒక్కొక్క మెట్టుగా ఎక్కడం ప్రారంభిస్తారు ! మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్కటి చొప్పున కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్య , ఈర్ష్య , దంబం లనే అష్టరాగాలను మొదటి ఎనిమిది మెట్లు ఎక్కుతూ వాటిని విడిచిపెడుతున్నట్లు స్వామికి మానసికంగా చెప్పుకోవాలి ! మెట్లు యొక్క దేవతకు నమస్కరించుకోవాలి !
🌸తరువాతి ఐదు మెట్లు ఎక్కేటప్పుడు వరసగా నాలుకతో పలికిన తప్పులను కళ్లతో చూసిన చెడును , చెవులతో విన్న పాపపు మాటలను , చేతులతో కాళ్ళతో చేసిన పాపాలను (పంచేంద్రియాలవల్ల జరిగిన అపరాధాలను) మన్నించమని ప్రార్థిస్తూ దేవతలకు నమస్కరిస్తూ ఎక్కాలి ! తరువాత మూడు మెట్లమీద వరసగా సత్వగుణాన్ని వృద్ధి చేయమనీ , రజో , తమో గుణాలను అణివేయమనీ ప్రార్థిస్తూ పైకెక్కాలి !
🌿చివరగా వున్న రెండు మెట్లలో పదిహేడవ మెట్టుమీద అవిద్యవల్ల వచ్చే అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. పద్ధెనిమిదవ మెట్టు మీద నిలబడి జ్ఞానాన్ని ప్రసాదించే సద్విద్య ప్రసాదించమని నమస్కరిస్తూ స్వామి సన్నిధానాన్ని చేరుకోవాలి ! ఈ విధంగా అష్టరాగాలను , పంచతత్వాల చేత జరిగే పాపాలను , త్రిగుణాలను విద్య , అవిద్యలనే వాటిని మొత్తం పద్దెనిమిదింటిని పద్ధెనిమిది మెట్లమీద అదుపు చేసి పరిశుద్ధాత్మలతో మెట్ల మార్గాన సన్నిధానాన్ని చేరుకుంటారు దీక్షాధారులైన భక్తులు.
🌸(ప్రారంభంలో దీక్షాధారులు మెట్లు కొక్కటి చొప్పున కొబ్బరికాయలు కొడుతుండేవారు ! ఆ విధంగా చేయడంవల్ల రాతి మెట్లు శిథిలమవుతుండటం గమనించి కొబ్బరికాయలు కొట్టకూడదని నియమం ఏర్పర్చటం , మెట్లకు రక్షణగా పంచలోహపు తొడుగులను (తాంత్రిక పూజాదులతో శక్తివంతం చేసినవి) ప్రధాన తంత్రుల సహాయంతో రాతిమెట్లకు అమర్చడం జరిగింది. 1985 ప్రాంతంలో)
🌿ఇప్పుడు లోహపు తొడుగుతో బంగారంలా మెరుస్తున్న పద్ధెనిమిది మెట్లను ఎక్కి స్వామి సన్నిధిని చేరుకుంటారు దీక్షాధారులు !
🌹మూల విగ్రహం: 🌹
🌸మెట్లు ఎక్కగానే ముందుగా ద్వజస్తంభం కనిపిస్తుంది! ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేస్తుంటే గణపతి , నాగరాజుల చిన్న గుడులు కనిపిస్తాయి ! వాటికి నమస్కరించి అయ్యప్పస్వామి మూల విగ్రహం ను దర్శించుకుంటారు ! మణికంఠుని మూల విగ్రహం సుమారు 18 అంగుళాల ఎత్తులో , పంచలోహ మూర్తిగా , చిన్ముద్రా , అభయముద్రలతో పట్టబంధముతో పీఠంపై ఆసీనమై దర్శనమిస్తుంది ! అత్యంత మనోహరము , శక్తివంతమూ అయిన మూల విగ్రహాన్ని చూస్తూ భక్త్యావేశంతో పరవశించిపోతారు దీక్షాధారులు . మరొకదారినుండి వచ్చి దర్శించుకున్న ఇతర భక్తజనులు ! ఈ విగ్రహానికే అన్ని రకాల అభిషేకాలు , పూజలు జరుగుతుంటాయి.
🌿ఆ దివ్యమంగళ స్వరూపుడు, భక్తుల పాలిట సులభ సాద్యుడు , అభయ ప్రదాయకుడు , ఆ శాస్తా రూపం లో ఇమిడి ఉన్న అయ్యప్పస్వామిని కన్నుల కరువు తీరా దర్శించి పడమర దిక్కునుంచి క్రిందికి దిగి వస్తారు భక్తులు ! అయ్యప్పస్వామిని దర్శించి ప్రశాంతత నిండిన హృదయాలతో భక్తులు మాలికాపురత్తమ్మ గుడిని చేరుకుంటారు (ఇప్పుడు రెండు గుడుల మధ్య వంతెన కట్టబడి వున్నది)
🌹మాలికాపురత్తమ్మ ఆలయం🌹
🌸మణికంఠుని చేత దైవత్వాన్ని పొందిన మహిషి , మంజల్ మాతా పేరిట , దేవీ శక్తిగా లోకపావని అని పిలువబడుతూ ఇక్కడ కొలువై వున్నది ! మాలికాపురత్తమ్మగా భక్తులను కాపాడుతూ , వారి కోర్కెలను తీర్చ వలసిందిగా అయ్యప్ప చెప్పిన ప్రకారం తనను దర్శించేవారికి శుభాలు ప్రసాదిస్తుంది మాలికాపురత్తమ్మ ! ఈమెను దర్శించుకుని రవిక గుడ్డలు , పసుపు , కుంకుమలు సమర్పిస్తారు !
🌿అమ్మవారికి సమర్పించిన రవిక గుడ్డలు ఋతుక్రమం సమయంలో స్త్రీలు వాడరాదు. పెళ్లికాని కన్యలు , మంచి భర్తకై ప్ర్రార్థించి , శబరిమల వెళ్ళు భక్తుల ఇరుముడులో తమ స్వహస్తాలతో వేసి , తమ కోర్కును వారు ఆ దేవాది దేవుడి కి చెప్పుకుంటారు. ఇరుముడిలో సమర్పిస్తారు. అమ్మను దర్శించుకున్న భక్తులు , ఆ రవికలు అమ్మకు ఇచ్చి పూజ చేయించి , తీసుకుని వచ్చి ఆ కన్యలకు ఇస్తారు...సశేషం...
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 25వ అధ్యాయం
🎻🌹🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 25 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿జ్యేష్ఠాదేవి పాల సముద్రునికి మహాలక్ష్మికి పూర్వమే జన్మించింది ! ఈమెను శనీశ్వరుడు వివాహం చేసకున్నాడు ! జ్యేష్ఠాదేవి చూపు సోకితే కష్టాలు , దారిద్య్రం సంభవిస్తాయి. శని వక్రదృష్టి సోకినా కష్టాల పరంపర , అనారోగ్యం , ఆపదలు సంభవిస్తాయి !
🌸మానవులు శని భగవానుని తైలాభిషేకాలతో , పూజార్చనలతో సేవించసాగారు వక్రదృష్టిని ప్రసరించవద్దని ప్రార్థిస్తూ !
జ్యేష్ఠాదేవికి ప్రత్యేక పూజార్చనలు చెప్పబడలేదు ! ఆమె విచారంతో తన సోదరి మహాలక్ష్మిని , ఆమె భర్త మహావిష్ణువును దర్శించి తనకు కూడా పూజార్చనలు లభించేలా వరం ప్రసాదించమని కోరింది !
🌿 మహాలక్ష్మి కూడా ఆమె కోర్కెను తీర్చమని భర్తను ప్రార్థించటంతో మహావిష్ణువు జ్యేష్ఠాదేవికి తన రూపమైన అశ్వత్థవృక్ష మూలంలో కూర్చుని వుండమనీ , శనివారాలు ఆ మూలంలో అర్పించే పూజాదికాలు ఆమెకూ చెందుతాయనీ , అందువల్ల శనీశ్వరుని అనుగ్రహం భక్తులకు లభిస్తుందనీ వరం ప్రసాదిస్తాడు !
🌸ఆ కారణగా అశ్వత్థ వృక్ష మూలంలో జ్యేష్ఠాదేవి కూడా వున్నా ఏ విధమైన అశుభాలు జరగవని మహావిష్ణువు సెలవివ్వడంతో ఆందోళన దూరమైంది భక్తులకు !
🌹శనిశ్వరదేవుని మంత్రం🌹
🌿‘‘కోణస్థః పింగళో బ్రభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరిశ్చనైశ్వరో మందః పిపలాదేవ సంస్తుతః "అని పఠించడంవల్ల శనిగ్రహ దోష పరిహారం జరుగుతుంది ! అభీష్ట సిద్ధి లభిస్తుంది ! రావిచెట్టు నీడలో కార్తీకమాసంలో బ్రాహ్మణులకు భోజనం పెడితే అనంతమైన పుణ్యం లభిస్తుంది !
🌸 రావిచెట్టును నాటడం వల్ల నలబై రెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది !
పురాణాలలో చెప్పబడ్డ విషయాలను మాకుతెలిసినంతవరకు తెలియజెప్పాము ! మీరందరూ అశ్వత్థ వృక్ష మహిమను గ్రహించి , పూజించి శుభాలు పొందాలన్నదే ఆ స్వామి సంకల్పం ! వృక్షాన్ని పూజించి మీరందరూ ధన్యులవండి ! అంటూ పూజారులు చెప్పిన విషయాలు విని భక్తిభూరి హృదయాలతో నమస్కరించారందరూ !
🌿ఆయుధాలు తీసుకుని సైనికులు , పందల , పాండ్య రాజుల వెంట తిరిగి తమ స్వస్థానాలకు చేరుకున్నారు ! అయ్యప్ప దయతో సుఖ , శాంతులతో జీవించసాగారు ! పంబలరాజు తమ రాజ్యంలోని అయ్యప్పస్వామి ఆలయంలో తిరిగి పూజార్చనలు యధావిధిగా జరిగేట్లు చేశాడు !
🌸 ఇతర ప్రాంతాలలో కూడా అయ్యప్ప ఆలయాలు వెలిశాయి ! ప్రజలు భక్తి విశ్వాసాలతో స్వామిని కొలుచుకోసాగారు ! వావర్ మొదలైనవారికి కూడా గుడులు ఏర్పాటు చేసి వాళ్లను చిరస్మరణీయులు కావించారు !
🌿‘‘ అయ్యప్పస్వామి తిరిగి అవతరించి దుర్మార్గులను వధించి జనాలను రక్షించి ధర్మాన్ని స్థాపన చేసిన జానపదగాథ ! ఒక విషయం గమనించాలి ? పురాణాలలో మహావిష్ణువు వేరు వేరు రూపాలతో , పేర్లతో అవతరిస్తుంటాడు ! అయ్యప్ప చరితంలో మహిషి సంహారానికి హరిహరుల అంశతో జన్మించిన పుత్రునికి మహావిష్ణువు మణికంఠుడు అనీ , ధర్మశాస్తా అనీ పేర్లు ప్రసాదిస్తే , పరమేశ్వరుడు భూతనాథుడనే పేరుతో భూతగణాలకన్నిటికి నాయకుడిని చేశాడు !
🌸ఆ పుత్రుడు భూలోకంలో మణికంఠుడనే పేరుతో పెరిగి మహిషిని సంహరించాడు ! మణికంఠుడు అవతార లక్ష్యం పూర్తయ్యాక శబరిగిరిమీద శిలారూపంలో ప్రతిష్ఠింపబడ్డాడు ! అయ్యప్ప అనే పేరుతో ఆ ప్రాంత ప్రజలు మణికంఠుని వెళ్లవద్దంటూ ఆర్తిగా వేడుకున్నప్పుడు మణికంఠుడు తాను ఆ పేరుతోనే ప్రసిద్ధుడినౌతానంటూ వరం ప్రసాదించి సంతోషం కలిగించాడు !
🌿అందుకే అయ్యప్ప స్వామిగానే ప్రఖ్యాతి చెందాడు ! ఈ పేరు ప్రజలు పెట్టినది ! మహిషి సంహారం కృతయుగాంతంలో జరిగినట్లు గ్రహించాలి ! తరువాతి యుగాలు గడిచి , కలియుగారంభంలో తిరిగి అరాచకం పంబల దేశ ప్రాంతంలో తలఎత్తినపుడు మణికంఠుడు అయ్యప్ప అనే పేరుతోనే అవతరించి వాళ్లను సంహరించాడు !
🌸తిరిగి తన విగ్రహంలోనే విలీనం చెందాడు ! ఇదే ఈ స్వామిలోని ప్రత్యేకత ! అవతార రూపం , మూల రూపం ఒకే విధంగా , ఒకే పేరుతో వుండటంవల్ల ఎక్కడ వెలసినా ఆ రూపంలోనే ఆ పేరుతోనే ఆరాధింపబడుతున్నాడు ! దేవుడైన విష్ణుమూర్తి భూలోకంలో మానవుడిగా
🌿అవతరించినపుడు రాముడుగా కృష్ణుడుగా వేరే రూపాలతో , పేర్లతో జన్మించడం జరిగింది ! కాని అయ్యప్పస్వామి మణికంఠుడు , ధర్మశాస్తా అనే దైవపరమైన పేర్లకన్నా ప్రజలు పెట్టిన పేరుతోనే పూజింపబడుతున్నాడు ,
‘🌹‘పంబలరాజ్యం , శబరిగిరి 🌹
🌸 వీటిలోనేగాక అయ్యప్పస్వామికి సంబంధించిన పుణ్యక్షేత్రాలింకా ఉన్నాయి ! పంబల రాజ్యం ఇప్పటి కేరళ రాష్ట్రంలోనిది ! కేరళలోనే పురాణ ప్రసిద్ధమైన అయ్యప్పస్వామి ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి.
🌿 వాటిలో శబరిమలతోపాటు మరో నాలుగు చోట్ల వెలసిఉన్న అయ్యప్పస్వామి క్షేత్రాలు మహిమాన్వితమైనవిగా చెప్పబడ్డాయి.
🌸ఈ నాలుగు స్థలాలలో మాత్రం వేరు వేరు రూపాలలో అయ్యప్పస్వామి వెలసి వుండటం ప్రత్యేకతగా చెప్పబడుతున్నది !
🌿 ఆ ప్రాంతాలు , అక్కడ వెలసి వున్న మూర్తులను శబరిమలమీద వెలసి వున్న మూలమూర్తిని కలిపి ‘పంచ అయ్యప్పలు’ గా వ్యవహరిస్తారు ఆ ప్రాంతాలవాళ్లు ! వాటి వివరాలు..
🌷పంచ అయ్యప్పలు:
పంచతత్వ క్షేత్రాలు🌷
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 25 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿జ్యేష్ఠాదేవి పాల సముద్రునికి మహాలక్ష్మికి పూర్వమే జన్మించింది ! ఈమెను శనీశ్వరుడు వివాహం చేసకున్నాడు ! జ్యేష్ఠాదేవి చూపు సోకితే కష్టాలు , దారిద్య్రం సంభవిస్తాయి. శని వక్రదృష్టి సోకినా కష్టాల పరంపర , అనారోగ్యం , ఆపదలు సంభవిస్తాయి !
🌸మానవులు శని భగవానుని తైలాభిషేకాలతో , పూజార్చనలతో సేవించసాగారు వక్రదృష్టిని ప్రసరించవద్దని ప్రార్థిస్తూ !
జ్యేష్ఠాదేవికి ప్రత్యేక పూజార్చనలు చెప్పబడలేదు ! ఆమె విచారంతో తన సోదరి మహాలక్ష్మిని , ఆమె భర్త మహావిష్ణువును దర్శించి తనకు కూడా పూజార్చనలు లభించేలా వరం ప్రసాదించమని కోరింది !
🌿 మహాలక్ష్మి కూడా ఆమె కోర్కెను తీర్చమని భర్తను ప్రార్థించటంతో మహావిష్ణువు జ్యేష్ఠాదేవికి తన రూపమైన అశ్వత్థవృక్ష మూలంలో కూర్చుని వుండమనీ , శనివారాలు ఆ మూలంలో అర్పించే పూజాదికాలు ఆమెకూ చెందుతాయనీ , అందువల్ల శనీశ్వరుని అనుగ్రహం భక్తులకు లభిస్తుందనీ వరం ప్రసాదిస్తాడు !
🌸ఆ కారణగా అశ్వత్థ వృక్ష మూలంలో జ్యేష్ఠాదేవి కూడా వున్నా ఏ విధమైన అశుభాలు జరగవని మహావిష్ణువు సెలవివ్వడంతో ఆందోళన దూరమైంది భక్తులకు !
🌹శనిశ్వరదేవుని మంత్రం🌹
🌿‘‘కోణస్థః పింగళో బ్రభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరిశ్చనైశ్వరో మందః పిపలాదేవ సంస్తుతః "అని పఠించడంవల్ల శనిగ్రహ దోష పరిహారం జరుగుతుంది ! అభీష్ట సిద్ధి లభిస్తుంది ! రావిచెట్టు నీడలో కార్తీకమాసంలో బ్రాహ్మణులకు భోజనం పెడితే అనంతమైన పుణ్యం లభిస్తుంది !
🌸 రావిచెట్టును నాటడం వల్ల నలబై రెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది !
పురాణాలలో చెప్పబడ్డ విషయాలను మాకుతెలిసినంతవరకు తెలియజెప్పాము ! మీరందరూ అశ్వత్థ వృక్ష మహిమను గ్రహించి , పూజించి శుభాలు పొందాలన్నదే ఆ స్వామి సంకల్పం ! వృక్షాన్ని పూజించి మీరందరూ ధన్యులవండి ! అంటూ పూజారులు చెప్పిన విషయాలు విని భక్తిభూరి హృదయాలతో నమస్కరించారందరూ !
🌿ఆయుధాలు తీసుకుని సైనికులు , పందల , పాండ్య రాజుల వెంట తిరిగి తమ స్వస్థానాలకు చేరుకున్నారు ! అయ్యప్ప దయతో సుఖ , శాంతులతో జీవించసాగారు ! పంబలరాజు తమ రాజ్యంలోని అయ్యప్పస్వామి ఆలయంలో తిరిగి పూజార్చనలు యధావిధిగా జరిగేట్లు చేశాడు !
🌸 ఇతర ప్రాంతాలలో కూడా అయ్యప్ప ఆలయాలు వెలిశాయి ! ప్రజలు భక్తి విశ్వాసాలతో స్వామిని కొలుచుకోసాగారు ! వావర్ మొదలైనవారికి కూడా గుడులు ఏర్పాటు చేసి వాళ్లను చిరస్మరణీయులు కావించారు !
🌿‘‘ అయ్యప్పస్వామి తిరిగి అవతరించి దుర్మార్గులను వధించి జనాలను రక్షించి ధర్మాన్ని స్థాపన చేసిన జానపదగాథ ! ఒక విషయం గమనించాలి ? పురాణాలలో మహావిష్ణువు వేరు వేరు రూపాలతో , పేర్లతో అవతరిస్తుంటాడు ! అయ్యప్ప చరితంలో మహిషి సంహారానికి హరిహరుల అంశతో జన్మించిన పుత్రునికి మహావిష్ణువు మణికంఠుడు అనీ , ధర్మశాస్తా అనీ పేర్లు ప్రసాదిస్తే , పరమేశ్వరుడు భూతనాథుడనే పేరుతో భూతగణాలకన్నిటికి నాయకుడిని చేశాడు !
🌸ఆ పుత్రుడు భూలోకంలో మణికంఠుడనే పేరుతో పెరిగి మహిషిని సంహరించాడు ! మణికంఠుడు అవతార లక్ష్యం పూర్తయ్యాక శబరిగిరిమీద శిలారూపంలో ప్రతిష్ఠింపబడ్డాడు ! అయ్యప్ప అనే పేరుతో ఆ ప్రాంత ప్రజలు మణికంఠుని వెళ్లవద్దంటూ ఆర్తిగా వేడుకున్నప్పుడు మణికంఠుడు తాను ఆ పేరుతోనే ప్రసిద్ధుడినౌతానంటూ వరం ప్రసాదించి సంతోషం కలిగించాడు !
🌿అందుకే అయ్యప్ప స్వామిగానే ప్రఖ్యాతి చెందాడు ! ఈ పేరు ప్రజలు పెట్టినది ! మహిషి సంహారం కృతయుగాంతంలో జరిగినట్లు గ్రహించాలి ! తరువాతి యుగాలు గడిచి , కలియుగారంభంలో తిరిగి అరాచకం పంబల దేశ ప్రాంతంలో తలఎత్తినపుడు మణికంఠుడు అయ్యప్ప అనే పేరుతోనే అవతరించి వాళ్లను సంహరించాడు !
🌸తిరిగి తన విగ్రహంలోనే విలీనం చెందాడు ! ఇదే ఈ స్వామిలోని ప్రత్యేకత ! అవతార రూపం , మూల రూపం ఒకే విధంగా , ఒకే పేరుతో వుండటంవల్ల ఎక్కడ వెలసినా ఆ రూపంలోనే ఆ పేరుతోనే ఆరాధింపబడుతున్నాడు ! దేవుడైన విష్ణుమూర్తి భూలోకంలో మానవుడిగా
🌿అవతరించినపుడు రాముడుగా కృష్ణుడుగా వేరే రూపాలతో , పేర్లతో జన్మించడం జరిగింది ! కాని అయ్యప్పస్వామి మణికంఠుడు , ధర్మశాస్తా అనే దైవపరమైన పేర్లకన్నా ప్రజలు పెట్టిన పేరుతోనే పూజింపబడుతున్నాడు ,
‘🌹‘పంబలరాజ్యం , శబరిగిరి 🌹
🌸 వీటిలోనేగాక అయ్యప్పస్వామికి సంబంధించిన పుణ్యక్షేత్రాలింకా ఉన్నాయి ! పంబల రాజ్యం ఇప్పటి కేరళ రాష్ట్రంలోనిది ! కేరళలోనే పురాణ ప్రసిద్ధమైన అయ్యప్పస్వామి ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి.
🌿 వాటిలో శబరిమలతోపాటు మరో నాలుగు చోట్ల వెలసిఉన్న అయ్యప్పస్వామి క్షేత్రాలు మహిమాన్వితమైనవిగా చెప్పబడ్డాయి.
🌸ఈ నాలుగు స్థలాలలో మాత్రం వేరు వేరు రూపాలలో అయ్యప్పస్వామి వెలసి వుండటం ప్రత్యేకతగా చెప్పబడుతున్నది !
🌿 ఆ ప్రాంతాలు , అక్కడ వెలసి వున్న మూర్తులను శబరిమలమీద వెలసి వున్న మూలమూర్తిని కలిపి ‘పంచ అయ్యప్పలు’ గా వ్యవహరిస్తారు ఆ ప్రాంతాలవాళ్లు ! వాటి వివరాలు..
🌷పంచ అయ్యప్పలు:
పంచతత్వ క్షేత్రాలు🌷
🌹కుళత్తుపుల - అనే క్షేత్రంలో🌹
🌸అయ్యప్పస్వామి విగ్రహం బాలుని రూపంలో వుంటుంది ! అందాలు చిందే పసిబాలుడుగా సాలగ్రామ శిలారూపంలో ‘కుళత్తూర్ అయ్యన్’ అనే పేరుతో పూజింపబడుతున్నాడు.
🌿ఆలయ సమీపంలో వున్న పుష్కరిణిలో స్నానం ఆచరించడంవల్ల చర్మరోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం ! ఈ క్షేత్రం జీవి హృదయస్థానంలో వుండే వాయుతత్త్వంతో కూడిన అనాహత చక్రానికి ప్రతీకగా స్థల పురాణంలో చెప్పబడింది !
🌹ఆర్యన్గావ్ - కుళత్తపుల 🌹
🌸క్షేత్రానికి సుమారు పద్ధెనిమిది మైళ్ల దూరంలో వున్న ఈ క్షేత్రంలో కళ్యాణమూర్తిగా పూర్ణా , పుష్కళా దేవేరుల సహితంగా దర్శనమిస్తాడు అయ్యప్పస్వామి ! ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి , దేవేరుల కళ్యాణం వైభవంగా జరుపుతారు ! జీవి నాభి స్థానంలో వుండే అగ్నితత్వం గల మణిపూరక చక్రానికి ఈ క్షేత్రం ప్రతీకగా చెప్పబడింది !
🌹అచ్చన్ కోవిల్ :🌹
🌿 జలతత్త్వమైన , నాభికి క్రిందగా వుండే స్వాధిష్టాన చక్రానికి ప్రతీకగా వెలసి వున్న ఈ క్షేత్రంలో రుద్రాక్ష శిలారూపంలో వెలసి వున్న అయ్యప్పస్వామి గృహస్థుగా పూజింపబడుతున్నాడు !
🌹ఎరుమేలి : 🌹
🌸ఇక్కడ ఆలయంలో ధర్మశాస్తా కిరాత పురుషునిగా (వేటగాడు)గా దర్శనమిస్తాడు. ఈ ఎరుమేలిలోనే అయ్యప్పస్వామి మిత్రుడైన వావరు గుడి వున్నది ! శబరిమల యాత్రలో భక్తులందరూ ఎరుమేలి చేరి అయ్యప్ప ఆటవిక పురుషుని రూపంలో వున్నందువల్ల తాము కూడా ఆటవిక వేషాలు ధరించి , తాము తీసుకువెళుతున్న ఆయుధాలను చేతబట్టి (కత్తి , గద , బాణం మొదలైనవి) అయ్యప్ప భజన చేస్తూ నాట్యం చేస్తుంటారు.
🌿 దీన్ని ‘వేటతుళ్లి’ అంటారు ! ఈ విధంగా చేయడంవల్ల స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం ! జీవి శరీరంలోని పృథ్వీతత్వమైన మూలాధార చక్రానికి ప్రతీకగా ఈ స్థానం చెప్పబడింది !
🌹శబరిమల :🌹
🌸జీవి కనుబొమ్మల మధ్య వుండే ఆజ్ఞా చక్రానికి ప్రతీకగా శబరిమల ! ఇక్కడ స్వామి జ్యోతి రూపంలో మకర సంక్రాంతినాడు దర్శనం ప్రసాదిస్తాడు ! ఈ ఐదు క్షేత్రాలేగాక పంబల రాజ్యంలోని ధర్మశాస్తా ఆలయం వెలసి వున్న ప్రాంతం జీవి కంఠ ప్రదేశంలో వుండే ఆకాశ తత్వాన్ని గల విశుద్ధి చక్రానికి ప్రతీకలా చెప్పబడింది.
🌿 ఇక్కడ స్వామిని బాలశాస్తాగా పూజించడం ఆనవాయితీ ! కేరళ రాష్ట్రంలో ప్రధానమైన అయ్యప్ప క్షేత్రాలు అవి ! ఇక ఇప్పుడు దక్షిణాపథంలోని ఇతర రాష్ట్రాలో గూడా అయ్యప్పస్వామికి ఎన్నో గుడులు నిర్మించబడ్డాయి. భక్తులు కూడా ఎక్కువైనారు ! దీక్షాధారులే కాక అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులతో కార్తీకమాసం నుండి శబరిమలకు వెళ్ళేదారులంతా జన సందోహంతో నిండి వుంటుంది !
🌹శబరిమల యాత్ర విషయాలు🌹
🌸పూర్వకాలంలో శబరిమల యాత్ర చేయడం చాలా కష్టంగా వుండేది ! క్రూరమృగాలతో నిండిన ఘోరారణ్యాల మధ్య , ముళ్లతో నిండిన సన్నని కాలిబాటల వెంట కాలినడకన సుమారు 50 కి.మీ ప్రయాణం చేయాల్సి వచ్చేది !
🌿 అయినా ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని పలుకుతూ , మార్గాయాసాన్ని లెక్కచేయకుండా మూడు రోజులు నడిచి శబరిమలను చేరుకునేవాళ్లు భక్తులు ! ఈ మార్గాన్ని ‘పెద్దపాదం’ అని వ్యవహరిస్తారు ! యాత్రకు పురుషులకు వయస్సు పరిమితి లేదు ! పిల్లలను కూడా తీసుకువెళ్లవచ్చును.
🌸 స్త్రీలు మాత్రం 12 నుండి 50 సంవత్సరాల వయస్సు వారు యాత్ర చేయరాదన్న నియమం వున్నది ! (ఆడపిల్లలు వ్యక్తులవ్వడానికి ముందు , స్త్రీలు బహిష్టు ఆగిన తర్వాత మాత్రమే యాత్రకు అర్హులు)
🌹యాత్ర ఆరంభం: 🌹
🌿ఇరుముడి తలమీద పెట్టుకుని గురుస్వామి వెంట భక్తులు శరణుఘోష చేస్తూ మొదటి మజిలీ ఎరుమేలి చేరుకుంటారు !
🌹మొదటిరోజు మజిలీ ఎరుమేలి:🌹
🌸ఈ క్షేత్రాన్ని చేరగానే అందరిలో ఉత్సాహం పొంగులువారుతుంది. ఇక్కడ కిరాత వేషంలో వున్న వేట శాస్తా గుడి , స్వామి మిత్రుడైన వావరు సమాధి ఉన్నాయి. ఇక్కడ అందరూ ఇరుముడులు శుభ్రమైన స్థలంలో భద్రపరిచి , వేటగాళ్లలా వేషాలు వేసుకుని , అయ్యప్ప భజన చేస్తూ తమ వెంట తెచ్చిన ఆయుధాలు పట్టుకుని కొంతసేపు నాట్యం చేస్తారు ! ఈ కార్యక్రమాన్ని ‘వేటతుళ్లి’ అంటారు. ఈ విధంగా ఆడి పాడటంవల్ల స్వామి ఆనందిస్తాడన్నది ప్రజల విశ్వాసం !
🌿 ఆ కార్యక్రమం ముగిసాక గుడిలో స్వామిని దర్శించి కొబ్బరికాయలు కొట్టి , వావరు గుడికి ప్రదక్షిణలు చేస్తారు ! స్వామి ఆదేశం ప్రకారం వావర్ తమ వెంట అరణ్యమార్గంలో తోడుగా వుండి ప్రమాదాలు సంభవించకుండా చూస్తాడన్న విశ్వాసంతో అక్కడనుండి ముందుకు సాగి ‘పేరూరు తోడు’ అనే నదీ ప్రాంతాన్ని చేరుకుంటారు ! ఆ నది భక్తులు స్నానం ఆచరించడానికి వీలుగా కొండలమీది నుండి క్రిందకు ప్రవహిస్తూ ఉంటుంది ! ఇక్కడ స్నానాలు చేసి శుభ్ర వస్త్రాలు ధరించి భక్తులు ‘కాళైకట్టె’ ప్రాంతాన్ని చేరుకుంటారు !
🌹కాళైకట్టె: 🌹
🌸 ఆ ప్రాంత భాష అయిన మలయాళంలో ‘కాళై’ అంటే వృషభం అనీ , కట్టె అంటే కట్టివేయటం అనీ అర్థం ! మణికంఠుడు మహిషిని మర్దించే సమయంలో చూడటానికి వచ్చిన పరమేశ్వరుడు ఈ స్థలంలోనే తన నంది వాహనాన్ని కట్టివేసినట్లు ఇక్కడి స్థల పురాణం తెలుపుతున్నది !
🌸అయ్యప్పస్వామి విగ్రహం బాలుని రూపంలో వుంటుంది ! అందాలు చిందే పసిబాలుడుగా సాలగ్రామ శిలారూపంలో ‘కుళత్తూర్ అయ్యన్’ అనే పేరుతో పూజింపబడుతున్నాడు.
🌿ఆలయ సమీపంలో వున్న పుష్కరిణిలో స్నానం ఆచరించడంవల్ల చర్మరోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం ! ఈ క్షేత్రం జీవి హృదయస్థానంలో వుండే వాయుతత్త్వంతో కూడిన అనాహత చక్రానికి ప్రతీకగా స్థల పురాణంలో చెప్పబడింది !
🌹ఆర్యన్గావ్ - కుళత్తపుల 🌹
🌸క్షేత్రానికి సుమారు పద్ధెనిమిది మైళ్ల దూరంలో వున్న ఈ క్షేత్రంలో కళ్యాణమూర్తిగా పూర్ణా , పుష్కళా దేవేరుల సహితంగా దర్శనమిస్తాడు అయ్యప్పస్వామి ! ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి , దేవేరుల కళ్యాణం వైభవంగా జరుపుతారు ! జీవి నాభి స్థానంలో వుండే అగ్నితత్వం గల మణిపూరక చక్రానికి ఈ క్షేత్రం ప్రతీకగా చెప్పబడింది !
🌹అచ్చన్ కోవిల్ :🌹
🌿 జలతత్త్వమైన , నాభికి క్రిందగా వుండే స్వాధిష్టాన చక్రానికి ప్రతీకగా వెలసి వున్న ఈ క్షేత్రంలో రుద్రాక్ష శిలారూపంలో వెలసి వున్న అయ్యప్పస్వామి గృహస్థుగా పూజింపబడుతున్నాడు !
🌹ఎరుమేలి : 🌹
🌸ఇక్కడ ఆలయంలో ధర్మశాస్తా కిరాత పురుషునిగా (వేటగాడు)గా దర్శనమిస్తాడు. ఈ ఎరుమేలిలోనే అయ్యప్పస్వామి మిత్రుడైన వావరు గుడి వున్నది ! శబరిమల యాత్రలో భక్తులందరూ ఎరుమేలి చేరి అయ్యప్ప ఆటవిక పురుషుని రూపంలో వున్నందువల్ల తాము కూడా ఆటవిక వేషాలు ధరించి , తాము తీసుకువెళుతున్న ఆయుధాలను చేతబట్టి (కత్తి , గద , బాణం మొదలైనవి) అయ్యప్ప భజన చేస్తూ నాట్యం చేస్తుంటారు.
🌿 దీన్ని ‘వేటతుళ్లి’ అంటారు ! ఈ విధంగా చేయడంవల్ల స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం ! జీవి శరీరంలోని పృథ్వీతత్వమైన మూలాధార చక్రానికి ప్రతీకగా ఈ స్థానం చెప్పబడింది !
🌹శబరిమల :🌹
🌸జీవి కనుబొమ్మల మధ్య వుండే ఆజ్ఞా చక్రానికి ప్రతీకగా శబరిమల ! ఇక్కడ స్వామి జ్యోతి రూపంలో మకర సంక్రాంతినాడు దర్శనం ప్రసాదిస్తాడు ! ఈ ఐదు క్షేత్రాలేగాక పంబల రాజ్యంలోని ధర్మశాస్తా ఆలయం వెలసి వున్న ప్రాంతం జీవి కంఠ ప్రదేశంలో వుండే ఆకాశ తత్వాన్ని గల విశుద్ధి చక్రానికి ప్రతీకలా చెప్పబడింది.
🌿 ఇక్కడ స్వామిని బాలశాస్తాగా పూజించడం ఆనవాయితీ ! కేరళ రాష్ట్రంలో ప్రధానమైన అయ్యప్ప క్షేత్రాలు అవి ! ఇక ఇప్పుడు దక్షిణాపథంలోని ఇతర రాష్ట్రాలో గూడా అయ్యప్పస్వామికి ఎన్నో గుడులు నిర్మించబడ్డాయి. భక్తులు కూడా ఎక్కువైనారు ! దీక్షాధారులే కాక అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులతో కార్తీకమాసం నుండి శబరిమలకు వెళ్ళేదారులంతా జన సందోహంతో నిండి వుంటుంది !
🌹శబరిమల యాత్ర విషయాలు🌹
🌸పూర్వకాలంలో శబరిమల యాత్ర చేయడం చాలా కష్టంగా వుండేది ! క్రూరమృగాలతో నిండిన ఘోరారణ్యాల మధ్య , ముళ్లతో నిండిన సన్నని కాలిబాటల వెంట కాలినడకన సుమారు 50 కి.మీ ప్రయాణం చేయాల్సి వచ్చేది !
🌿 అయినా ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని పలుకుతూ , మార్గాయాసాన్ని లెక్కచేయకుండా మూడు రోజులు నడిచి శబరిమలను చేరుకునేవాళ్లు భక్తులు ! ఈ మార్గాన్ని ‘పెద్దపాదం’ అని వ్యవహరిస్తారు ! యాత్రకు పురుషులకు వయస్సు పరిమితి లేదు ! పిల్లలను కూడా తీసుకువెళ్లవచ్చును.
🌸 స్త్రీలు మాత్రం 12 నుండి 50 సంవత్సరాల వయస్సు వారు యాత్ర చేయరాదన్న నియమం వున్నది ! (ఆడపిల్లలు వ్యక్తులవ్వడానికి ముందు , స్త్రీలు బహిష్టు ఆగిన తర్వాత మాత్రమే యాత్రకు అర్హులు)
🌹యాత్ర ఆరంభం: 🌹
🌿ఇరుముడి తలమీద పెట్టుకుని గురుస్వామి వెంట భక్తులు శరణుఘోష చేస్తూ మొదటి మజిలీ ఎరుమేలి చేరుకుంటారు !
🌹మొదటిరోజు మజిలీ ఎరుమేలి:🌹
🌸ఈ క్షేత్రాన్ని చేరగానే అందరిలో ఉత్సాహం పొంగులువారుతుంది. ఇక్కడ కిరాత వేషంలో వున్న వేట శాస్తా గుడి , స్వామి మిత్రుడైన వావరు సమాధి ఉన్నాయి. ఇక్కడ అందరూ ఇరుముడులు శుభ్రమైన స్థలంలో భద్రపరిచి , వేటగాళ్లలా వేషాలు వేసుకుని , అయ్యప్ప భజన చేస్తూ తమ వెంట తెచ్చిన ఆయుధాలు పట్టుకుని కొంతసేపు నాట్యం చేస్తారు ! ఈ కార్యక్రమాన్ని ‘వేటతుళ్లి’ అంటారు. ఈ విధంగా ఆడి పాడటంవల్ల స్వామి ఆనందిస్తాడన్నది ప్రజల విశ్వాసం !
🌿 ఆ కార్యక్రమం ముగిసాక గుడిలో స్వామిని దర్శించి కొబ్బరికాయలు కొట్టి , వావరు గుడికి ప్రదక్షిణలు చేస్తారు ! స్వామి ఆదేశం ప్రకారం వావర్ తమ వెంట అరణ్యమార్గంలో తోడుగా వుండి ప్రమాదాలు సంభవించకుండా చూస్తాడన్న విశ్వాసంతో అక్కడనుండి ముందుకు సాగి ‘పేరూరు తోడు’ అనే నదీ ప్రాంతాన్ని చేరుకుంటారు ! ఆ నది భక్తులు స్నానం ఆచరించడానికి వీలుగా కొండలమీది నుండి క్రిందకు ప్రవహిస్తూ ఉంటుంది ! ఇక్కడ స్నానాలు చేసి శుభ్ర వస్త్రాలు ధరించి భక్తులు ‘కాళైకట్టె’ ప్రాంతాన్ని చేరుకుంటారు !
🌹కాళైకట్టె: 🌹
🌸 ఆ ప్రాంత భాష అయిన మలయాళంలో ‘కాళై’ అంటే వృషభం అనీ , కట్టె అంటే కట్టివేయటం అనీ అర్థం ! మణికంఠుడు మహిషిని మర్దించే సమయంలో చూడటానికి వచ్చిన పరమేశ్వరుడు ఈ స్థలంలోనే తన నంది వాహనాన్ని కట్టివేసినట్లు ఇక్కడి స్థల పురాణం తెలుపుతున్నది !
🌿ఇక్కడ వున్న పార్వతీ పరమేశ్వరులు , గణపతి , సుబ్రహ్మణ్యస్వామి , నాగరాజుల గుడులను దర్శించుకుని భక్తులు అక్కడికి దగ్గరలో వున్న అళుదానది దగ్గరకు చేరుకుని రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు ! వంట చేసుకుని తిని రాత్రంతా భజన చేస్తూ గడుపుతారు !
🌹అళుదానది: 🌹
🌸ఇది ఒక చిన్న జలప్రవాహం ! మహిషిని సంహరించడానికి మణికంఠుడు ఆమె శరీరాన్ని మర్దిస్తున్నపుడు జ్ఞానోదయమై తనకు క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకుంటూ విషాదంతో కన్నీరు కారుస్తుంది మహిషి ! ఆ కన్నీరే అళుదా (కన్నీళ్ళు) నదిగా ఏర్పడిందని స్థల పురాణం తెలిజేస్తున్నది.
🌿 వనమూలికలు , ఔషధాల సారం గల ఈ అళుదానది నీటిలో స్నానం దేహానికి ఆరోగ్యాన్ని , మనస్సుకు శాంతిని ప్రసాదిస్తాయి. ఈ నదీ ప్రాంతంలోనే ఉదయనుడనే గజదొంగను చంపడానికి సైన్యాలతో బయలుదేరిన అయ్యప్ప విడిది చేసినట్లు కూడా జానపదగాథలలో తెలుపబడింది. మర్నాడు పొద్దున అళుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో నుండి రెండు రాళ్లను తీసుకుని వాటితో రెండవ రోజు ప్రయాణం మొదలుపెడతారు భక్తులు !
🌹రెండవ రోజు ప్రయాణం: 🌹
🌸అళుదానదీ స్నానం ముగించుకుని , అందులో నుండి రెండు రాళ్లు ఏరుకుని భద్రపరచుకుని అళుదామేడు అనే కొండ ప్రాంతాన్ని చేరుకుంటారు యాత్రికులు !
🌹అళుదామేడు: 🌹
🌿మేడు అంటే కొండ ! సుమారు 5 కి.మీ ఎతైన గుండ్రని రాళ్ళతో కూడిన ఈ కొండను శరణుఘోష చెప్పుకుంటూ ఎక్కుతారు యాత్రికులు. ఈ కొండ శిఖరానికి కొంచెం క్రిందగా ‘కళ్లడుంకుండ్రు’ అనే ప్రదేశం ఉన్నది !
🌹కళ్లడుంకుండ్రు: 🌹
🌸మహిషిని వధించి , ఆ శరీరాన్ని ఆకాశంపైకి విసురుతాడు మణికంఠుడు ! ఆ కళేబరం వచ్చి భూమిపై పడ్డ స్థలమే ఈ ‘కళ్లడుంకుండ్రు’గా* స్థల పురాణంలో తెలుపబడింది ! దేవతలు మహిషి కళేబరం మీద అళుదానది నుండి తీసిన రాళ్ళు విసిరి ఆ స్థలంలో సమాధి గావించారట. అందుకు గుర్తుగా భక్తులు అళుదానది నుండి ఏరుకుని తెచ్చిన రెండేసి రాళ్లను ఆ ప్రదేశంలో వుంచడం ఆచారంగా మారింది ! అక్కడ కర్పూర హారతులు ఇచ్చి నమస్కరించి ముందుకు సాగుతారు !
🌹ఇంజిపారకోట:🌹
🌿అళుదామేడు శిఖరాన్ని ఇంజిపారకోట అంటారు! పూర్వం ఉదయనుడి కోట వుండిన స్థలంగా ఈ ప్రదేశం చెప్పబడింది ! ఇక్కడే అయ్యప్పస్వామి ఉదయనుడిని హతమార్చటం జరిగింది ! ఇక్కడ నీరు చిన్న కాలువగా ప్రవహిస్తూ ఉండటంవల్ల భక్తులు కొంతసేపు విశ్రమించి కొండదిగటం ప్రారంభిస్తారు ! శరణుఘోష చెప్పుకుంటూ ‘కరిమలతోడు’ అనే ప్రదేశాన్ని చేరుకుంటారు !
🌹కరిమలత్తోడు: 🌹
🌸కరి అంటే ఏనుగు , మల అంటే కొండ , తోడు అంటే నీరు ! ఈ ప్రాంతమంతా ఏనుగులతో నిండి వుండటంవల్ల ఈ కొండ ప్రాంతానికి ‘కరిమల’ అనే పేరు వచ్చింది ! ఇక్కడి పిల్లకాలువలలో నీరు ప్రవహిస్తూ వుండటంవల్ల ఏనుగులు ఈ కాలవల దగ్గరకు వస్తుంటాయి.
🌿ఇక్కడ నీరు పాత్రలతో నింపుకుని నిటారుగా వున్న కొండను ఎక్కటం ప్రారంభిస్తారు భక్తులు ! సుమారు పది కి.మీ పైకి ఎక్కి వెళ్లి కొండ శిఖరం చేరుకుంటారు ! ఈ కొండ శిఖరాన్ని ‘కరిమల ఉచ్చ’ అని పిలుస్తారు.
🌸ఇక్కడ ఒక దివ్యమైన బావి , జలపాతం దర్శనమిస్తాయి ! బావిలో నీరు ఎప్పుడూ వూరుతూనే వుండటం ఆశ్చర్యకరంగా భావించబడుతున్నది ! వాటికి పసుపు , కుంకుమలు సమర్పించి , కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి నమస్కరించి అక్కడ ఏర్పరచిన హుండీలో డబ్బులు సమర్పించి నమస్కరిస్తారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు ! బస చేసే స్థలాలను ‘తావళం’ అంటారు !
🌹మూడవ రోజు ప్రయాణం: 🌹
🌿మూడవ రోజు ఉదయాన్నే భక్తులు కరిమలఉచ్ఛ నుండి దిగటం ప్రారంభిస్తారు. ఈ కొండ దిగటం కూడా ఎంతో కష్టం ! అయినా అయ్యప్ప శరణు ఘోష చెప్పుకుంటూ దిగి పెరియాన పట్టం అనే ప్రదేశాన్ని చేరుతారు.
🌹పెరియాన పట్టం: 🌹
🌸పెరి అంటే పెద్ద , యాన అంటే ఏనుగు , పట్టం అంటే స్థలం అని అర్థం మలయాళ భాషలో ! ఇక్కడ ఒక కాలువలో నీరు ప్రవహిస్తుంటుంది. ఆ నీరు త్రాగి దాహం తీర్చుకోవటానికి పెద్ద పెద్ద ఏనుగులు , ఇతర వన్యమృగాలు వస్తుంటాయి కనుక భక్తులు ఇక్కడ ఎక్కువసేపు ఆగరు ! రాత్రుళ్లు బస చేయరు !
🌿ఇక్కడ నుండి కొద్ది దూరంలో ప్రవహిస్తున్న పంబానది కనిపిస్తుంటుంది ! భక్తులు ఉత్సాహంగా ఆ వైపు నడక సాగిస్తారు ! అడవి మార్గాన కాలినడకన వచ్చే యాత్రికులు పంబానది చేరడంతో మార్గంలో పడిన కష్టాలను మరిచి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు ! కష్టంతో....సశేషం...
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹అళుదానది: 🌹
🌸ఇది ఒక చిన్న జలప్రవాహం ! మహిషిని సంహరించడానికి మణికంఠుడు ఆమె శరీరాన్ని మర్దిస్తున్నపుడు జ్ఞానోదయమై తనకు క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకుంటూ విషాదంతో కన్నీరు కారుస్తుంది మహిషి ! ఆ కన్నీరే అళుదా (కన్నీళ్ళు) నదిగా ఏర్పడిందని స్థల పురాణం తెలిజేస్తున్నది.
🌿 వనమూలికలు , ఔషధాల సారం గల ఈ అళుదానది నీటిలో స్నానం దేహానికి ఆరోగ్యాన్ని , మనస్సుకు శాంతిని ప్రసాదిస్తాయి. ఈ నదీ ప్రాంతంలోనే ఉదయనుడనే గజదొంగను చంపడానికి సైన్యాలతో బయలుదేరిన అయ్యప్ప విడిది చేసినట్లు కూడా జానపదగాథలలో తెలుపబడింది. మర్నాడు పొద్దున అళుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో నుండి రెండు రాళ్లను తీసుకుని వాటితో రెండవ రోజు ప్రయాణం మొదలుపెడతారు భక్తులు !
🌹రెండవ రోజు ప్రయాణం: 🌹
🌸అళుదానదీ స్నానం ముగించుకుని , అందులో నుండి రెండు రాళ్లు ఏరుకుని భద్రపరచుకుని అళుదామేడు అనే కొండ ప్రాంతాన్ని చేరుకుంటారు యాత్రికులు !
🌹అళుదామేడు: 🌹
🌿మేడు అంటే కొండ ! సుమారు 5 కి.మీ ఎతైన గుండ్రని రాళ్ళతో కూడిన ఈ కొండను శరణుఘోష చెప్పుకుంటూ ఎక్కుతారు యాత్రికులు. ఈ కొండ శిఖరానికి కొంచెం క్రిందగా ‘కళ్లడుంకుండ్రు’ అనే ప్రదేశం ఉన్నది !
🌹కళ్లడుంకుండ్రు: 🌹
🌸మహిషిని వధించి , ఆ శరీరాన్ని ఆకాశంపైకి విసురుతాడు మణికంఠుడు ! ఆ కళేబరం వచ్చి భూమిపై పడ్డ స్థలమే ఈ ‘కళ్లడుంకుండ్రు’గా* స్థల పురాణంలో తెలుపబడింది ! దేవతలు మహిషి కళేబరం మీద అళుదానది నుండి తీసిన రాళ్ళు విసిరి ఆ స్థలంలో సమాధి గావించారట. అందుకు గుర్తుగా భక్తులు అళుదానది నుండి ఏరుకుని తెచ్చిన రెండేసి రాళ్లను ఆ ప్రదేశంలో వుంచడం ఆచారంగా మారింది ! అక్కడ కర్పూర హారతులు ఇచ్చి నమస్కరించి ముందుకు సాగుతారు !
🌹ఇంజిపారకోట:🌹
🌿అళుదామేడు శిఖరాన్ని ఇంజిపారకోట అంటారు! పూర్వం ఉదయనుడి కోట వుండిన స్థలంగా ఈ ప్రదేశం చెప్పబడింది ! ఇక్కడే అయ్యప్పస్వామి ఉదయనుడిని హతమార్చటం జరిగింది ! ఇక్కడ నీరు చిన్న కాలువగా ప్రవహిస్తూ ఉండటంవల్ల భక్తులు కొంతసేపు విశ్రమించి కొండదిగటం ప్రారంభిస్తారు ! శరణుఘోష చెప్పుకుంటూ ‘కరిమలతోడు’ అనే ప్రదేశాన్ని చేరుకుంటారు !
🌹కరిమలత్తోడు: 🌹
🌸కరి అంటే ఏనుగు , మల అంటే కొండ , తోడు అంటే నీరు ! ఈ ప్రాంతమంతా ఏనుగులతో నిండి వుండటంవల్ల ఈ కొండ ప్రాంతానికి ‘కరిమల’ అనే పేరు వచ్చింది ! ఇక్కడి పిల్లకాలువలలో నీరు ప్రవహిస్తూ వుండటంవల్ల ఏనుగులు ఈ కాలవల దగ్గరకు వస్తుంటాయి.
🌿ఇక్కడ నీరు పాత్రలతో నింపుకుని నిటారుగా వున్న కొండను ఎక్కటం ప్రారంభిస్తారు భక్తులు ! సుమారు పది కి.మీ పైకి ఎక్కి వెళ్లి కొండ శిఖరం చేరుకుంటారు ! ఈ కొండ శిఖరాన్ని ‘కరిమల ఉచ్చ’ అని పిలుస్తారు.
🌸ఇక్కడ ఒక దివ్యమైన బావి , జలపాతం దర్శనమిస్తాయి ! బావిలో నీరు ఎప్పుడూ వూరుతూనే వుండటం ఆశ్చర్యకరంగా భావించబడుతున్నది ! వాటికి పసుపు , కుంకుమలు సమర్పించి , కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి నమస్కరించి అక్కడ ఏర్పరచిన హుండీలో డబ్బులు సమర్పించి నమస్కరిస్తారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు ! బస చేసే స్థలాలను ‘తావళం’ అంటారు !
🌹మూడవ రోజు ప్రయాణం: 🌹
🌿మూడవ రోజు ఉదయాన్నే భక్తులు కరిమలఉచ్ఛ నుండి దిగటం ప్రారంభిస్తారు. ఈ కొండ దిగటం కూడా ఎంతో కష్టం ! అయినా అయ్యప్ప శరణు ఘోష చెప్పుకుంటూ దిగి పెరియాన పట్టం అనే ప్రదేశాన్ని చేరుతారు.
🌹పెరియాన పట్టం: 🌹
🌸పెరి అంటే పెద్ద , యాన అంటే ఏనుగు , పట్టం అంటే స్థలం అని అర్థం మలయాళ భాషలో ! ఇక్కడ ఒక కాలువలో నీరు ప్రవహిస్తుంటుంది. ఆ నీరు త్రాగి దాహం తీర్చుకోవటానికి పెద్ద పెద్ద ఏనుగులు , ఇతర వన్యమృగాలు వస్తుంటాయి కనుక భక్తులు ఇక్కడ ఎక్కువసేపు ఆగరు ! రాత్రుళ్లు బస చేయరు !
🌿ఇక్కడ నుండి కొద్ది దూరంలో ప్రవహిస్తున్న పంబానది కనిపిస్తుంటుంది ! భక్తులు ఉత్సాహంగా ఆ వైపు నడక సాగిస్తారు ! అడవి మార్గాన కాలినడకన వచ్చే యాత్రికులు పంబానది చేరడంతో మార్గంలో పడిన కష్టాలను మరిచి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు ! కష్టంతో....సశేషం...
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 24వ అధ్యాయం
🎻🌹🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 24 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿అందరూ భక్తిపూర్వకంగా తలలూపారు !
అయ్యప్ప లేచి ‘‘సెలవు భక్తులారా !’ అని గబగబా మెట్లెక్కి వెళ్లి స్వామి విగ్రహం ముందు నిలిచాడు ! ఒక దివ్య
జ్యోతి అయ్యప్ప నుండి విగ్రహంలోకి ప్రవేశించి అదృశ్యమైంది ! ‘‘అయ్యప్ప అదృశ్యమైనాడు ! చూస్తున్న వాళ్లందరూ ఒక్కసారిగా ‘స్వామియే శరణం అయ్యప్ప ! శరణం అయ్యప్పా ! మా నమ్మకం నిజమని నిరూపించావు ! మానవునిగా జన్మించి దుండగులందరినీ హతం కావించి మాకు శాంతిని ప్రసాదించిన అయ్యప్పవు ! నీకు కోటి కోటి ప్రణామాలు !’’ అంటూ నమస్కరించారు !
🌸అయ్యప్ప విలీనం కావడంతో మరింత జాజ్వలమానంగా ప్రకాశిస్తూ దర్శనమిచ్చింది పరశురామునిచే ప్రతిష్ఠింపబడిన మణికంఠుని విగ్రహం ! స్వామి పూజా కార్యక్రమాలు నిర్వర్తించే పూజారులు విగ్రహాన్ని వివిధ ద్రవ్యాలతో పూజిస్తుంటే భక్తులందరూ మైమరచి చూడసాగారు ! అభిషేకాలు చేస్తూ అందువల్ల కలిగే ఫలితాలను కూడా తెలియచెప్పారు పూజారులు (తంత్రులు)
🌹అభిషేకాలు - వాటి ఫలితాలు🌹
🌿పాలాభిషేకం - యశోవృద్ధి
పెరుగు అభిషేకం - వంశవృద్ధి కలుగుతుంది
కొబ్బరినీరు అభిషేకం - సత్సంతానం , మంచిబుద్ధి ప్రసాదిస్తుంది
తేనె అభిషేకం - సిరిసంపదలు , తరగని ఐశ్వర్యం కలుగుతాయి
చెరుకురసం - శాస్త్ర జ్ఞాన వృద్ధి కావిస్తుంది
పానకం - సంకల్ప సిద్ధి కలుగుతుంది
పంచామృత అభిషేకం (పాలు , పెరుగు , నెయ్యి , తేనె , పంచదార) - దీర్ఘాయుస్సు లభిస్తుంది.
శుద్దోదక స్నానం (మంచినీటితో అభిషేకం) - రెండూ అశ్వమేధ యాగఫలం ప్రసాదిస్తాయి
కుంభజల (కలశ జలం) - మానసిక శాంతిని అచంచలమైన భక్తిభావం మనస్సులో స్థిరమౌతాయి !
🌸ఆవు నెయ్యితో అభిషేకం - ఇహ పర సౌఖ్యాలు లభిస్తాయి. ఐశ్వర్యభివృద్ధి కలుగుంది. అంతలో మోక్షప్రాప్తి !
గంథంతో అభిషేకం - పుత్రలాభం , స్వర్గభోగాలు లభిస్తాయి
భస్మంతో అభిషేకం - మహాపాపాలు నాశనం
పన్నీరుతో అభిషేకం - మనోబలాన్నిస్తుంది
పచ్చకర్పూరంతో అభిషేకం - ఋణబాధ విముక్తి కలుగుతుంది
శంఖం నీటితో అభిషేకం - రోగవిముక్తి , ఆరోగ్యాభివృద్ధి
🌿సహస్రధార నీటితో అభిషేకం - ధనలాభం
ఫలాలతో అభిషేకం (ముక్కలుగా కోసి లేక రసం తీసి) - వ్యవసాయాభివృద్ధి , శతృవులపై విజయం
శుద్ధాన్నం (కొద్దిగా నెయ్యి వేసి వండిన అన్నం)తో - దేహకాంతి , సర్వ తీర్థాలలో పగటి పూట మాత్రమే అభిషేకం చేయవచ్చును. స్నానమాచరించిన పుణ్యఫలం లభిస్తాయి.
అన్ని రకాల పుష్పాలతో అభిషేకం - కుటుంబ సౌఖ్యం , పాపనివృత్తి లభిస్తాయి.
నవరత్నాలతో అభిషేకం - గ్రహదోహ నివారణ , శాంతి సౌఖ్యాలు కలుగుతాయి.
🌸పూజారులు వచ్చినవాళ్ళకోసం స్వామి అభిషేకాలవల్ల కలిగే ఫలితాలు తెలియజేశారు ! విన్నవాళ్లందరూ భక్తి పారవశ్యంతో స్వామికి జరుగుతున్న పూజా కార్యక్రమాన్ని చూస్తూ మైమరచి భజన చేయసాగారు.
🌹అయ్యప్పస్వామి భజన
"పాలాభిషేకం స్వామికే
స్వామికే పాలాభిషేకం
నెయ్యాభిషేకం స్వామికే
స్వామికే నెయ్యాభిషేకం
పెరుగాభిషేకం స్వామికే స్వామికే పెరుగాభిషేకం
తేనే అభిషేకం స్వామికే -
స్వామికే తేనాభిషేకం
చందనాభిషేకం స్వామికే
స్వామికే చందనాభిషేకం
పూలాభిషేకం స్వామికే
స్వామికే పూలాభిషేకం
కట్టారదీపం స్వామికే
స్వామికే కర్పూర దీపం
స్వామియే శరణం అయ్యప్పా - అయ్యప్పా స్వామియే !! "🌹
🌿 భజనానంతరం కర్పూర హారతి చూపారు స్వామికి శ్రావ్యంగా జేగంటలు మ్రోగిస్తూ - మంగళ హారతి గానం చేశారు.
🌹అయ్యప్ప స్వామి హారతి🌹
🌹"ఓం ఓం ఓంకార రూపునకు
మంగళం జయమంగళం
నాద బిందు కళాతీత
గురుమూరితకి మంగళం జయ మంగళం
మందహాస భక్తవరదునకు
మంగళం జయమంగళం
పూర్ణాపుష్కళ నాధునకు ,
భూతనాథునకు మంగళం జయమంగళం ! " 🌹
🌸 హారతి అందరూ భక్తిగా కళ్లకద్దుకున్నారు ! తీర్థ , ప్రసాదాలు స్వీకరించారు ! అంతవరకు నిశ్శబ్దంగా కూర్చుని , కళ్ళు మూసుకుని అయ్యప్ప ధ్యానంలో నిమగ్నమై వుండిన వావరు , కొచ్చుకడత్త , కరప్ప , మల్లన్ , విల్లన్లు ఒక్కసారిగా లేచి ‘‘స్వామియే శరణం ! మిత్రా ! నిన్ను విడిచి ఇక మేము వుండలేము ! మమ్మల్ని నీలో చేర్చుకో స్వామీ !’’ అని పెద్దగా అంటూ నేలపై ఒరిగిపోయారు ! వారి జవాత్మలు విడుదలై పరమాత్మలో విలీనమైనాయి ! అందరూ ఆ హఠాత్పరిణామానికి ముందు నిర్ఘాంతపోయినా కొద్దిసేపటికి తేరుకున్నారు ! పూజారులు ఈ విధంగా చెప్పారు !
🌹నవవిధ భక్తులు🌹
🌿‘ఈ నలుగురు అయ్యప్పకు ఆప్తమిత్రులు ! ఆ స్వామిని మిత్రునిగా భావించి ఎప్పుడూ ఆయన దగ్గరే వుండాలని ఆశించడం కూడా భక్తి మార్గాలలో ఒకటి ! ప్రజలారా ! మీ అందరికీ తెలుసో లేదో మరి ! మేము చెప్పేది జాగ్రత్తగా వినండి ! భగవంతుని ఆరాధించి ఆ స్వామిని చేరుకోవడానికి నవ విధ (తొమ్మిది) భక్తి మార్గాలలు పురాణాలలో చెప్పబడ్డాయి.
🌸 వాటిలో సఖ్యత్వం (స్నేహం , మైత్రి) ఆ స్వామిని సేవించడం ఒక మార్గం ! పూర్వం విభీషణుడు , సుగ్రీవుడు స్వామితో మైత్రి చేసి ఆ మార్గాన తరించారు !
మిగిలిన ఎనిమిది మార్గాల గూర్చి చెబుతాము , వినండి !
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 24 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿అందరూ భక్తిపూర్వకంగా తలలూపారు !
అయ్యప్ప లేచి ‘‘సెలవు భక్తులారా !’ అని గబగబా మెట్లెక్కి వెళ్లి స్వామి విగ్రహం ముందు నిలిచాడు ! ఒక దివ్య
జ్యోతి అయ్యప్ప నుండి విగ్రహంలోకి ప్రవేశించి అదృశ్యమైంది ! ‘‘అయ్యప్ప అదృశ్యమైనాడు ! చూస్తున్న వాళ్లందరూ ఒక్కసారిగా ‘స్వామియే శరణం అయ్యప్ప ! శరణం అయ్యప్పా ! మా నమ్మకం నిజమని నిరూపించావు ! మానవునిగా జన్మించి దుండగులందరినీ హతం కావించి మాకు శాంతిని ప్రసాదించిన అయ్యప్పవు ! నీకు కోటి కోటి ప్రణామాలు !’’ అంటూ నమస్కరించారు !
🌸అయ్యప్ప విలీనం కావడంతో మరింత జాజ్వలమానంగా ప్రకాశిస్తూ దర్శనమిచ్చింది పరశురామునిచే ప్రతిష్ఠింపబడిన మణికంఠుని విగ్రహం ! స్వామి పూజా కార్యక్రమాలు నిర్వర్తించే పూజారులు విగ్రహాన్ని వివిధ ద్రవ్యాలతో పూజిస్తుంటే భక్తులందరూ మైమరచి చూడసాగారు ! అభిషేకాలు చేస్తూ అందువల్ల కలిగే ఫలితాలను కూడా తెలియచెప్పారు పూజారులు (తంత్రులు)
🌹అభిషేకాలు - వాటి ఫలితాలు🌹
🌿పాలాభిషేకం - యశోవృద్ధి
పెరుగు అభిషేకం - వంశవృద్ధి కలుగుతుంది
కొబ్బరినీరు అభిషేకం - సత్సంతానం , మంచిబుద్ధి ప్రసాదిస్తుంది
తేనె అభిషేకం - సిరిసంపదలు , తరగని ఐశ్వర్యం కలుగుతాయి
చెరుకురసం - శాస్త్ర జ్ఞాన వృద్ధి కావిస్తుంది
పానకం - సంకల్ప సిద్ధి కలుగుతుంది
పంచామృత అభిషేకం (పాలు , పెరుగు , నెయ్యి , తేనె , పంచదార) - దీర్ఘాయుస్సు లభిస్తుంది.
శుద్దోదక స్నానం (మంచినీటితో అభిషేకం) - రెండూ అశ్వమేధ యాగఫలం ప్రసాదిస్తాయి
కుంభజల (కలశ జలం) - మానసిక శాంతిని అచంచలమైన భక్తిభావం మనస్సులో స్థిరమౌతాయి !
🌸ఆవు నెయ్యితో అభిషేకం - ఇహ పర సౌఖ్యాలు లభిస్తాయి. ఐశ్వర్యభివృద్ధి కలుగుంది. అంతలో మోక్షప్రాప్తి !
గంథంతో అభిషేకం - పుత్రలాభం , స్వర్గభోగాలు లభిస్తాయి
భస్మంతో అభిషేకం - మహాపాపాలు నాశనం
పన్నీరుతో అభిషేకం - మనోబలాన్నిస్తుంది
పచ్చకర్పూరంతో అభిషేకం - ఋణబాధ విముక్తి కలుగుతుంది
శంఖం నీటితో అభిషేకం - రోగవిముక్తి , ఆరోగ్యాభివృద్ధి
🌿సహస్రధార నీటితో అభిషేకం - ధనలాభం
ఫలాలతో అభిషేకం (ముక్కలుగా కోసి లేక రసం తీసి) - వ్యవసాయాభివృద్ధి , శతృవులపై విజయం
శుద్ధాన్నం (కొద్దిగా నెయ్యి వేసి వండిన అన్నం)తో - దేహకాంతి , సర్వ తీర్థాలలో పగటి పూట మాత్రమే అభిషేకం చేయవచ్చును. స్నానమాచరించిన పుణ్యఫలం లభిస్తాయి.
అన్ని రకాల పుష్పాలతో అభిషేకం - కుటుంబ సౌఖ్యం , పాపనివృత్తి లభిస్తాయి.
నవరత్నాలతో అభిషేకం - గ్రహదోహ నివారణ , శాంతి సౌఖ్యాలు కలుగుతాయి.
🌸పూజారులు వచ్చినవాళ్ళకోసం స్వామి అభిషేకాలవల్ల కలిగే ఫలితాలు తెలియజేశారు ! విన్నవాళ్లందరూ భక్తి పారవశ్యంతో స్వామికి జరుగుతున్న పూజా కార్యక్రమాన్ని చూస్తూ మైమరచి భజన చేయసాగారు.
🌹అయ్యప్పస్వామి భజన
"పాలాభిషేకం స్వామికే
స్వామికే పాలాభిషేకం
నెయ్యాభిషేకం స్వామికే
స్వామికే నెయ్యాభిషేకం
పెరుగాభిషేకం స్వామికే స్వామికే పెరుగాభిషేకం
తేనే అభిషేకం స్వామికే -
స్వామికే తేనాభిషేకం
చందనాభిషేకం స్వామికే
స్వామికే చందనాభిషేకం
పూలాభిషేకం స్వామికే
స్వామికే పూలాభిషేకం
కట్టారదీపం స్వామికే
స్వామికే కర్పూర దీపం
స్వామియే శరణం అయ్యప్పా - అయ్యప్పా స్వామియే !! "🌹
🌿 భజనానంతరం కర్పూర హారతి చూపారు స్వామికి శ్రావ్యంగా జేగంటలు మ్రోగిస్తూ - మంగళ హారతి గానం చేశారు.
🌹అయ్యప్ప స్వామి హారతి🌹
🌹"ఓం ఓం ఓంకార రూపునకు
మంగళం జయమంగళం
నాద బిందు కళాతీత
గురుమూరితకి మంగళం జయ మంగళం
మందహాస భక్తవరదునకు
మంగళం జయమంగళం
పూర్ణాపుష్కళ నాధునకు ,
భూతనాథునకు మంగళం జయమంగళం ! " 🌹
🌸 హారతి అందరూ భక్తిగా కళ్లకద్దుకున్నారు ! తీర్థ , ప్రసాదాలు స్వీకరించారు ! అంతవరకు నిశ్శబ్దంగా కూర్చుని , కళ్ళు మూసుకుని అయ్యప్ప ధ్యానంలో నిమగ్నమై వుండిన వావరు , కొచ్చుకడత్త , కరప్ప , మల్లన్ , విల్లన్లు ఒక్కసారిగా లేచి ‘‘స్వామియే శరణం ! మిత్రా ! నిన్ను విడిచి ఇక మేము వుండలేము ! మమ్మల్ని నీలో చేర్చుకో స్వామీ !’’ అని పెద్దగా అంటూ నేలపై ఒరిగిపోయారు ! వారి జవాత్మలు విడుదలై పరమాత్మలో విలీనమైనాయి ! అందరూ ఆ హఠాత్పరిణామానికి ముందు నిర్ఘాంతపోయినా కొద్దిసేపటికి తేరుకున్నారు ! పూజారులు ఈ విధంగా చెప్పారు !
🌹నవవిధ భక్తులు🌹
🌿‘ఈ నలుగురు అయ్యప్పకు ఆప్తమిత్రులు ! ఆ స్వామిని మిత్రునిగా భావించి ఎప్పుడూ ఆయన దగ్గరే వుండాలని ఆశించడం కూడా భక్తి మార్గాలలో ఒకటి ! ప్రజలారా ! మీ అందరికీ తెలుసో లేదో మరి ! మేము చెప్పేది జాగ్రత్తగా వినండి ! భగవంతుని ఆరాధించి ఆ స్వామిని చేరుకోవడానికి నవ విధ (తొమ్మిది) భక్తి మార్గాలలు పురాణాలలో చెప్పబడ్డాయి.
🌸 వాటిలో సఖ్యత్వం (స్నేహం , మైత్రి) ఆ స్వామిని సేవించడం ఒక మార్గం ! పూర్వం విభీషణుడు , సుగ్రీవుడు స్వామితో మైత్రి చేసి ఆ మార్గాన తరించారు !
మిగిలిన ఎనిమిది మార్గాల గూర్చి చెబుతాము , వినండి !
🌿శ్రవణం (వినడం) ద్వారా భగవంతుని ఆరాధించవచ్చును ! భగవంతుని గూర్చి , ఆ స్వామి లీలల గూర్చి పెద్దలు చెబుతుంటే వినడం ద్వారా భక్తిభావం హృదయాలలో బలపడి ఆ మార్గాన స్వామిని సేవించడం జరుగుతుంది !
🌸 పరీక్ష్మిన్మహారాజు వారం రోజులపాటు భాగవత పురాణాన్ని విని తరించిన విషయం మీకందరికీ తెలుసు కదా ! దాస్యం (సేవ చేయడం కింకరునిలాగా) భగవంతుని సేవించడం ఎంతటి పుణ్య ప్రదమో దాసాంజనేయస్వామి లోకాలకు తాను స్వయంగా ఆచరించి తెలియచెప్పాడు ! ‘నన్ను నీ కింకరునిగా (సేవకునిగా) స్వీకరించు , వేరే ఏమీ అవసరం లేదు ’ అని వేడుకుంటూ స్వామిని చేరుకోవడం ఒక భక్తిమార్గం !
🌿వందనం - నమస్కరించడం కూడా ఒక భక్తిమార్గమే ! పదే పదే నమస్కరిస్తూ ధ్యానించడంవల్ల భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది !
🌸అర్చనం - షోడోపచారాలతో అర్చించడం మీదే భక్తిమార్గాన్ని సామాన్యంగా భక్తులందరూ అనుసరిస్తుంటారు !
🌿సంకీర్తనం - స్వామి లీలలను పాడుతూ తరించడం ! దీన్ని భజన అని కూడా అంటారు ! స్వామి మీద పాటలు రాసి , వాటిని పాడుతూ , వాటిలో తాదాత్మ్యం చెందిన ఆనందానుభూతిని పొందడం ఒక భక్తి మార్గంగా చెప్పబడింది !
🌸పాదసేవనం - స్వామి పాదాలను వత్తుతూ ఆనందానుభూతి చెందడం ! ఆ భాగ్యం అందరికి సులభంగా లభించేది కాదు ! అయినా భక్తి మార్గంలో ఆ విధంగా పాదసేవనం చేస్తున్నట్లు అనుభూతి చెందవచ్చును ! ఇది ఒక మార్గం ! పరమ భాగోవోత్తములు అనుసరించేది !
🌿స్మరణం - ఎల్లప్పుడూ స్వామి నామాన్ని స్మరిస్తూ (ద్యానిస్తూ) వుండటం వల్ల భగవదనుగ్రహం లభిస్తుంది ! ‘నామస్మరణ ధన్యోపాయం’ (నామస్మరణ జన్మ ధన్యత్వం పొందే ఉపాయం) అని చెప్పబడింది ! అందుకే నిరంతరం అయ్యప్ప నామస్మరణ చేస్తూ వుండటంవల్ల క్రమంగా ఆ భక్తి మార్గం మిమ్మల్ని స్వామి సన్నిధికి చేరుస్తుంది !
🌸ఆత్మ నివేదనం - జీవాత్మను పరమాత్మకు నివేదన చేయడం భక్తి పరాకాష్టను తెలుపుతుంది నా సర్వస్వాన్ని నీకు అర్పిస్తున్నాను ! నాకు ఏ కోర్కెలు లేవు ! నన్ను నీలో ఐక్యం చేసుకో ! అని ఎప్పుడైతే నిర్మలమైన మనస్సును స్వామికి అర్పణ కావిస్తారో వాల్లను తనలో ఐక్యం చేసుకుని ముక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు !
🌿 ఈ విధంగా స్త్రీలు ఆత్మ నివేదన చేయడాన్ని ‘మధురభక్తి’ మార్గమని గూడా అంటారు !
స్త్రీ రూపంలోని జీవాత్మను పురుష రూపంలో ఊహించుకుంటూ ఆత్మనివేదన చేసి ముక్తి పొందడానికి గోపికలను ఉదాహరణగా చెప్పుకోవచ్చును ! వాళ్లు నిర్మల హృదయాలతో శ్రీకృష్ణునిలో తాదాత్మ్యం చెందాలని కోరుకున్నందువల్ల వాళ్లందరికి ముక్తిని అనుఘ్రహించాడు శ్రీకృష్ణ పరమాత్మ !
🌸భక్తులారా ! మీకు సందర్భం వచ్చింది గనుక నవ విధ భక్తుల గూర్చి తెలియజెప్పాము ! ఈ నలుగురు సఖ్య భక్తిమార్గంలో అయ్యప్పస్వామిలో ఐక్యమైనారు ! వాళ్లు ధన్యజీవులు ! వీళ్లకు దహన సంస్కారాలు కావించి పంపా నదిలో తర్పణాలు విడవండి ! మీరందరూ మీకు అనుకూలమైన మార్గాలలో అయ్యప్పస్వామిని ఆరాధించి ధన్యులు కండి !
🌿పూజారులు చెప్పిన విషయాలను ఏకాగ్రతతో , భక్తిశ్రద్ధలతో విన్నారు రాజులు , ప్రజలు గూడా !
‘‘మా నాయకులే మాకు ఆదర్శం ! మేమూ అయ్యప్ప స్వామిని ఆరాధించి ఆ స్వామిని దర్శించడానికి దీక్షాధారులమై వస్తాము ! మా నాయకులకు కూడా ఎప్పటికి గుర్తు వుండేలా గుడులు నిర్మించి పూజించుకుంటాము !’’ అన్నారు వావర్ అనుచరులు ఆవేశంగా !
🌸 ‘‘అవును ! మంచి ఆలోచన ! ఆలాగే చేద్దాము !’’ అన్నారు పంబల , పాండ్య రాజులు. అందరూ అయ్యప్ప స్వామి విగ్రహానికి మరొకసారి నమస్కరించి , స్వామి రూపాన్ని మనస్సులో నిలుపుకుని తిరుగు ప్రయాణమైనారు ! ఆలయానికి కొద్ది దూరంలో అయ్యప్ప చెప్పగా ఆయుధాలు వుంచిన అశ్వత్థ వృక్షాన్ని సమీపించారందరూ !
🌿‘‘తంత్రి స్వాములారా ! మీరు ప్రతిరోజూ అయ్యప్ప విగ్రహన్ని పూజార్చనలతో సేవించే భాగ్యాన్ని పొంది ధన్యులైనారు ! స్వామి సైనికులను ఈ అశ్వత్థ వృక్షం దగ్గర ఆయుధాలు వుంచమనడంతో కారణమేమైనా వుంటే తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్మా’’ అడిగాడు పంబలరాజు అంతవరకు తమను వీడ్కొలుపడానికి వచ్చిన పూజారులనుద్దేశించి ! ‘
🌸‘మహారాజా ! ఆయుధాలను రజోగుణం గలవారు ఇతరులకు హాని కలిగించటానికి వాడుతారు ! అటువంటివాటికి తన దగ్గర స్థానం లేదనీ , వాటిని విడిచి తననే నమ్మి తన సన్నిధికి రావలసి వుంటుందని తెలియచెప్పారు. అయ్యప్పస్వామి ! అంతేగాక అశ్వత్థ వృక్షం మహావిష్ణు ప్రతిరూపంగా చెప్పబడింది ! అందుచేత ఆ వృక్ష సమీపంలో విడివడటంవల్ల ఆయుధాలు పవిత్రతను పొంది ఇతరుల రక్షణ కల్పించడానికి ఉపయోగపడుతాయి !
అశ్వత్థ వృక్షం యొక్క మహిమ గూర్చి బ్రహ్మాండ పురాణంలో వివరంగా తెలుపబడింది ! ఆ విషయాలు చెబుతాము ! వినండి !’’ అంటూ చెప్పసాగారు పూజారులు !
🌹అశ్వత్థ వృక్ష మహిమ🌹
🌿అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) పరమ పవిత్రమైనది ! మహావిష్ణువు దాల్చిన వృక్ష రూపం. త్రిమూర్తులకు సంకేతం అశ్వత్థ వృక్షం ! ఈ వృక్షం మూలంలో బ్రహ్మ , మధ్యలో మహావిష్ణువు , పైభాగంలో పరమేశ్వరుడు వుంటారు !
🌸 పరీక్ష్మిన్మహారాజు వారం రోజులపాటు భాగవత పురాణాన్ని విని తరించిన విషయం మీకందరికీ తెలుసు కదా ! దాస్యం (సేవ చేయడం కింకరునిలాగా) భగవంతుని సేవించడం ఎంతటి పుణ్య ప్రదమో దాసాంజనేయస్వామి లోకాలకు తాను స్వయంగా ఆచరించి తెలియచెప్పాడు ! ‘నన్ను నీ కింకరునిగా (సేవకునిగా) స్వీకరించు , వేరే ఏమీ అవసరం లేదు ’ అని వేడుకుంటూ స్వామిని చేరుకోవడం ఒక భక్తిమార్గం !
🌿వందనం - నమస్కరించడం కూడా ఒక భక్తిమార్గమే ! పదే పదే నమస్కరిస్తూ ధ్యానించడంవల్ల భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది !
🌸అర్చనం - షోడోపచారాలతో అర్చించడం మీదే భక్తిమార్గాన్ని సామాన్యంగా భక్తులందరూ అనుసరిస్తుంటారు !
🌿సంకీర్తనం - స్వామి లీలలను పాడుతూ తరించడం ! దీన్ని భజన అని కూడా అంటారు ! స్వామి మీద పాటలు రాసి , వాటిని పాడుతూ , వాటిలో తాదాత్మ్యం చెందిన ఆనందానుభూతిని పొందడం ఒక భక్తి మార్గంగా చెప్పబడింది !
🌸పాదసేవనం - స్వామి పాదాలను వత్తుతూ ఆనందానుభూతి చెందడం ! ఆ భాగ్యం అందరికి సులభంగా లభించేది కాదు ! అయినా భక్తి మార్గంలో ఆ విధంగా పాదసేవనం చేస్తున్నట్లు అనుభూతి చెందవచ్చును ! ఇది ఒక మార్గం ! పరమ భాగోవోత్తములు అనుసరించేది !
🌿స్మరణం - ఎల్లప్పుడూ స్వామి నామాన్ని స్మరిస్తూ (ద్యానిస్తూ) వుండటం వల్ల భగవదనుగ్రహం లభిస్తుంది ! ‘నామస్మరణ ధన్యోపాయం’ (నామస్మరణ జన్మ ధన్యత్వం పొందే ఉపాయం) అని చెప్పబడింది ! అందుకే నిరంతరం అయ్యప్ప నామస్మరణ చేస్తూ వుండటంవల్ల క్రమంగా ఆ భక్తి మార్గం మిమ్మల్ని స్వామి సన్నిధికి చేరుస్తుంది !
🌸ఆత్మ నివేదనం - జీవాత్మను పరమాత్మకు నివేదన చేయడం భక్తి పరాకాష్టను తెలుపుతుంది నా సర్వస్వాన్ని నీకు అర్పిస్తున్నాను ! నాకు ఏ కోర్కెలు లేవు ! నన్ను నీలో ఐక్యం చేసుకో ! అని ఎప్పుడైతే నిర్మలమైన మనస్సును స్వామికి అర్పణ కావిస్తారో వాల్లను తనలో ఐక్యం చేసుకుని ముక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు !
🌿 ఈ విధంగా స్త్రీలు ఆత్మ నివేదన చేయడాన్ని ‘మధురభక్తి’ మార్గమని గూడా అంటారు !
స్త్రీ రూపంలోని జీవాత్మను పురుష రూపంలో ఊహించుకుంటూ ఆత్మనివేదన చేసి ముక్తి పొందడానికి గోపికలను ఉదాహరణగా చెప్పుకోవచ్చును ! వాళ్లు నిర్మల హృదయాలతో శ్రీకృష్ణునిలో తాదాత్మ్యం చెందాలని కోరుకున్నందువల్ల వాళ్లందరికి ముక్తిని అనుఘ్రహించాడు శ్రీకృష్ణ పరమాత్మ !
🌸భక్తులారా ! మీకు సందర్భం వచ్చింది గనుక నవ విధ భక్తుల గూర్చి తెలియజెప్పాము ! ఈ నలుగురు సఖ్య భక్తిమార్గంలో అయ్యప్పస్వామిలో ఐక్యమైనారు ! వాళ్లు ధన్యజీవులు ! వీళ్లకు దహన సంస్కారాలు కావించి పంపా నదిలో తర్పణాలు విడవండి ! మీరందరూ మీకు అనుకూలమైన మార్గాలలో అయ్యప్పస్వామిని ఆరాధించి ధన్యులు కండి !
🌿పూజారులు చెప్పిన విషయాలను ఏకాగ్రతతో , భక్తిశ్రద్ధలతో విన్నారు రాజులు , ప్రజలు గూడా !
‘‘మా నాయకులే మాకు ఆదర్శం ! మేమూ అయ్యప్ప స్వామిని ఆరాధించి ఆ స్వామిని దర్శించడానికి దీక్షాధారులమై వస్తాము ! మా నాయకులకు కూడా ఎప్పటికి గుర్తు వుండేలా గుడులు నిర్మించి పూజించుకుంటాము !’’ అన్నారు వావర్ అనుచరులు ఆవేశంగా !
🌸 ‘‘అవును ! మంచి ఆలోచన ! ఆలాగే చేద్దాము !’’ అన్నారు పంబల , పాండ్య రాజులు. అందరూ అయ్యప్ప స్వామి విగ్రహానికి మరొకసారి నమస్కరించి , స్వామి రూపాన్ని మనస్సులో నిలుపుకుని తిరుగు ప్రయాణమైనారు ! ఆలయానికి కొద్ది దూరంలో అయ్యప్ప చెప్పగా ఆయుధాలు వుంచిన అశ్వత్థ వృక్షాన్ని సమీపించారందరూ !
🌿‘‘తంత్రి స్వాములారా ! మీరు ప్రతిరోజూ అయ్యప్ప విగ్రహన్ని పూజార్చనలతో సేవించే భాగ్యాన్ని పొంది ధన్యులైనారు ! స్వామి సైనికులను ఈ అశ్వత్థ వృక్షం దగ్గర ఆయుధాలు వుంచమనడంతో కారణమేమైనా వుంటే తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్మా’’ అడిగాడు పంబలరాజు అంతవరకు తమను వీడ్కొలుపడానికి వచ్చిన పూజారులనుద్దేశించి ! ‘
🌸‘మహారాజా ! ఆయుధాలను రజోగుణం గలవారు ఇతరులకు హాని కలిగించటానికి వాడుతారు ! అటువంటివాటికి తన దగ్గర స్థానం లేదనీ , వాటిని విడిచి తననే నమ్మి తన సన్నిధికి రావలసి వుంటుందని తెలియచెప్పారు. అయ్యప్పస్వామి ! అంతేగాక అశ్వత్థ వృక్షం మహావిష్ణు ప్రతిరూపంగా చెప్పబడింది ! అందుచేత ఆ వృక్ష సమీపంలో విడివడటంవల్ల ఆయుధాలు పవిత్రతను పొంది ఇతరుల రక్షణ కల్పించడానికి ఉపయోగపడుతాయి !
అశ్వత్థ వృక్షం యొక్క మహిమ గూర్చి బ్రహ్మాండ పురాణంలో వివరంగా తెలుపబడింది ! ఆ విషయాలు చెబుతాము ! వినండి !’’ అంటూ చెప్పసాగారు పూజారులు !
🌹అశ్వత్థ వృక్ష మహిమ🌹
🌿అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) పరమ పవిత్రమైనది ! మహావిష్ణువు దాల్చిన వృక్ష రూపం. త్రిమూర్తులకు సంకేతం అశ్వత్థ వృక్షం ! ఈ వృక్షం మూలంలో బ్రహ్మ , మధ్యలో మహావిష్ణువు , పైభాగంలో పరమేశ్వరుడు వుంటారు !
🌸త్రిమూర్తులు వృక్షం యొక్క ఉత్తర , దక్షిణ , పడమర దిక్కులలోని కొమ్మలలోనూ , ఇంద్రాది దేవతలు తూర్పు దిక్కున వుండే కొమ్మలలోనూ వుంటారు ! సప్త సముద్రాలు , పుణ్యనదులు కూడా తూర్పు వైపు కొమ్మలలోనే వుంటాయి !
🌿 చెట్టుమూలంలో వేర్లలో మహర్షులు , గోబ్రాహ్మణులు , నాలుగు వేదాలు వుంటాయి ! ఇంతేగాక వృక్షమూలంలో ‘అ’కారము , కాండలో ‘ఉ’కారము , ఆకులు పండ్లలో ‘మ’కారము లీనమై వుండి ప్రణవ స్వరూపం (ఓం)గా కూడా చెప్పబడింది ! అశ్వత్థ వృక్షం అందుకే అత్యంత మహిమాన్వితమైన వృక్షరాజంగా పూజింపబడుతున్నది ! అశ్వత్థ వృక్షమూలంలో శుభ్రమైన నీటి ని పోసి , ప్రదక్షిణ నమస్కారాలు మూడుసార్లు చేయాలి ! ‘అశ్వత్థ నారాయణ నమః’ అని ధ్యానిస్తూ పాలను మూలంలో పోసి , పసుపు , కుంకుమలు అర్చించాలి !
🌸ప్రతి శనివారం ఈ విధంగా పూజించి , చెట్టును తాకి కళ్లకద్దుకోవాలి ! మృత్యుంజయ మంత్రం పఠించడంవల్ల అపమృత్యుభయం తొలగిపోతుంది ! ఆపదలు , ప్రమాదాలు పరిహరింపబడుతాయి !
🌹మృత్యుంజయ మంత్రం🌹
‘‘త్య్రయంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనమ్ఉ
ర్వారుకమివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్’’
🌿 సంతాన భాగ్యం కోరేవారు ఆ సంకల్పం చేసుకుని అశ్వత్థ వృక్షాన్ని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు (పదకొండుసార్లు) చేయడంవల్ల కోరిక సిద్ధిస్తుంది ! అశ్వత్థ వృక్షం మూలంలో దారిద్య్రానికి అధిదేవతయైన జ్యేష్ఠా దేవి కూడా వసిస్తూ వుంటుందని పురాణాలలో తెలుపబడింది ! ఇందుకు సంబంధించిన కథనం
వివరణ...సశేషం...
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
🌿 చెట్టుమూలంలో వేర్లలో మహర్షులు , గోబ్రాహ్మణులు , నాలుగు వేదాలు వుంటాయి ! ఇంతేగాక వృక్షమూలంలో ‘అ’కారము , కాండలో ‘ఉ’కారము , ఆకులు పండ్లలో ‘మ’కారము లీనమై వుండి ప్రణవ స్వరూపం (ఓం)గా కూడా చెప్పబడింది ! అశ్వత్థ వృక్షం అందుకే అత్యంత మహిమాన్వితమైన వృక్షరాజంగా పూజింపబడుతున్నది ! అశ్వత్థ వృక్షమూలంలో శుభ్రమైన నీటి ని పోసి , ప్రదక్షిణ నమస్కారాలు మూడుసార్లు చేయాలి ! ‘అశ్వత్థ నారాయణ నమః’ అని ధ్యానిస్తూ పాలను మూలంలో పోసి , పసుపు , కుంకుమలు అర్చించాలి !
🌸ప్రతి శనివారం ఈ విధంగా పూజించి , చెట్టును తాకి కళ్లకద్దుకోవాలి ! మృత్యుంజయ మంత్రం పఠించడంవల్ల అపమృత్యుభయం తొలగిపోతుంది ! ఆపదలు , ప్రమాదాలు పరిహరింపబడుతాయి !
🌹మృత్యుంజయ మంత్రం🌹
‘‘త్య్రయంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనమ్ఉ
ర్వారుకమివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్’’
🌿 సంతాన భాగ్యం కోరేవారు ఆ సంకల్పం చేసుకుని అశ్వత్థ వృక్షాన్ని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు (పదకొండుసార్లు) చేయడంవల్ల కోరిక సిద్ధిస్తుంది ! అశ్వత్థ వృక్షం మూలంలో దారిద్య్రానికి అధిదేవతయైన జ్యేష్ఠా దేవి కూడా వసిస్తూ వుంటుందని పురాణాలలో తెలుపబడింది ! ఇందుకు సంబంధించిన కథనం
వివరణ...సశేషం...
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 23 అధ్యాయం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 23 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿నేను ధన్యుడినైనాను ! నా సర్వస్వం నీకు సమర్పిస్తున్నాను ! స్వీకరించి నన్ను నీ వాడిని చేసుకో ’’ అంటూ తదేకంగా స్వామి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు ! ‘‘యుద్ధంలో నిపుణుడివని విన్నాను ! నాతో తలపడకుండా శరణు కోరుతున్నావే ! నేనెవరినో గుర్తెరిగావా ?’’ చిరునవ్వుతో అడిగాడు అయ్యప్ప ఏనుగుమీద నుండి దిగుతూ !
🌸 ‘‘పంబల రాజకుమారుడిగా మనవడిగా నిన్ను గుర్తించాను ! ఆ రాజ్యాన్ని ఉదయనుడి పాలననుండి విడుదల చేసి సైన్యాలను సమీకరించి అతనిపై యుద్ధం ప్రకటించబోతున్నావని విన్నాను ! అందుకే ముందుగా నీ రాజ్యంవైపే రావాలని నిశ్చయించుకున్నాను గానీ నీవే నన్ను కలుసుకోవడానికి రావడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నది ! నీవు సామాన్యుడవు కావని , కారణజన్ముడివని గ్రహించాను !
🌿ఓ దివ్య ప్రభావ సంపన్నుడా ! నీతో యుద్ధాన్ని కాదు మిత్రత్వాన్ని వాంఛిస్తున్నాను’’ అన్నాడు వావరు భక్తిపూరితమైన హృదయంతో ! సాదరంగా అతని చేయందుకుని భుజంమీద తట్టాడు అయ్యప్ప ! ‘‘అలాగా ! ఇకపై నీవు నా మంచి మిత్రునిగా నాతోనే ఉండవచ్చును ! నీవు పంబల సైన్యానికి సర్వసేనాధిపతిగా ఉండాలని ఆశిస్తున్నాను’’ అంటూ ఆ బాధ్యత అప్పగించాడు అయ్యప్ప !
🌸 ‘‘అలనాడు మహిషిని సంహరించడానికి అవతరించిన అయ్యప్ప నేడు కలి ప్రభావంతో విజృంభించిన దుష్టులను అంతం కావించడానికి తిరిగి మన మధ్యకు రావడం మన భాగ్య విశేషం ! అయ్యప్పకు , వారి మిత్రులకు పాండ్యరాజ్యం సాదరంగా ఆహ్వానం పలుకుతున్నది !’’
🌿మిత్రులతో సభాప్రవేశం చేసిన అయ్యప్పకు పుష్పమాల వేసి సాదరంగా ఉచితాసనంమీద ఆసీనుడిని కావించి అతిథి సత్కారాలు జరిపాడు పాండ్యరాజు వీరపాండ్యుడు ! వావరును మిత్రునిగా చేసుకున్న అయ్యప్ప కొచ్చుకడత్త , కరప్ప , విల్లన్ , మల్లన్ అనే బలశాలులైన మరి నలుగురు దుండగులను తన ప్రభావంతో మంచివారిగా మార్చి తనమిత్రులుగా చేసుకున్నాడు ! వారు కూడా అయ్యప్ప సైన్యంలో చేరి సైనికులకు తగిన శిక్షణ ఇచ్చే బాధ్యత స్వీకరించారు.
🌸 ఉదయనుడు తప్ప సముద్రపు దొంగ వావరు , ఇతరులు అయ్యప్పకు మిత్రులవడం పంబల రాజ్యానికి పొరుగునవున్న పాండ్యరాజు వీరపాండ్యుడు విని తాను కూడా అయ్యప్పతో స్నేహ బాంధవ్యాలు పెట్టుకోవాలని ఆశించాడు ! అతని ఆశయం నెరవేర్చడానికన్నట్లుగా మిత్రులు వెంటరాగా పాండ్యరాజ్యానికి వచ్చాడు అయ్యప్ప ! తన కోరిక నెరవేడంతో ఆనందోత్సాహాలు చోటుచేసుకున్నాయి పాండ్య రాజులో ! అందుకే అయ్యప్పకు ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటుకావించాడు !
🌿‘‘పాండ్యరాజా ! మీ ఆదరానికి , అభిమానానికి కృతజ్ఞులం ! ప్రస్తుతం నేను ఉదయనుడిని ఎదుర్కొనడానికి వెళ్లనున్నాను ! మీరు మీ సేనాసమేతంగా మా వెంట రావచ్చును !’’ అని చెప్పాడు అయ్యప్ప ! ‘తప్పకుండా ! మా కోరికా అదే ! ఇంతకుక్రితం అతని చేతిలో అపజయం చవి చూసినా ఇప్పుడు మీవెంట వచ్చి మా శాయశక్తులా పోరాడి అతడిని ఓడించాలని కోరుకుంటున్నాము !
మాకూ అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞులం !’’ ఉత్సాహంగా సేనతో అయ్యప్ప వెంట బయలుదేరాడు వీరపాండ్యుడు ! దండయాత్ర ప్రారంభమైంది ! జయభేరి మ్రోగించి ఉదయనుని స్థావరాన్ని చుట్టుముట్టాయి అయ్యప్ప సేనలు , పాండ్య సేనలు ! ‘‘నాకు స్నేహితులు కావలసిన సముద్ర దొంగ వావరు , మరికొందరు ఆ అయ్యప్పకు మిత్రులైపోయి నామీదే దండెత్తి వస్తున్నారా ? వాళ్లందరినీ నా కత్తికి బలి యిస్తాను !
ఈ ఉదయనుడి శక్తి ఏమిటో తెలిసేలా చేస్తాను !’’ అని కోపంతో పళ్లు పటపటలాడిస్తూ తన సేనలతో వాళ్ళను ఎదుర్కొన్నాడు ఉదయనుడు!
‘‘పిరికిపందలారా ! నన్ను శరణనకుండా ఆ రాకుమారుడి వెనుక నిలబడ్డారా ? ఇప్పుడే నా కత్తికి బలి ఇస్తాను , చూడండి’’తన కళ్లకు సామాన్య రాకుమారుడిలాగా కనిపిస్తున్న అయ్యప్ప వైపు తేలికగా చూస్తూ అతని వైపు దూసుకువెళ్లాడు !
🌸‘‘నీ ముచ్చట తీరుస్తాను ! రా కత్తితో కాదుగా నీ ద్వంద్వ యుద్ధానికి వస్తావా ?’’ అని కవ్విస్తూ ఏ ఆయుధం లేకుండా ఉదయనుడిని ఎదుర్కొన్నాడు అయ్యప్ప ! ఇద్దరిమధ్యా కొంతసేపు తీవ్రంగా జరిగింది ద్వంద్వ యుద్ధం ! అందరూ ఆందోళనగా చూడసాగారు ! ‘‘నాయకా ! వాడిని కరుణించవద్దు !’’ అంటూ హెచ్చరించారు మిత్రులందరూ ! వాళ్ళ వైపు చిరునవ్వుతో చూసి ‘‘మీరందరూ చెబుతున్నారు గనక ఈ లీలా వినోదాన్ని ఇక చాలిస్తాను !’’ అంటూ ఉదయనుడిని అమాంతంగా ఎత్తి పట్టుకుని గిరగిర త్రిప్పి పైకి విసిరేశాడు !
రక్తం కక్కుతూ పెద్ద శబ్దంతో క్రిందపడ్డ అతని శరీరంమీద నిలిచి తాండవం చేసాడు ! ఆ దృశ్యాన్ని చూస్తుంటే అక్కడ నిలిచి చూస్తున్న వాళ్లందరికీ అయ్యప్పలో మహిషి మర్దవం కావిస్తున్న మణికంఠుడు దర్శనమిచ్చాడు !
🌿అందరూ భక్తి పారవశ్యంతో పరవశించిపోతూ ‘‘అయ్యప్ప స్వామికి జయము ! హరిహరపుత్రుడు , ధర్మశాస్తా , మణికంఠునికి జయము ! జయము !’’ అంటూ జయజయధ్వానాలు కావించారు !ఉదయనుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రజాకంటకుడైన ఆ దుండగుడు మరణించడంతో వాతావరణం ప్రశాంతంగా మారింది ! చల్లని గాలులు వీస్తూ హాయిని కలిగించాయి హృదయాలకు !
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 23 ,వ భాగం ప్రారంభం...!!🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿నేను ధన్యుడినైనాను ! నా సర్వస్వం నీకు సమర్పిస్తున్నాను ! స్వీకరించి నన్ను నీ వాడిని చేసుకో ’’ అంటూ తదేకంగా స్వామి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు ! ‘‘యుద్ధంలో నిపుణుడివని విన్నాను ! నాతో తలపడకుండా శరణు కోరుతున్నావే ! నేనెవరినో గుర్తెరిగావా ?’’ చిరునవ్వుతో అడిగాడు అయ్యప్ప ఏనుగుమీద నుండి దిగుతూ !
🌸 ‘‘పంబల రాజకుమారుడిగా మనవడిగా నిన్ను గుర్తించాను ! ఆ రాజ్యాన్ని ఉదయనుడి పాలననుండి విడుదల చేసి సైన్యాలను సమీకరించి అతనిపై యుద్ధం ప్రకటించబోతున్నావని విన్నాను ! అందుకే ముందుగా నీ రాజ్యంవైపే రావాలని నిశ్చయించుకున్నాను గానీ నీవే నన్ను కలుసుకోవడానికి రావడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నది ! నీవు సామాన్యుడవు కావని , కారణజన్ముడివని గ్రహించాను !
🌿ఓ దివ్య ప్రభావ సంపన్నుడా ! నీతో యుద్ధాన్ని కాదు మిత్రత్వాన్ని వాంఛిస్తున్నాను’’ అన్నాడు వావరు భక్తిపూరితమైన హృదయంతో ! సాదరంగా అతని చేయందుకుని భుజంమీద తట్టాడు అయ్యప్ప ! ‘‘అలాగా ! ఇకపై నీవు నా మంచి మిత్రునిగా నాతోనే ఉండవచ్చును ! నీవు పంబల సైన్యానికి సర్వసేనాధిపతిగా ఉండాలని ఆశిస్తున్నాను’’ అంటూ ఆ బాధ్యత అప్పగించాడు అయ్యప్ప !
🌸 ‘‘అలనాడు మహిషిని సంహరించడానికి అవతరించిన అయ్యప్ప నేడు కలి ప్రభావంతో విజృంభించిన దుష్టులను అంతం కావించడానికి తిరిగి మన మధ్యకు రావడం మన భాగ్య విశేషం ! అయ్యప్పకు , వారి మిత్రులకు పాండ్యరాజ్యం సాదరంగా ఆహ్వానం పలుకుతున్నది !’’
🌿మిత్రులతో సభాప్రవేశం చేసిన అయ్యప్పకు పుష్పమాల వేసి సాదరంగా ఉచితాసనంమీద ఆసీనుడిని కావించి అతిథి సత్కారాలు జరిపాడు పాండ్యరాజు వీరపాండ్యుడు ! వావరును మిత్రునిగా చేసుకున్న అయ్యప్ప కొచ్చుకడత్త , కరప్ప , విల్లన్ , మల్లన్ అనే బలశాలులైన మరి నలుగురు దుండగులను తన ప్రభావంతో మంచివారిగా మార్చి తనమిత్రులుగా చేసుకున్నాడు ! వారు కూడా అయ్యప్ప సైన్యంలో చేరి సైనికులకు తగిన శిక్షణ ఇచ్చే బాధ్యత స్వీకరించారు.
🌸 ఉదయనుడు తప్ప సముద్రపు దొంగ వావరు , ఇతరులు అయ్యప్పకు మిత్రులవడం పంబల రాజ్యానికి పొరుగునవున్న పాండ్యరాజు వీరపాండ్యుడు విని తాను కూడా అయ్యప్పతో స్నేహ బాంధవ్యాలు పెట్టుకోవాలని ఆశించాడు ! అతని ఆశయం నెరవేర్చడానికన్నట్లుగా మిత్రులు వెంటరాగా పాండ్యరాజ్యానికి వచ్చాడు అయ్యప్ప ! తన కోరిక నెరవేడంతో ఆనందోత్సాహాలు చోటుచేసుకున్నాయి పాండ్య రాజులో ! అందుకే అయ్యప్పకు ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటుకావించాడు !
🌿‘‘పాండ్యరాజా ! మీ ఆదరానికి , అభిమానానికి కృతజ్ఞులం ! ప్రస్తుతం నేను ఉదయనుడిని ఎదుర్కొనడానికి వెళ్లనున్నాను ! మీరు మీ సేనాసమేతంగా మా వెంట రావచ్చును !’’ అని చెప్పాడు అయ్యప్ప ! ‘తప్పకుండా ! మా కోరికా అదే ! ఇంతకుక్రితం అతని చేతిలో అపజయం చవి చూసినా ఇప్పుడు మీవెంట వచ్చి మా శాయశక్తులా పోరాడి అతడిని ఓడించాలని కోరుకుంటున్నాము !
మాకూ అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞులం !’’ ఉత్సాహంగా సేనతో అయ్యప్ప వెంట బయలుదేరాడు వీరపాండ్యుడు ! దండయాత్ర ప్రారంభమైంది ! జయభేరి మ్రోగించి ఉదయనుని స్థావరాన్ని చుట్టుముట్టాయి అయ్యప్ప సేనలు , పాండ్య సేనలు ! ‘‘నాకు స్నేహితులు కావలసిన సముద్ర దొంగ వావరు , మరికొందరు ఆ అయ్యప్పకు మిత్రులైపోయి నామీదే దండెత్తి వస్తున్నారా ? వాళ్లందరినీ నా కత్తికి బలి యిస్తాను !
ఈ ఉదయనుడి శక్తి ఏమిటో తెలిసేలా చేస్తాను !’’ అని కోపంతో పళ్లు పటపటలాడిస్తూ తన సేనలతో వాళ్ళను ఎదుర్కొన్నాడు ఉదయనుడు!
‘‘పిరికిపందలారా ! నన్ను శరణనకుండా ఆ రాకుమారుడి వెనుక నిలబడ్డారా ? ఇప్పుడే నా కత్తికి బలి ఇస్తాను , చూడండి’’తన కళ్లకు సామాన్య రాకుమారుడిలాగా కనిపిస్తున్న అయ్యప్ప వైపు తేలికగా చూస్తూ అతని వైపు దూసుకువెళ్లాడు !
🌸‘‘నీ ముచ్చట తీరుస్తాను ! రా కత్తితో కాదుగా నీ ద్వంద్వ యుద్ధానికి వస్తావా ?’’ అని కవ్విస్తూ ఏ ఆయుధం లేకుండా ఉదయనుడిని ఎదుర్కొన్నాడు అయ్యప్ప ! ఇద్దరిమధ్యా కొంతసేపు తీవ్రంగా జరిగింది ద్వంద్వ యుద్ధం ! అందరూ ఆందోళనగా చూడసాగారు ! ‘‘నాయకా ! వాడిని కరుణించవద్దు !’’ అంటూ హెచ్చరించారు మిత్రులందరూ ! వాళ్ళ వైపు చిరునవ్వుతో చూసి ‘‘మీరందరూ చెబుతున్నారు గనక ఈ లీలా వినోదాన్ని ఇక చాలిస్తాను !’’ అంటూ ఉదయనుడిని అమాంతంగా ఎత్తి పట్టుకుని గిరగిర త్రిప్పి పైకి విసిరేశాడు !
రక్తం కక్కుతూ పెద్ద శబ్దంతో క్రిందపడ్డ అతని శరీరంమీద నిలిచి తాండవం చేసాడు ! ఆ దృశ్యాన్ని చూస్తుంటే అక్కడ నిలిచి చూస్తున్న వాళ్లందరికీ అయ్యప్పలో మహిషి మర్దవం కావిస్తున్న మణికంఠుడు దర్శనమిచ్చాడు !
🌿అందరూ భక్తి పారవశ్యంతో పరవశించిపోతూ ‘‘అయ్యప్ప స్వామికి జయము ! హరిహరపుత్రుడు , ధర్మశాస్తా , మణికంఠునికి జయము ! జయము !’’ అంటూ జయజయధ్వానాలు కావించారు !ఉదయనుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రజాకంటకుడైన ఆ దుండగుడు మరణించడంతో వాతావరణం ప్రశాంతంగా మారింది ! చల్లని గాలులు వీస్తూ హాయిని కలిగించాయి హృదయాలకు !
🌸 ఉదయనుడి మరణంతో బాధా భయాలు తొలగిపోయి తేలిక పడిన హృదయాలతో అందరూ అయ్యప్ప చుట్టూ చేరి స్తుతించారు.
🌹‘‘పాహి పాహి అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
భక్తజనప్రియ అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
కలియుగ వరదా అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
పరమ కృపాళో అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !🌹
🌿అందరి వైపు ప్రసన్నంగా చూస్తూ అక్కడనుండి పంబానదివైపు దారితీశాడు అయ్యప్ప !
పంబానదీ - విడిది, అయ్యప్ప పంబానది తీరాన్ని చేరి పరివారంతో అక్కడ విడిది చేశాడు ! ఆ ఒడ్డునే డేరాలు వేసి అయ్యప్ప కూర్చోవడానికి ఆసనం వేశారు ! పంబానది వాళ్ళను చూసి సంతోషంతో పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తున్నది ! ‘‘గంగతో సమానమైన ఈ నది ఒడ్డున పితరులకు పిండ ప్రదానాలు చేయడం , తర్పణాలు విడవడంవల్ల ఏడు తరాలవారికి సద్గతులు లభిస్తాయి !
🌸 మీరందరూ కూడా మరణించిన మీ పెద్దలనుద్దేశించి ఈ నదీ జలాలలో తర్పణాలు అర్పించండి !’’ అని అయ్యప్ప చెప్పడంతో పరివారంలోని వారందరూ భక్తిపూర్వకంగా తర్పణాలు అర్పించారు ! అయ్యప్ప చెప్పడంతో యుద్ధంలో మరణించిన యోధులకు తర్పణాలు విడిచారు !
అయ్యప్ప అక్కడినుండి పంబల రాజుకు , తన తల్లిదండ్రులకు వెంటనే తన విడిదికి రావలసిందిగా దూతలతో వర్తమానం పంపించాడు ! వార్త అందిన వెంటనే వారు ఆనందోత్సాహాలతో బయలుదేరి పంబానదీ తీరాన్ని చేరుకున్నారు !
🌿 ‘‘కుమారా ! అయ్యప్ప ! నిన్ను కన్న మేము ధన్యులమైనాము !పంబలరాజ్యం , పాండ్య వంశం ధన్యమైనాయి. కన్నుల కరువు తీరా నిన్ను చూసే భాగ్యాన్ని మరొకసారి మాకు అనుగ్రహించావా తండ్రీ ! అంతకంటే మాకింకేం కావాలి ? నీకు సదా కృతజ్ఞులమై ఉంటాము’’ చేతులు జోడించి అంటున్న వాళ్లను వారించాడు అయ్యప్ప ! ‘‘మీరు పెద్దలు , నాకు వందనీయులు ! నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు ! నేను వచ్చిన కార్యం పూర్తయింది ! ఇక నేను నా నివాసానికి బయలుదేరవలసిన సమయం ఆసన్నమైంది !
🌸 శబరిగిరి మీద నా నివాసానికి ప్రయాణం సాగించనున్న నా వెంట మీరు కూడా అంతవరకు రావచ్చును’’ అంటూ చెప్పాడు అయ్యప్ప అందరినీ ఉద్దేశించి ! ఆ మాటలు అందరిలో ఆనందోత్సాహాలు కలిగించాయి !
‘‘అయ్యప్పస్వామీ ! మీ వెంట మేమూ గిరిమీదకు వచ్చేందుకు అవకాశం ప్రసాదించావు ! ఎంతటి కరుణామయుడివి తండ్రీ !’’ అంటూ పరివారంలోని వారందరూ , పంబలరాజు , పాండ్యరాజు , జయవర్థనుడు , ఆయన భార్య అయ్యప్ప వెంట నడుస్తుండగా తాము వెనకగా అనుసరించారు !పంబా నదిని దాటి శబరిగిరి వైపు దారితీశాడు అయ్యప్ప !
🌹మందిర పునర్నిర్మాణం | అయ్యప్ప ఆలయ ప్రవేశం..🌹
🌿‘‘సైనికులారా ! మీ ఆయుధాలను ఈ అశ్వత్థవృక్షం దగ్గర వుంచి , అందరూ భగవంతునిపై మనస్సు లగ్నం చేసి ముందుకు పదండి ! అదుగో ! ఆ కనిపిస్తున్న ఆలయమే మణికంఠుని కోసం విశ్వకర్మ , పరశురాములవారు నిర్మించినది’’ కొంతదూరంలో కనిపిస్తున్న ఆలయంవైపు చూపిస్తూ చెప్పాడు అయ్యప్ప ! ‘‘అలాగే స్వామి’’ అంటూ అందరూ ఆయుధాలు , అశ్వత్థ (రావిచెట్టు) వృక్షం దగ్గర భద్రపరిచి ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని శరణుఘోష గొంతెత్తి పాడుతూ ముందుకు సాగారు ! అయ్యప్ప ముందు నడవగా అందరూ ఆలయాన్ని సమీపించారు !
🌸 ఉదయనుడి దాడులవల్ల ఆలయం కొంత దెబ్బతిన్నది ! పూజారులు అయ్యప్ప విగ్రహానికి పూజార్చనలు జరుపుతున్నా భక్తుల రాకపోకలు ఆగిపోయాయి ! ఆ ప్రాంతమంతా నిశ్శబ్ద నీరవం తాండవమాడుతూ ఉన్నది అక్కడ కొంతకాలంగా ! అయ్యప్ప పరివార సమేతంగా అక్కడకు చేరడంతో పరిసరాలలో చైతన్యం వచ్చింది ! ఎండిపోయిన చెట్లు చిగురించి ప్రకృతి కళకళలాడింది ! అయ్యప్పకు స్వాగతం చెబుతున్నట్లు జల జలమంటూ పుష్పవృష్టి కురిసింది స్వామిమీద !
🌿అయ్యప్ప చుట్టూరా ఒకసారి నిశితంగా పరిశీలించాడు ! ఆయన దృష్టి ఆలయం మీద కేంద్రీకృతమైంది ! అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా ఆలయం పునర్నిర్మింపబడి పూర్వపు శోభతో కలకలలాడింది ! పరశురాములవారు ప్రతిష్ఠించిన విగ్రహం యధాతథంగా దర్శనమిచ్చింది ! ఆయన నియమించిన పూజారుల వంశస్థులు పరుగు పరుగున వచ్చి అయ్యప్పకు స్వాగతం పలికారు !
🌸పద్ధెనిమిది మెట్లను , చిన్ముద్రా , అభయముద్రలు చూపుతూ పట్టుబంధంలో పీఠంమీద ఆసీనమై వున్న స్వామి విగ్రహాన్ని చూస్తూ అందరూ భక్తి పారవశ్యంతో మైమరచిపోయారు !
🌿‘‘స్వామియే శరణం అయ్యప్పా !’’ అంటూ ముక్తకంఠంతో స్తుతించారు ! ‘‘అయ్యప్పా ! నీ దయవల్ల ఈ రోజు మేమందరం ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని , ఇందులో వెలసి వున్న మణికంఠుని దర్శించగలిగాము ! నీకు మా కృతజ్ఞతలు ఏ విధంగా తెలుపుకోగలం ? తండ్రీ ! మా నమస్కారాలను స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయి !’’ అంటూ తమ వైపు చిరునవ్వుతో చూస్తూ నిలిచిన అయ్యప్పకు నమస్కరిస్తూ అన్నారందరూ ! ‘
🌸‘నిర్మల హృదయంతో చేసిన నమస్కారం చాలు నాకు ! మీ యోగక్షేమాలు సర్వదా గమనిస్తూనే వుంటాను ! మీరందరూ దీక్షాధారులై నా సన్నిధికి రావచ్చును పద్ధెనిమిది మెట్లను ఎక్కి ! మీకు సన్మార్గాన్ని చూపడానికి , కలి పురుషునీ , శనీశ్వరునీ ప్రభావానికి లోనుకాకుండా పుణ్యకార్యాలు ఆచరించి ఆత్మ సంయమనం పొందడానికి మండలదీక్ష ఎంతోగానో సహాయపడుతుంది , గుర్తుంచుకోండి ’’ అని చెప్పాడు మేఘ గంభీర స్వరంతో !...సశేషం.. 🙏
🌹‘‘పాహి పాహి అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
భక్తజనప్రియ అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
కలియుగ వరదా అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !
పరమ కృపాళో అయ్యప్పా ! శరణు శరణు అయ్యప్పా !🌹
🌿అందరి వైపు ప్రసన్నంగా చూస్తూ అక్కడనుండి పంబానదివైపు దారితీశాడు అయ్యప్ప !
పంబానదీ - విడిది, అయ్యప్ప పంబానది తీరాన్ని చేరి పరివారంతో అక్కడ విడిది చేశాడు ! ఆ ఒడ్డునే డేరాలు వేసి అయ్యప్ప కూర్చోవడానికి ఆసనం వేశారు ! పంబానది వాళ్ళను చూసి సంతోషంతో పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తున్నది ! ‘‘గంగతో సమానమైన ఈ నది ఒడ్డున పితరులకు పిండ ప్రదానాలు చేయడం , తర్పణాలు విడవడంవల్ల ఏడు తరాలవారికి సద్గతులు లభిస్తాయి !
🌸 మీరందరూ కూడా మరణించిన మీ పెద్దలనుద్దేశించి ఈ నదీ జలాలలో తర్పణాలు అర్పించండి !’’ అని అయ్యప్ప చెప్పడంతో పరివారంలోని వారందరూ భక్తిపూర్వకంగా తర్పణాలు అర్పించారు ! అయ్యప్ప చెప్పడంతో యుద్ధంలో మరణించిన యోధులకు తర్పణాలు విడిచారు !
అయ్యప్ప అక్కడినుండి పంబల రాజుకు , తన తల్లిదండ్రులకు వెంటనే తన విడిదికి రావలసిందిగా దూతలతో వర్తమానం పంపించాడు ! వార్త అందిన వెంటనే వారు ఆనందోత్సాహాలతో బయలుదేరి పంబానదీ తీరాన్ని చేరుకున్నారు !
🌿 ‘‘కుమారా ! అయ్యప్ప ! నిన్ను కన్న మేము ధన్యులమైనాము !పంబలరాజ్యం , పాండ్య వంశం ధన్యమైనాయి. కన్నుల కరువు తీరా నిన్ను చూసే భాగ్యాన్ని మరొకసారి మాకు అనుగ్రహించావా తండ్రీ ! అంతకంటే మాకింకేం కావాలి ? నీకు సదా కృతజ్ఞులమై ఉంటాము’’ చేతులు జోడించి అంటున్న వాళ్లను వారించాడు అయ్యప్ప ! ‘‘మీరు పెద్దలు , నాకు వందనీయులు ! నాకు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు ! నేను వచ్చిన కార్యం పూర్తయింది ! ఇక నేను నా నివాసానికి బయలుదేరవలసిన సమయం ఆసన్నమైంది !
🌸 శబరిగిరి మీద నా నివాసానికి ప్రయాణం సాగించనున్న నా వెంట మీరు కూడా అంతవరకు రావచ్చును’’ అంటూ చెప్పాడు అయ్యప్ప అందరినీ ఉద్దేశించి ! ఆ మాటలు అందరిలో ఆనందోత్సాహాలు కలిగించాయి !
‘‘అయ్యప్పస్వామీ ! మీ వెంట మేమూ గిరిమీదకు వచ్చేందుకు అవకాశం ప్రసాదించావు ! ఎంతటి కరుణామయుడివి తండ్రీ !’’ అంటూ పరివారంలోని వారందరూ , పంబలరాజు , పాండ్యరాజు , జయవర్థనుడు , ఆయన భార్య అయ్యప్ప వెంట నడుస్తుండగా తాము వెనకగా అనుసరించారు !పంబా నదిని దాటి శబరిగిరి వైపు దారితీశాడు అయ్యప్ప !
🌹మందిర పునర్నిర్మాణం | అయ్యప్ప ఆలయ ప్రవేశం..🌹
🌿‘‘సైనికులారా ! మీ ఆయుధాలను ఈ అశ్వత్థవృక్షం దగ్గర వుంచి , అందరూ భగవంతునిపై మనస్సు లగ్నం చేసి ముందుకు పదండి ! అదుగో ! ఆ కనిపిస్తున్న ఆలయమే మణికంఠుని కోసం విశ్వకర్మ , పరశురాములవారు నిర్మించినది’’ కొంతదూరంలో కనిపిస్తున్న ఆలయంవైపు చూపిస్తూ చెప్పాడు అయ్యప్ప ! ‘‘అలాగే స్వామి’’ అంటూ అందరూ ఆయుధాలు , అశ్వత్థ (రావిచెట్టు) వృక్షం దగ్గర భద్రపరిచి ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని శరణుఘోష గొంతెత్తి పాడుతూ ముందుకు సాగారు ! అయ్యప్ప ముందు నడవగా అందరూ ఆలయాన్ని సమీపించారు !
🌸 ఉదయనుడి దాడులవల్ల ఆలయం కొంత దెబ్బతిన్నది ! పూజారులు అయ్యప్ప విగ్రహానికి పూజార్చనలు జరుపుతున్నా భక్తుల రాకపోకలు ఆగిపోయాయి ! ఆ ప్రాంతమంతా నిశ్శబ్ద నీరవం తాండవమాడుతూ ఉన్నది అక్కడ కొంతకాలంగా ! అయ్యప్ప పరివార సమేతంగా అక్కడకు చేరడంతో పరిసరాలలో చైతన్యం వచ్చింది ! ఎండిపోయిన చెట్లు చిగురించి ప్రకృతి కళకళలాడింది ! అయ్యప్పకు స్వాగతం చెబుతున్నట్లు జల జలమంటూ పుష్పవృష్టి కురిసింది స్వామిమీద !
🌿అయ్యప్ప చుట్టూరా ఒకసారి నిశితంగా పరిశీలించాడు ! ఆయన దృష్టి ఆలయం మీద కేంద్రీకృతమైంది ! అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా ఆలయం పునర్నిర్మింపబడి పూర్వపు శోభతో కలకలలాడింది ! పరశురాములవారు ప్రతిష్ఠించిన విగ్రహం యధాతథంగా దర్శనమిచ్చింది ! ఆయన నియమించిన పూజారుల వంశస్థులు పరుగు పరుగున వచ్చి అయ్యప్పకు స్వాగతం పలికారు !
🌸పద్ధెనిమిది మెట్లను , చిన్ముద్రా , అభయముద్రలు చూపుతూ పట్టుబంధంలో పీఠంమీద ఆసీనమై వున్న స్వామి విగ్రహాన్ని చూస్తూ అందరూ భక్తి పారవశ్యంతో మైమరచిపోయారు !
🌿‘‘స్వామియే శరణం అయ్యప్పా !’’ అంటూ ముక్తకంఠంతో స్తుతించారు ! ‘‘అయ్యప్పా ! నీ దయవల్ల ఈ రోజు మేమందరం ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని , ఇందులో వెలసి వున్న మణికంఠుని దర్శించగలిగాము ! నీకు మా కృతజ్ఞతలు ఏ విధంగా తెలుపుకోగలం ? తండ్రీ ! మా నమస్కారాలను స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయి !’’ అంటూ తమ వైపు చిరునవ్వుతో చూస్తూ నిలిచిన అయ్యప్పకు నమస్కరిస్తూ అన్నారందరూ ! ‘
🌸‘నిర్మల హృదయంతో చేసిన నమస్కారం చాలు నాకు ! మీ యోగక్షేమాలు సర్వదా గమనిస్తూనే వుంటాను ! మీరందరూ దీక్షాధారులై నా సన్నిధికి రావచ్చును పద్ధెనిమిది మెట్లను ఎక్కి ! మీకు సన్మార్గాన్ని చూపడానికి , కలి పురుషునీ , శనీశ్వరునీ ప్రభావానికి లోనుకాకుండా పుణ్యకార్యాలు ఆచరించి ఆత్మ సంయమనం పొందడానికి మండలదీక్ష ఎంతోగానో సహాయపడుతుంది , గుర్తుంచుకోండి ’’ అని చెప్పాడు మేఘ గంభీర స్వరంతో !...సశేషం.. 🙏
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 22వ అధ్యాయం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 22,వ భాగం ప్రారంభం...!!
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌸కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి ! జయవర్థనుడు , శశికళల పుత్రుడు జన్మించి దిన దిన ప్రవర్థమానుడౌతున్నాడు ! తనకు అయ్యప్పస్వామి చెప్పినట్లుగా ఆ బాలుడిని స్వామి అంశగా భావించి ‘అయ్యప్ప’ అనే నామకరణం చేసాడు కుమారుడికి జయవర్థనుడు !
🌿అయ్యప్ప రూపురేఖలు , అతని మృదుస్వభావం , అందరిపట్ల కనబరిచే కరుణ - ఆ ప్రాంతం వారిని అతనినొక అసాధారణ బాలుడిగా గుర్తించేట్లు చేసాయి ! వన్యమృగాలు అతనికి నేస్తాలు ! భయపడకుండా వాటితో ఆటలాడేవాడు !
🌸ఎవరికే కష్టం వచ్చినా అయ్యప్ప అనుగ్రహంతో తీరిపోయేవి ! దుర్భిక్షం , అనారోగ్యం ఆ ప్రాంతంలో కాలుపెట్టకుండా శాసించిన పన్నెండేళ్ల బాలుడు అయ్యప్పను ఆ ప్రాంతం వాళ్ళు ధర్మశాస్తా అపరావతారంగా కొలవడం మొదలుపెట్టారు !
🌿‘‘అయ్యప్ప వేద శాస్త్రాలలో , యుద్ధ విద్యలలో నిపుణయ్యాడు ! ఇక ఆ ఉదయనుడిని నిర్జించడానికి తరలివెళ్లవలసిన సమయం ఆసన్నమైంది !’’ అనే నిర్ణయానికి వచ్చిన జయవర్థనుడు మామగారికి లేఖ రాసి పుత్రుడికి ఇచ్చాడు !
🌸 ‘‘నాయనా ! ఈ లేఖ తీసుకుని వెళ్లి పంబల రాజ్య రాజుగారిని కలుసుకో ! నీ తాతగారైన ఆయనను ఉదయనుడనే బందిపోటు దొంగ చెరసాలలో బంధించి హింసిస్తున్నాడనీ , పంబల రాజ్యంలో తన ప్రతినిధులను వుంచి అరాచకం ప్రబలేలా చేస్తున్నాడని విన్నాను !
🌿నీవు వెళ్లి ఆయనను రక్షించి , ఆ రాజ్యాన్ని ఆ దుర్మార్గుడి హస్తాలనుండి బయటపడేలా చూడు ! మా అందరి ఆశలు నీమీదే పెట్టుకున్నాము! వెళ్లు ! విజయాన్ని సాధించు !’’ అని కర్తవ్యోపదేశం చేశాడు అయ్యప్ప తల్లిదండ్రులకు నమస్కరించి , వాళ్ల దీవెనలు తీసుకుని లేఖతో పంబల రాజ్యానికి పయనమైనాడు.
🌸రెండు రోజులు ప్రయాణం చేసి అయ్యప్ప పందల రాజ్యం చేరి రాజభవనాన్ని సమీపించేసరికి అర్థరాత్రి అయింది ! భటులందరూ గాడనిద్రలో ఉన్నారు ! వాళ్లను దాటి చెరసాల చేరుకున్నాడు అయ్యప్ప ! అతనికి స్వాగతం పలుకుతున్నట్లు చెరసాల ద్వారాలు వాటంతటవే తెరచుకోవడంతో లోపలకు ప్రవేశించాడు !
🌿 ‘‘తాతా !’’ అని పిలిచాడు మెల్లగా. ఒక మూలగా కూర్చుని భగవంతుని ధ్యానిస్తున్న రాజు రాజశేఖరుడు ఆ పిలుపుకి ఉలిక్కిపడి కనులు తెరిచాడు ! ఎదురుగా నిలిచి చిరునవ్వుతో చూస్తున్న ఆజానుబాహువు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘నీవు.. నీవు..’’ అంటూ ఏం మాట్లాడాలో తెలియనట్లు చూస్తుంటే ‘‘మీ మనవడిని ! నా పేరు అయ్యప్ప ! జయవర్థనుడు , శశికళల కుమారుడిని !’’ అంటూ పరిచయం చేసుకుని తండ్రి ఇచ్చిన లేఖను అందించాడు చదవంటూ !
🌸 మసక వెలుతురులోనే లేఖను చదివి పట్టలేని ఆనందంతో మనవడిని కౌగిలించుకున్నాడు రాజశేఖరుడు ! ‘‘అలనాడు శ్రీకృష్ణుడు తాతను చెర విడిపించినట్లు ఈనాడు నన్ను చెరవిడిపించడానికి వచ్చిన దేవుడివి , మా అయ్యప్పస్వామివి ! నీ కోసమే ఎదురుచూస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్న నన్ను , ఈ రాజ్య ప్రజలను కాపాడాల్సిన భారం నీదే నాయనా !’’ అన్నాడు వణుకుతున్న కంఠంతో !
🌿 ‘‘నేను వచ్చింది అందుకోసమే గదా తాతగారూ ! ఇక నిశ్చితంగా ఉండండి’’ అంటూ తన వెంట తాతను బయటకు తీసుకువచ్చాడు అయ్యప్ప.
🌸తెల్లవారింది ! ఉదయనుడి ప్రతినిధులందరూ సభా మండపానికి వచ్చి సింహాసనం మీద ఆసీనుడై వున్న అపరిచితుడిని చూసి ఆశ్చర్యపోయారు ! ‘ఎవరితను ? ఎక్కడినుండి వచ్చాడు ? మన అనుజ్ఞ లేకుండా సింహాసనాన్ని అధిష్ఠించాడే ! ఎంత ధైర్యం ? ఎవరో తెలుసుకోవాలి ముందర !’ ఆవేశంగా తమలో తామే అనుకుంటూ ముందుకు దూసుకువచ్చిన వాళ్లలో అనుకోని మార్పు వచ్చింది. అయ్యప్ప వాళ్లవైపు నిశితంగా చూసిన చూపుకు అందరూ ఆయుధాలు క్రింద పడేసి ‘స్వాగతం నాయకా ! మీకు సుస్వాగతం’ అంటూ నమస్కరించారు.
🌿 ‘‘మీరందరూ ఇకపై పందల రాజు రాజసింహుడి సేవకులు ! వారి మనవడిని వారికి ప్రతినిధిని అయిన నా ఆజ్ఞలను పాలించవలసి వుంటుంది మీరందరూ !’’ గంభీరంగా అన్నాడు అయ్యప్ప వాళ్లవైపు తీక్షణంగా చూస్తూ ! మౌనంగా తలలూపి నిలిచారందరూ !
🌸 ‘‘ఎవరు మీలో సేనాధిపతి ?’’ అధికార పూర్వకంగా అడగటంతో ‘‘నేను నాయకా ! నా పేరు రణతుంగుడు !’’ వినయపూర్వకంగా జవాబు చెప్పి ముందుకు వచ్చి నిలిచాడు ఒకడు !
‘‘రణతుంగా ! వెంటనే సైన్యాలను ఒక చోట సమావేశపరుచు ! నేను ఇక్కడి సేనల పరిస్థితి తెలుసుకోవాలనుకుంటున్నాను ముందుగా !’’ అనేసరికి ‘‘క్షమించండి నాయకా ! ప్రస్తుతం వున్న సేన నామమాత్రమే ! అందరూ తమ బాధ్యతలు మరిచి భోగ విలాసాలలో కాలం గడుపుతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు !
🌿 ప్రజలు కూడా అంతే ! యువకులెవరూ సైన్యంలో చేరలేదు ! ప్రజలందరిలో క్రమశిక్షణ లేకుండా పోయింది !’’ అంటూ బెరకుగా అక్కడి పరిస్థితులు వివరించాడు ఉదయనుడు నియమించిన సేనాధిపతి రణతుంగుడు ! ‘‘ఊ.. ‘యథారాజా తథాప్రజ’ అన్నట్లు మీరు మీ బాధ్యతలు విస్మరించి ప్రజలలో అరాచకం ప్రబలేలా చేశారన్నమాట ! ముందుగా ఇక్కడి పరిస్థితులు చక్కదిద్దాలి !’’ అంటూ పంబలరాజ్య సేనను , ప్రజలను , ఉదయనుడి ప్రతినిధులను సరిదిద్దడానికి పూనుకున్నాడు అయ్యప్ప!
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 22,వ భాగం ప్రారంభం...!!
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌸కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి ! జయవర్థనుడు , శశికళల పుత్రుడు జన్మించి దిన దిన ప్రవర్థమానుడౌతున్నాడు ! తనకు అయ్యప్పస్వామి చెప్పినట్లుగా ఆ బాలుడిని స్వామి అంశగా భావించి ‘అయ్యప్ప’ అనే నామకరణం చేసాడు కుమారుడికి జయవర్థనుడు !
🌿అయ్యప్ప రూపురేఖలు , అతని మృదుస్వభావం , అందరిపట్ల కనబరిచే కరుణ - ఆ ప్రాంతం వారిని అతనినొక అసాధారణ బాలుడిగా గుర్తించేట్లు చేసాయి ! వన్యమృగాలు అతనికి నేస్తాలు ! భయపడకుండా వాటితో ఆటలాడేవాడు !
🌸ఎవరికే కష్టం వచ్చినా అయ్యప్ప అనుగ్రహంతో తీరిపోయేవి ! దుర్భిక్షం , అనారోగ్యం ఆ ప్రాంతంలో కాలుపెట్టకుండా శాసించిన పన్నెండేళ్ల బాలుడు అయ్యప్పను ఆ ప్రాంతం వాళ్ళు ధర్మశాస్తా అపరావతారంగా కొలవడం మొదలుపెట్టారు !
🌿‘‘అయ్యప్ప వేద శాస్త్రాలలో , యుద్ధ విద్యలలో నిపుణయ్యాడు ! ఇక ఆ ఉదయనుడిని నిర్జించడానికి తరలివెళ్లవలసిన సమయం ఆసన్నమైంది !’’ అనే నిర్ణయానికి వచ్చిన జయవర్థనుడు మామగారికి లేఖ రాసి పుత్రుడికి ఇచ్చాడు !
🌸 ‘‘నాయనా ! ఈ లేఖ తీసుకుని వెళ్లి పంబల రాజ్య రాజుగారిని కలుసుకో ! నీ తాతగారైన ఆయనను ఉదయనుడనే బందిపోటు దొంగ చెరసాలలో బంధించి హింసిస్తున్నాడనీ , పంబల రాజ్యంలో తన ప్రతినిధులను వుంచి అరాచకం ప్రబలేలా చేస్తున్నాడని విన్నాను !
🌿నీవు వెళ్లి ఆయనను రక్షించి , ఆ రాజ్యాన్ని ఆ దుర్మార్గుడి హస్తాలనుండి బయటపడేలా చూడు ! మా అందరి ఆశలు నీమీదే పెట్టుకున్నాము! వెళ్లు ! విజయాన్ని సాధించు !’’ అని కర్తవ్యోపదేశం చేశాడు అయ్యప్ప తల్లిదండ్రులకు నమస్కరించి , వాళ్ల దీవెనలు తీసుకుని లేఖతో పంబల రాజ్యానికి పయనమైనాడు.
🌸రెండు రోజులు ప్రయాణం చేసి అయ్యప్ప పందల రాజ్యం చేరి రాజభవనాన్ని సమీపించేసరికి అర్థరాత్రి అయింది ! భటులందరూ గాడనిద్రలో ఉన్నారు ! వాళ్లను దాటి చెరసాల చేరుకున్నాడు అయ్యప్ప ! అతనికి స్వాగతం పలుకుతున్నట్లు చెరసాల ద్వారాలు వాటంతటవే తెరచుకోవడంతో లోపలకు ప్రవేశించాడు !
🌿 ‘‘తాతా !’’ అని పిలిచాడు మెల్లగా. ఒక మూలగా కూర్చుని భగవంతుని ధ్యానిస్తున్న రాజు రాజశేఖరుడు ఆ పిలుపుకి ఉలిక్కిపడి కనులు తెరిచాడు ! ఎదురుగా నిలిచి చిరునవ్వుతో చూస్తున్న ఆజానుబాహువు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘నీవు.. నీవు..’’ అంటూ ఏం మాట్లాడాలో తెలియనట్లు చూస్తుంటే ‘‘మీ మనవడిని ! నా పేరు అయ్యప్ప ! జయవర్థనుడు , శశికళల కుమారుడిని !’’ అంటూ పరిచయం చేసుకుని తండ్రి ఇచ్చిన లేఖను అందించాడు చదవంటూ !
🌸 మసక వెలుతురులోనే లేఖను చదివి పట్టలేని ఆనందంతో మనవడిని కౌగిలించుకున్నాడు రాజశేఖరుడు ! ‘‘అలనాడు శ్రీకృష్ణుడు తాతను చెర విడిపించినట్లు ఈనాడు నన్ను చెరవిడిపించడానికి వచ్చిన దేవుడివి , మా అయ్యప్పస్వామివి ! నీ కోసమే ఎదురుచూస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్న నన్ను , ఈ రాజ్య ప్రజలను కాపాడాల్సిన భారం నీదే నాయనా !’’ అన్నాడు వణుకుతున్న కంఠంతో !
🌿 ‘‘నేను వచ్చింది అందుకోసమే గదా తాతగారూ ! ఇక నిశ్చితంగా ఉండండి’’ అంటూ తన వెంట తాతను బయటకు తీసుకువచ్చాడు అయ్యప్ప.
🌸తెల్లవారింది ! ఉదయనుడి ప్రతినిధులందరూ సభా మండపానికి వచ్చి సింహాసనం మీద ఆసీనుడై వున్న అపరిచితుడిని చూసి ఆశ్చర్యపోయారు ! ‘ఎవరితను ? ఎక్కడినుండి వచ్చాడు ? మన అనుజ్ఞ లేకుండా సింహాసనాన్ని అధిష్ఠించాడే ! ఎంత ధైర్యం ? ఎవరో తెలుసుకోవాలి ముందర !’ ఆవేశంగా తమలో తామే అనుకుంటూ ముందుకు దూసుకువచ్చిన వాళ్లలో అనుకోని మార్పు వచ్చింది. అయ్యప్ప వాళ్లవైపు నిశితంగా చూసిన చూపుకు అందరూ ఆయుధాలు క్రింద పడేసి ‘స్వాగతం నాయకా ! మీకు సుస్వాగతం’ అంటూ నమస్కరించారు.
🌿 ‘‘మీరందరూ ఇకపై పందల రాజు రాజసింహుడి సేవకులు ! వారి మనవడిని వారికి ప్రతినిధిని అయిన నా ఆజ్ఞలను పాలించవలసి వుంటుంది మీరందరూ !’’ గంభీరంగా అన్నాడు అయ్యప్ప వాళ్లవైపు తీక్షణంగా చూస్తూ ! మౌనంగా తలలూపి నిలిచారందరూ !
🌸 ‘‘ఎవరు మీలో సేనాధిపతి ?’’ అధికార పూర్వకంగా అడగటంతో ‘‘నేను నాయకా ! నా పేరు రణతుంగుడు !’’ వినయపూర్వకంగా జవాబు చెప్పి ముందుకు వచ్చి నిలిచాడు ఒకడు !
‘‘రణతుంగా ! వెంటనే సైన్యాలను ఒక చోట సమావేశపరుచు ! నేను ఇక్కడి సేనల పరిస్థితి తెలుసుకోవాలనుకుంటున్నాను ముందుగా !’’ అనేసరికి ‘‘క్షమించండి నాయకా ! ప్రస్తుతం వున్న సేన నామమాత్రమే ! అందరూ తమ బాధ్యతలు మరిచి భోగ విలాసాలలో కాలం గడుపుతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు !
🌿 ప్రజలు కూడా అంతే ! యువకులెవరూ సైన్యంలో చేరలేదు ! ప్రజలందరిలో క్రమశిక్షణ లేకుండా పోయింది !’’ అంటూ బెరకుగా అక్కడి పరిస్థితులు వివరించాడు ఉదయనుడు నియమించిన సేనాధిపతి రణతుంగుడు ! ‘‘ఊ.. ‘యథారాజా తథాప్రజ’ అన్నట్లు మీరు మీ బాధ్యతలు విస్మరించి ప్రజలలో అరాచకం ప్రబలేలా చేశారన్నమాట ! ముందుగా ఇక్కడి పరిస్థితులు చక్కదిద్దాలి !’’ అంటూ పంబలరాజ్య సేనను , ప్రజలను , ఉదయనుడి ప్రతినిధులను సరిదిద్దడానికి పూనుకున్నాడు అయ్యప్ప!
🌸అయ్యప్ప పర్యవేక్షణలో క్రమంగా అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయి ! సైనికులలో తిరిగి క్రమశిక్షణ నెలకొన్నది ! అంతవరకు ఉదయనుడి ప్రతినిధులకు భయపడుతూ వాళ్లకు సేవలు చేస్తూ బ్రతుకుతున్న ప్రజలలో అయ్యప్ప రాకతో ధైర్యం , ఉత్సాహం చోటుచేసుకున్నాయి ! ‘‘మనం ఎదురుచూస్తున్న మన దైవం అయ్యప్ప తిరిగి అవతరించి మన మధ్యకు వచ్చాడు ! ఇక ఉదయ నుడి అంతం దగ్గర పడినట్లే’’ అని సంతోషపడుతూ అయ్యప్పకు భక్తిపూర్వకంగా నమస్కరించి ఆయన నేతృత్వంలో అందరూ మంచి పౌరులుగా మసలుకోసాగారు !
🌿 దృఢకాయులైన యువకులను సైన్యంలో చేర్చుకుని తగిన శిక్షణ ఇప్పించి సైన్యాన్ని బలవత్తరం కావించాడు ! అయ్యప్ప రాకతో రాజ్యంలో దుర్భిక్షం అరాచకం స్థానే సుఖ శాంతులు నెలకొన్నాయి. ప్రజలందరిలో అయ్యప్ప పాలనలో ఉదయనుడి ప్రతినిధులు కూడా మనస్సులు మారి అయ్యప్ప సేవలో క్రమశిక్షణ పాటిస్తూ మసలుకోసాగారు!
🌸పందల రాజ్యంలో పరిస్థితులు సరిదిద్దుతున్న అయ్యప్ప మరొక ప్రమాదకరమైన సముద్రపు దొంగను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ దొంగ పేరు వావరు ! మంత్ర తంత్రాల్లో ఆరితేరినవాడు ! నాయకా ! సముద్ర దొంగ వావర్ ఉదయనుడికన్నా బలవంతుడు ! మంత్ర తంత్రాలు తెలిసినవాడు ! కాలభైరవోపాసకుడు ! సముద్రం మీద ప్రయాణించే వర్తకుల ఓడలను అడ్డగించి వాటిని కొల్లగొడుతూండే వావరు దృష్టి ఇప్పుడు తీర ప్రాంత రాజ్యాలమీద పడిందట !
🌿తన సేనతో తీర ప్రాంతాలపై దాడులు చేస్తున్నాడు ! ఇటువైపునకు ఏ సమయంలోనైనా దండెత్తి రావచ్చును ! అతడిని ఎదిరించడం మన సేనలవల్ల కాకపోవచ్చు ! అంటూ రణతుంగుడు తెచ్చిన ఆ వార్త విని చిన్నగా నవ్వాడు అయ్యప్ప ! ‘‘మనసేనంతా ఎందుకు ? నీవు , నేను చాలమా ?’’ అడిగాడు హాస్య ధోరణిలో ! రణతుంగుడు ఆందోళనగా చూశాడు ! ‘నాయకా ! వావరు శక్తి సామర్థ్యాల గూర్చి తెలిసి వున్నవాడిని గనుక మీకు చెప్పే సాహసం చేస్తున్నందుకు మన్నించండి. తన మంత్ర బలంతో ఎదుటి పక్షంవారిని పక్షులుగా , జంతువులుగా మార్చేసి వాటితో వినోదిస్తుంటాడు !
🌸 కొందరి తలలు నరికి తాను ఉపాసించే కాలభైరవుడికి బలిగా సమర్పిస్తాడు ! రక్తం నివేదన చేసి ఆ రక్తాన్ని పాత్రలనిండా తాను త్రాగేసేంతటి కఠినాత్ముడు ! ఆలోచించి నిర్ణయం తీసుకోండి నాయకా !’’ అంటూ రణతుంగుడు చేసిన హెచ్చరిక ఏమార్పూ తేలేదు అయ్యప్పలో ! ‘‘కాలభైరవుడంటే కాశీ పట్టణాన్ని కాపాడుతుండేవాడు , ఏకాదశ రుద్రులలో ఒకడు ! ఆ స్వామి భక్తుడిని చూడాలన్న కోరిక నాలో మరింత దృఢమైంది గానీ , భయంతో వెనుకంజ వేయాలనిపించడంలేదు ! రేపే మనం బయలుదేరుతున్నాం’’ అంటూ సభను చాలించి లేచాడు అయ్యప్ప !
🌿ప్రతిరోజూలాగే నిలువెత్తు కాలభైరవుని విగ్రహానికి పూజాదికాలు నిర్వర్తిస్తున్నాడు సముద్ర దొంగ వావరు ! ఇతరులను చంపి వారి ధనపురాశులను దోచుకోవడం వృత్తి అయిన వావరు కాలభైరవుని ఉపాసన మాత్రం భక్తితో నిష్ఠగా జరుపుతాడు ! పూజ చేస్తున్నంతసేపు ఇతరపు ఆలోచనలు మనస్సులో ప్రవేశించవు ! తాంత్రిక పూజ కావిస్తాడు ! పూజానంతరం తన మామూలు కార్యక్రమాలలో ప్రవేశిస్తాడు !
🌸 ఆ రోజు పంబల రాజ్య తీరం వైపు వెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకుని అందుకు సిద్ధవౌతున్నాడు వావర్!
అంతలో.. ‘‘వత్సా ! ఈవేళ నీవు వెళ్లవలసిన అవసరం లేకుండా నీ దగ్గరకే ఒక వ్యక్తి రాబోతున్నాడు ! అతని రాకతో నీ జీవన విధానమే మారిపోతుంది ! వేచి వుండు !’’ అన్న అశరీరవాణి పలుకులు వినరావడంతో ఆశ్చర్యంగా ఆలోచనామగ్నుడైనాడు వావరు ! ‘‘ఆ పలుకులు తను ఉపాసించే కాలభైరవునివే ! ఎవరి విషయంగా తనను సావధాన పరుస్తున్నాడు ? ఎవరా వస్తున్న వ్యక్తి ? అనుకుంటుండగానే భటుడొకడు పరుగు పరుగునవచ్చాడు !
🌿 ‘‘నాయకా ! మన స్థావరం వైపు ఎవరో గజారూఢుడైన వ్యక్తి వస్తున్నాడు ! అతనిని ఆపడం మనవాళ్ళ సాధ్యం కాలేదుట !’’ అంటూ భటుడు తెచ్చిన వర్తమానం విని కనుబొమ్మలు ముడివడగా ‘‘ఎవరింతటి సాహసం చేసి మన స్థావరంలోకి ప్రవేశించారు ? వెంటనే నా రథాన్ని సిద్ధం చేయండి’’ అంటూ లేచి బయటకు వచ్చాడు వావరు ! రథం కొద్ది దూరం వెళ్లగానే మందగమనంతో సాగివస్తున్న తెల్లని ఏనుగు మీద ఆసీనుడై వస్తున్న అయ్యప్ప దర్శనమిచ్చాడు ! ఆవైపే చూస్తూ వుండిపోయాడు వావరు తనను తానే మరిచి ! ‘ఆహా ! ఎంతటి దివ్య మంగళరూపం ! కరుణ ఆ కళ్ళలోనుండి జాలువారుతున్నది ! చిరునవ్వుతో తనవైపే చూస్తున్న ఆ కళ్లు నన్ను గుర్తించలేదా ? అని ప్రశ్నిస్తున్నట్లున్నాయి !
🌸సందేహం లేదు !
కాలభైరవస్వామి తనను సావధానపరిచింది ఈ దివ్య మంగళ మూర్తి గురించే ! చూస్తుంటే అతనికి నా సర్వస్వాన్ని అర్పించివేయాలనిపిస్తున్నది ! దొంగతనాలు , దోపిడీలు ఏవీ వద్దు ! వెళ్లి ఆ దివ్య పురుషుని పాదాలనాశ్రయిస్తాను ! అనుకుంటూ రథం దిగి ఎదురువెళ్లాడు ముకుళిత హస్తాలతో ! ‘‘ నామీద దయతో నా గృహానికి వచ్చిన దివ్య పురుషా ! నీకు నా సాదర ప్రణామాలు ! నీ దర్శనంతో...సశేషం.. 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞🙏🌹🎻
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿 దృఢకాయులైన యువకులను సైన్యంలో చేర్చుకుని తగిన శిక్షణ ఇప్పించి సైన్యాన్ని బలవత్తరం కావించాడు ! అయ్యప్ప రాకతో రాజ్యంలో దుర్భిక్షం అరాచకం స్థానే సుఖ శాంతులు నెలకొన్నాయి. ప్రజలందరిలో అయ్యప్ప పాలనలో ఉదయనుడి ప్రతినిధులు కూడా మనస్సులు మారి అయ్యప్ప సేవలో క్రమశిక్షణ పాటిస్తూ మసలుకోసాగారు!
🌸పందల రాజ్యంలో పరిస్థితులు సరిదిద్దుతున్న అయ్యప్ప మరొక ప్రమాదకరమైన సముద్రపు దొంగను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ దొంగ పేరు వావరు ! మంత్ర తంత్రాల్లో ఆరితేరినవాడు ! నాయకా ! సముద్ర దొంగ వావర్ ఉదయనుడికన్నా బలవంతుడు ! మంత్ర తంత్రాలు తెలిసినవాడు ! కాలభైరవోపాసకుడు ! సముద్రం మీద ప్రయాణించే వర్తకుల ఓడలను అడ్డగించి వాటిని కొల్లగొడుతూండే వావరు దృష్టి ఇప్పుడు తీర ప్రాంత రాజ్యాలమీద పడిందట !
🌿తన సేనతో తీర ప్రాంతాలపై దాడులు చేస్తున్నాడు ! ఇటువైపునకు ఏ సమయంలోనైనా దండెత్తి రావచ్చును ! అతడిని ఎదిరించడం మన సేనలవల్ల కాకపోవచ్చు ! అంటూ రణతుంగుడు తెచ్చిన ఆ వార్త విని చిన్నగా నవ్వాడు అయ్యప్ప ! ‘‘మనసేనంతా ఎందుకు ? నీవు , నేను చాలమా ?’’ అడిగాడు హాస్య ధోరణిలో ! రణతుంగుడు ఆందోళనగా చూశాడు ! ‘నాయకా ! వావరు శక్తి సామర్థ్యాల గూర్చి తెలిసి వున్నవాడిని గనుక మీకు చెప్పే సాహసం చేస్తున్నందుకు మన్నించండి. తన మంత్ర బలంతో ఎదుటి పక్షంవారిని పక్షులుగా , జంతువులుగా మార్చేసి వాటితో వినోదిస్తుంటాడు !
🌸 కొందరి తలలు నరికి తాను ఉపాసించే కాలభైరవుడికి బలిగా సమర్పిస్తాడు ! రక్తం నివేదన చేసి ఆ రక్తాన్ని పాత్రలనిండా తాను త్రాగేసేంతటి కఠినాత్ముడు ! ఆలోచించి నిర్ణయం తీసుకోండి నాయకా !’’ అంటూ రణతుంగుడు చేసిన హెచ్చరిక ఏమార్పూ తేలేదు అయ్యప్పలో ! ‘‘కాలభైరవుడంటే కాశీ పట్టణాన్ని కాపాడుతుండేవాడు , ఏకాదశ రుద్రులలో ఒకడు ! ఆ స్వామి భక్తుడిని చూడాలన్న కోరిక నాలో మరింత దృఢమైంది గానీ , భయంతో వెనుకంజ వేయాలనిపించడంలేదు ! రేపే మనం బయలుదేరుతున్నాం’’ అంటూ సభను చాలించి లేచాడు అయ్యప్ప !
🌿ప్రతిరోజూలాగే నిలువెత్తు కాలభైరవుని విగ్రహానికి పూజాదికాలు నిర్వర్తిస్తున్నాడు సముద్ర దొంగ వావరు ! ఇతరులను చంపి వారి ధనపురాశులను దోచుకోవడం వృత్తి అయిన వావరు కాలభైరవుని ఉపాసన మాత్రం భక్తితో నిష్ఠగా జరుపుతాడు ! పూజ చేస్తున్నంతసేపు ఇతరపు ఆలోచనలు మనస్సులో ప్రవేశించవు ! తాంత్రిక పూజ కావిస్తాడు ! పూజానంతరం తన మామూలు కార్యక్రమాలలో ప్రవేశిస్తాడు !
🌸 ఆ రోజు పంబల రాజ్య తీరం వైపు వెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకుని అందుకు సిద్ధవౌతున్నాడు వావర్!
అంతలో.. ‘‘వత్సా ! ఈవేళ నీవు వెళ్లవలసిన అవసరం లేకుండా నీ దగ్గరకే ఒక వ్యక్తి రాబోతున్నాడు ! అతని రాకతో నీ జీవన విధానమే మారిపోతుంది ! వేచి వుండు !’’ అన్న అశరీరవాణి పలుకులు వినరావడంతో ఆశ్చర్యంగా ఆలోచనామగ్నుడైనాడు వావరు ! ‘‘ఆ పలుకులు తను ఉపాసించే కాలభైరవునివే ! ఎవరి విషయంగా తనను సావధాన పరుస్తున్నాడు ? ఎవరా వస్తున్న వ్యక్తి ? అనుకుంటుండగానే భటుడొకడు పరుగు పరుగునవచ్చాడు !
🌿 ‘‘నాయకా ! మన స్థావరం వైపు ఎవరో గజారూఢుడైన వ్యక్తి వస్తున్నాడు ! అతనిని ఆపడం మనవాళ్ళ సాధ్యం కాలేదుట !’’ అంటూ భటుడు తెచ్చిన వర్తమానం విని కనుబొమ్మలు ముడివడగా ‘‘ఎవరింతటి సాహసం చేసి మన స్థావరంలోకి ప్రవేశించారు ? వెంటనే నా రథాన్ని సిద్ధం చేయండి’’ అంటూ లేచి బయటకు వచ్చాడు వావరు ! రథం కొద్ది దూరం వెళ్లగానే మందగమనంతో సాగివస్తున్న తెల్లని ఏనుగు మీద ఆసీనుడై వస్తున్న అయ్యప్ప దర్శనమిచ్చాడు ! ఆవైపే చూస్తూ వుండిపోయాడు వావరు తనను తానే మరిచి ! ‘ఆహా ! ఎంతటి దివ్య మంగళరూపం ! కరుణ ఆ కళ్ళలోనుండి జాలువారుతున్నది ! చిరునవ్వుతో తనవైపే చూస్తున్న ఆ కళ్లు నన్ను గుర్తించలేదా ? అని ప్రశ్నిస్తున్నట్లున్నాయి !
🌸సందేహం లేదు !
కాలభైరవస్వామి తనను సావధానపరిచింది ఈ దివ్య మంగళ మూర్తి గురించే ! చూస్తుంటే అతనికి నా సర్వస్వాన్ని అర్పించివేయాలనిపిస్తున్నది ! దొంగతనాలు , దోపిడీలు ఏవీ వద్దు ! వెళ్లి ఆ దివ్య పురుషుని పాదాలనాశ్రయిస్తాను ! అనుకుంటూ రథం దిగి ఎదురువెళ్లాడు ముకుళిత హస్తాలతో ! ‘‘ నామీద దయతో నా గృహానికి వచ్చిన దివ్య పురుషా ! నీకు నా సాదర ప్రణామాలు ! నీ దర్శనంతో...సశేషం.. 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞🙏🌹🎻
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 21వ అధ్యాయం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...!!
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 21 ,వ భాగం... ప్రారంభం....!!🌹🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸జయవర్థనుడు ఇష్టం లేకపోయినా తండ్రి మరీ మరీ చెప్పడంతో బయటకు పరుగెత్తాడు ! అప్పటికే ఉదయనుడి గుర్రం ఆలయం ముందర వచ్చి ఆగింది ! దిగి లోపలకు వెళ్లాడు ! దేవుడి మెడలో మాల సవరిస్తున్న పూజారి వైపు క్రూరంగా చూస్తూ, ‘‘ఆ రాతి బొమ్మకేం వేస్తావు ? అసలు దేవుడిని నేను ! నా మెడలో వేయి !’’ అంటూ గద్దించాడు ! అతనట్లా గద్దించడంతో కోపం , అసహ్యం కలిగాయి పూజారికి ! అందుకే భయపడకుండా ‘‘పాపాత్ముడా ! ఇప్పటివరకు ఎన్నో పాపాలు చేసావు ! ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని ధర్మశాస్తా అయ్యప్పస్వామిని శరణు వేడుకో ! నిన్ను మన్నించి సద్బుద్ధి ప్రసాదిస్తాడు ఆ పరబ్రహ్మ , జ్యోతిరూపుడు’’ అంటూ హితవు చెప్పాడు.
🌿ఆ మాటలకు మరింత కోపంతో కళ్లనుండి నిప్పులు కురిపించాడు ఉదయనుడు ! ‘‘నాకు ఎదురు చెప్పే సాహం చేస్తావా , ముసలి బ్రాహ్మణుడా ! ఇప్పుడే నీకు తగిన శిక్ష విధిస్తాను చూడు !’’ అంటూ కత్తిని చర్రున దూసి పూజారి కడుపులో బలంగా గుచ్చాడు ఉదయనుడు ! ‘‘హా ! అయ్యప్పా ! స్వామియే శరణం!’’ అంటూ నేలకొరిగిపోయాడు పూజారి ! ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయాయి.
‘హా.. హ.. హ ! నాకే చెప్పే సాహసం చేస్తాడా ! తగిన శిక్ష విధించాను అనుకుంటూ అక్కడ వున్న పూజా ద్రవ్యాలన్నిటిని చిందరవందరగా విసిరేసి స్వామి విగ్రహాన్ని పెకలించి ప్రక్కకు విసిరేసి పెద్దగా నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయాడు ఉదయనుడు !
🌸 ‘‘ఏమిటి ! ఉదయనుడు అంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడా ? పూజారిని చంపి గుడిని ధ్వంసం కావించాడా ? ఎంతటి ఘోరానికి సిద్ధపడ్డాడు ! ఎట్లా వాడి దుండగాలను అరికట్టడం ? ఎవరు ఆ కార్యం చేయగలరు ? అయ్యప్ప స్వామే పూనుకుని వాడిని అంతం చేయాలి ! ఆ స్వామిని ప్రార్థించడం మాత్రమే మనం చేయగలిగింది !’’ అంటూ తమ పూజా గృహంలోని అయ్యప్ప స్వామి విగ్రహానికి నమస్కరించి ధ్యానించాడు పంబరాజు !
🌹‘‘తేజో మండల మధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం
దేవం పుష్ప శరేక్షు కార్ముక లసన్మాణిక్య పాత్రాభయం
బిభ్రాణాంకరపంకజైర్ మదగజ స్కంధాది రూఢం విభుం
శాస్తారం శరణం భజామి సతతం త్రైలోక్య సమ్మోహనం!’’ 🌹
🌷 (తేజోమండల మధ్యలో దివ్యాభరణాలతో , పట్టువస్త్రాలతో అలంకరింపబడి మూడు నేత్రాలతో ప్రకటితమై హస్తాలలో పుష్పం , చెరుకుగడ, శరాలు , విల్లు , మాణిక్య పాత్ర ధరించి భక్తులకు అభయముద్రను ప్రసాదిస్తూ , శతృవులను సంహరించడానికి మత్తగజాన్ని అదిరోహించి వస్తున్న ధర్మశాస్తా అయ్యప్ప స్వామిని మూడు లోకాలను తన దివ్య మోహన రూపంతో సమ్మోహితులను కావించే స్వామిని ఎల్లప్పుడూ భజిస్తూ వుంటాను)🌷
🌿 ఆయన మనోనేత్రం ముందు కదలాడిన దివ్యరూపాన్ని చూస్తూ పరవశించిపోయాడు ! ‘‘హే జ్యోతిరూపా ! పందళరాజకుమారుడివి నీవు ! ఈనాడు ఈ దుస్థితి నీ రాజ్యానికి ఉదయనుడనే దుర్మార్గునివల్ల సంభవించింది ! మా మీద దయతో అతడిని వధించి మమ్మల్ని కాపాడు ! మహిషి సంహారం కోసం అవతరించిన నీవు తిరిగి నీ భక్తులను ఉద్ధరించడానికి తరలిరా తండ్రీ !’’ అంటూ ప్రార్థించాడు !
🌸రాజు ప్రార్థన స్వామిని చేరింది ! అందుకే శాంత గంభీర స్వరంతో పలికాడు ! ‘‘రాజా ! ఉదయనుడి కాలం తీరడానికి మరికొంత వ్యవధి ఉన్నది ! ప్రస్తుతం కలిపురుషుని ప్రభావంతో అతడు కావిస్తున్న దుష్కర్మలు అంతం కావించడానికి త్వరలోనే నేను తిరిగి నీ వంశంలోనే అవతరిస్తాను !
🌿రాజా ! మరికొద్దికాలంలో నీ దగ్గరకు ఒక బ్రాహ్మణ కుమారుడు వస్తాడు ! అతనికి నీ కుమార్తెనిచ్చి వివాహం కావించు !’’ ఆ పలుకులు అమృతపు జల్లులా కురిసాయి రాజు కర్ణపుటాలలో ! ‘‘మీరు చెప్పినట్లే కావిస్తాను ! నా మీద ఎంతటి కరుణ చూపావు తండ్రీ ! నీకు నా కోటి కోటి ప్రణామాలు !’’ అంటూ అంజలి ఘటించాడు రాజు !
🌸‘‘జయవర్థనా ! లే ! వెంటనే బయలుదేరి పంబల రాజ్యానికి వెళ్లు ! అన్న పలుకులు స్పష్టంగా వినపడటంతో చప్పున లేచి కూర్చున్నాడు జయవర్థనుడు !
ఉదయనుడి నుండి తప్పించుకొని పరుగు తీసిన పూజారి కుమారుడు ఎట్లాగో మణికంఠుడు పులిపాలకోసం వచ్చిన అరణ్య ప్రాంతాన్ని చేరుకున్నాడు !
🌿ఆ ప్రాంతమంతటా స్వామి సంచరించినది కావడంతో పవిత్రమైంది ! దేవతల ప్రార్థనతో స్వామి విశ్రాంతి తీసుకున్న ప్రాంతం ‘పొన్నంబలమేడు’ గా పిలువబడుతూ ఆటవికుల నివాస స్థానమై వుంది జయవర్థనుడు అక్కడకు చేరిన సమయంలో ! ఆ పవిత్ర స్థానంవైపు ఉదయనుడు రాలేకపోవడానికి స్వామి మహిమే కారణంగా భావిస్తూ సురక్షితంగా అక్కడివారితో కలిసి కాలం గడుపుతూ వున్నాడు జయవర్థనుడు !
🌸అప్పటికి కొన్ని సంవత్సరాలు గడిచాయి ! తనను ప్రబోధించినదేవరై వుంటారా అనుకుంటూ లేచి ఆశ్రమం బయటకు వచ్చాడు జయవర్థనుడు ! ఇంకా బ్రాహ్మీముహూర్తం కాలేదు ! ‘పంబలరాజ్యానికి వెళ్లమంటున్నదెవరు ? వెళ్లి ఏం చేయాలి ?’ అనుకుంటూ అక్కడే నిలబడ్డాడు ! ఆకాశంలో మెరుపు మెరిసినట్లయింది ! తేజోమండల మధ్యంలో పులిమీద ఆసీనుడై వున్న అయ్యప్పస్వామి దర్శనమిచ్చాడు !
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 21 ,వ భాగం... ప్రారంభం....!!🌹🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸జయవర్థనుడు ఇష్టం లేకపోయినా తండ్రి మరీ మరీ చెప్పడంతో బయటకు పరుగెత్తాడు ! అప్పటికే ఉదయనుడి గుర్రం ఆలయం ముందర వచ్చి ఆగింది ! దిగి లోపలకు వెళ్లాడు ! దేవుడి మెడలో మాల సవరిస్తున్న పూజారి వైపు క్రూరంగా చూస్తూ, ‘‘ఆ రాతి బొమ్మకేం వేస్తావు ? అసలు దేవుడిని నేను ! నా మెడలో వేయి !’’ అంటూ గద్దించాడు ! అతనట్లా గద్దించడంతో కోపం , అసహ్యం కలిగాయి పూజారికి ! అందుకే భయపడకుండా ‘‘పాపాత్ముడా ! ఇప్పటివరకు ఎన్నో పాపాలు చేసావు ! ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని ధర్మశాస్తా అయ్యప్పస్వామిని శరణు వేడుకో ! నిన్ను మన్నించి సద్బుద్ధి ప్రసాదిస్తాడు ఆ పరబ్రహ్మ , జ్యోతిరూపుడు’’ అంటూ హితవు చెప్పాడు.
🌿ఆ మాటలకు మరింత కోపంతో కళ్లనుండి నిప్పులు కురిపించాడు ఉదయనుడు ! ‘‘నాకు ఎదురు చెప్పే సాహం చేస్తావా , ముసలి బ్రాహ్మణుడా ! ఇప్పుడే నీకు తగిన శిక్ష విధిస్తాను చూడు !’’ అంటూ కత్తిని చర్రున దూసి పూజారి కడుపులో బలంగా గుచ్చాడు ఉదయనుడు ! ‘‘హా ! అయ్యప్పా ! స్వామియే శరణం!’’ అంటూ నేలకొరిగిపోయాడు పూజారి ! ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయాయి.
‘హా.. హ.. హ ! నాకే చెప్పే సాహసం చేస్తాడా ! తగిన శిక్ష విధించాను అనుకుంటూ అక్కడ వున్న పూజా ద్రవ్యాలన్నిటిని చిందరవందరగా విసిరేసి స్వామి విగ్రహాన్ని పెకలించి ప్రక్కకు విసిరేసి పెద్దగా నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోయాడు ఉదయనుడు !
🌸 ‘‘ఏమిటి ! ఉదయనుడు అంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడా ? పూజారిని చంపి గుడిని ధ్వంసం కావించాడా ? ఎంతటి ఘోరానికి సిద్ధపడ్డాడు ! ఎట్లా వాడి దుండగాలను అరికట్టడం ? ఎవరు ఆ కార్యం చేయగలరు ? అయ్యప్ప స్వామే పూనుకుని వాడిని అంతం చేయాలి ! ఆ స్వామిని ప్రార్థించడం మాత్రమే మనం చేయగలిగింది !’’ అంటూ తమ పూజా గృహంలోని అయ్యప్ప స్వామి విగ్రహానికి నమస్కరించి ధ్యానించాడు పంబరాజు !
🌹‘‘తేజో మండల మధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం
దేవం పుష్ప శరేక్షు కార్ముక లసన్మాణిక్య పాత్రాభయం
బిభ్రాణాంకరపంకజైర్ మదగజ స్కంధాది రూఢం విభుం
శాస్తారం శరణం భజామి సతతం త్రైలోక్య సమ్మోహనం!’’ 🌹
🌷 (తేజోమండల మధ్యలో దివ్యాభరణాలతో , పట్టువస్త్రాలతో అలంకరింపబడి మూడు నేత్రాలతో ప్రకటితమై హస్తాలలో పుష్పం , చెరుకుగడ, శరాలు , విల్లు , మాణిక్య పాత్ర ధరించి భక్తులకు అభయముద్రను ప్రసాదిస్తూ , శతృవులను సంహరించడానికి మత్తగజాన్ని అదిరోహించి వస్తున్న ధర్మశాస్తా అయ్యప్ప స్వామిని మూడు లోకాలను తన దివ్య మోహన రూపంతో సమ్మోహితులను కావించే స్వామిని ఎల్లప్పుడూ భజిస్తూ వుంటాను)🌷
🌿 ఆయన మనోనేత్రం ముందు కదలాడిన దివ్యరూపాన్ని చూస్తూ పరవశించిపోయాడు ! ‘‘హే జ్యోతిరూపా ! పందళరాజకుమారుడివి నీవు ! ఈనాడు ఈ దుస్థితి నీ రాజ్యానికి ఉదయనుడనే దుర్మార్గునివల్ల సంభవించింది ! మా మీద దయతో అతడిని వధించి మమ్మల్ని కాపాడు ! మహిషి సంహారం కోసం అవతరించిన నీవు తిరిగి నీ భక్తులను ఉద్ధరించడానికి తరలిరా తండ్రీ !’’ అంటూ ప్రార్థించాడు !
🌸రాజు ప్రార్థన స్వామిని చేరింది ! అందుకే శాంత గంభీర స్వరంతో పలికాడు ! ‘‘రాజా ! ఉదయనుడి కాలం తీరడానికి మరికొంత వ్యవధి ఉన్నది ! ప్రస్తుతం కలిపురుషుని ప్రభావంతో అతడు కావిస్తున్న దుష్కర్మలు అంతం కావించడానికి త్వరలోనే నేను తిరిగి నీ వంశంలోనే అవతరిస్తాను !
🌿రాజా ! మరికొద్దికాలంలో నీ దగ్గరకు ఒక బ్రాహ్మణ కుమారుడు వస్తాడు ! అతనికి నీ కుమార్తెనిచ్చి వివాహం కావించు !’’ ఆ పలుకులు అమృతపు జల్లులా కురిసాయి రాజు కర్ణపుటాలలో ! ‘‘మీరు చెప్పినట్లే కావిస్తాను ! నా మీద ఎంతటి కరుణ చూపావు తండ్రీ ! నీకు నా కోటి కోటి ప్రణామాలు !’’ అంటూ అంజలి ఘటించాడు రాజు !
🌸‘‘జయవర్థనా ! లే ! వెంటనే బయలుదేరి పంబల రాజ్యానికి వెళ్లు ! అన్న పలుకులు స్పష్టంగా వినపడటంతో చప్పున లేచి కూర్చున్నాడు జయవర్థనుడు !
ఉదయనుడి నుండి తప్పించుకొని పరుగు తీసిన పూజారి కుమారుడు ఎట్లాగో మణికంఠుడు పులిపాలకోసం వచ్చిన అరణ్య ప్రాంతాన్ని చేరుకున్నాడు !
🌿ఆ ప్రాంతమంతటా స్వామి సంచరించినది కావడంతో పవిత్రమైంది ! దేవతల ప్రార్థనతో స్వామి విశ్రాంతి తీసుకున్న ప్రాంతం ‘పొన్నంబలమేడు’ గా పిలువబడుతూ ఆటవికుల నివాస స్థానమై వుంది జయవర్థనుడు అక్కడకు చేరిన సమయంలో ! ఆ పవిత్ర స్థానంవైపు ఉదయనుడు రాలేకపోవడానికి స్వామి మహిమే కారణంగా భావిస్తూ సురక్షితంగా అక్కడివారితో కలిసి కాలం గడుపుతూ వున్నాడు జయవర్థనుడు !
🌸అప్పటికి కొన్ని సంవత్సరాలు గడిచాయి ! తనను ప్రబోధించినదేవరై వుంటారా అనుకుంటూ లేచి ఆశ్రమం బయటకు వచ్చాడు జయవర్థనుడు ! ఇంకా బ్రాహ్మీముహూర్తం కాలేదు ! ‘పంబలరాజ్యానికి వెళ్లమంటున్నదెవరు ? వెళ్లి ఏం చేయాలి ?’ అనుకుంటూ అక్కడే నిలబడ్డాడు ! ఆకాశంలో మెరుపు మెరిసినట్లయింది ! తేజోమండల మధ్యంలో పులిమీద ఆసీనుడై వున్న అయ్యప్పస్వామి దర్శనమిచ్చాడు !
🌿 ‘‘జయవర్థనా ! నీవు పంబల రాజ్యానికి వెళ్లి ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు కుమార్తెను వివాహంచేసుకోవలసి వున్నది ! నీకు నీ తండ్రికి నాపట్లగల నిర్మలమైన భక్తి విశ్వాసాలకు ప్రసన్నుడినైనాను ! అందుకే నీకు పుత్రుడిగా అవతరించాలని సంకల్పించాను. ఇక ఆలస్యం చేయకుండా బయలుదేరు ! అన్న ఆదేశం వినడంతో ఆనందంగా పందల రాజ్యం వైపు సాగిపోయాడు జయవర్థనుడు !
🌸‘‘మహారాజా ! మహారాజా ! ఎవరో యువకుడు వచ్చి తమ దర్శనం కోరుతున్నాడు ! పంపమంటారా ?’’ పరిచారిక తెచ్చిన వార్త భయాందోళనలతో సతమతవౌతున్న రాజులో ఆనందాన్ని నింపింది !
స్వామి చెప్పిన యువకుడి రాకకోసం ఎంతో ఆత్రంతో ఎదురుచూస్తుండగానే కొన్ని సంవత్సరాలు తిరిగిపోయాయి ! ఉదయనుడు ఇతర రాజ్యాలమీదకు దండయాత్రలు సాగిస్తుండటంతో పంబల రాజ్యం వైపు రాకపోవడం కొంతవరకు ఊరట కలిగించినా , ఎప్పుడు వచ్చి విరుచుకుపడతాడోనన్న భయంతోనే కాలం గడుపుతున్నారు రాజు , ప్రజలు !
🌿 వాళ్ళు భయపడుతున్నట్లుగానే స్వయంగా ఉదయనుడే దండెత్తి రాకపోయినా అతని వద్దనుండి వచ్చిన వర్తమానం రాజును సంకటంలో పడేసింది ! ‘‘రాజా ! నీ కుమార్తె అందచందాల గూర్చి ఈమధ్యే విన్నాను ! ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను ! కొద్ది రోజుల్లో వస్తున్నాను ! వివాహానికి ఏర్పాట్లు కావించిసిద్ధంగా ఉండు !’’ ఉదయనుండి వ్రాలు ! అని అతడు వ్రాసి పంపిన సందేశం రాజు కుటుంబంలో కలవరాన్ని రేకెత్తిచింది !
🌸 ‘స్వామీ ! ఏమిటీ విపరీతం ! మీరు సెలవిచ్చిన బ్రాహ్మణ కుమారుడి జాడ లేదు. ఈ దుర్మార్గుడి నుండి ఇటువంటి వార్త వచ్చి పడింది ! నాకేమి చేయాలో తోచడంలేదు ! అయ్యప్పా ! నీదే భారం !’’ అంటూ ఏం చేయాలో తోచని పరిస్థితిలో సతమతవౌతున్న రాజు పరిచారిక తెచ్చిన వార్త విని సంభ్రమాశ్చర్యాలతో లేచి యువకునికి ఎదురువెళ్ళాడు ! సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు జరిపాడు !
🌿 ‘‘కుమారా ! నీ కోసమే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాము ! ఇప్పటికి మా నిరీక్షణ ఫలించింది ! ఇక మాకే చింతా లేదు ! ఆ దుర్మార్గుడు ఉదయనుడి బారి నుండి మమ్మల్ని కాపాడాల్సిన భారం నీదే’’ అన్న రాజు మాటలకు చిన్నగా నవ్వాడు జయవర్థనుడు ! ‘‘అంతా అయ్యప్పస్వామి సంకల్పం ప్రకారమే జరుగుతుంది ! నన్ను మీ కుమార్తెను వివాహం చేసుకోవలసిందిగా ఆదేశించి పంపారు స్వామీ !’’ అన్నాడు.
🌸 ‘‘అవును ! మాకు అటువంటి ఆదేశమే ఇచ్చారు స్వామి ! మీకు మా కుమార్తెను ఇచ్చి వెంటనే వివాహం జరిపిస్తాను ! ఎందుకంటే ఆ ఉదయనుడు ఏ క్షణంలోనైనా ఇక్కడకు రావచ్చును !’’ అంటూ అప్పటికప్పుడు ఏ ఆడంబరాలు లేకుండా అయ్యప్పస్వామి విగ్రహం ముందరే తన కుమార్తె శశికళను జయవర్థనుడికిచ్చి వివాహం జరిపించాడు !
🌿 ‘‘ఇక మేము మా ప్రాంతానికి తిరిగి వెళ్లడానికి అనుమతినివ్వండి మహారాజా ! ఆ ప్రాంతం అయ్యప్పస్వామి తిరుగాడిన పవిత్ర ప్రదేశం కావడంతో అటువైపు ఆ దుర్మార్గుడు రాలేడు !’’ అన్నాడు జయవర్థనుడు భార్యా సమేతంగా వెళ్లడానికి సిద్ధమై ! ‘‘అవును ! త్వరగా మీ ప్రాంతానికి చేరుకోవడమే మంచిది ! వెళ్లిరండి ! స్వామి దయతో సర్వశుభాలతో సంతోషంగా జీవించండి’’ అంటూ ఆశీర్వదించి వాళ్లు వెళ్లిపోయాక దీర్ఘంగా నిట్టూర్చాడు రాజు తేలిక పడిన హృదయంతో.
🌸 ‘‘ఏమిటి? నీ కుమార్తెకు ఎప్పుడో వివాహమైపోయిందా ? ఆమె నీ భవనంలో లేదా ? రాజా ! నీవు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు ! ఆమెనెక్కడో దాచి నా కంటబడకుండా చేసావు గదూ ? నిన్ను తేలిగ్గా వదిలిపెట్టను !’’ కోపంగా రాజును కొరడాలతో కొట్టించి కసి తీరక కారాగారంలో బంధించివేశాడు ఉదయనుడు !
🌿రాజభవనమంతా వెతికించి రాకుమార్తె కనబడకపోడంతో నిరాశ కోపం ఆపుకోలేక అక్కడ అంతా ధ్వంసం చేసి పరివారాన్ని చంపివేసి తన ప్రతినిధులను రాజ్యపాలనకు నియోగించి వెళ్లిపోయాడు ఉదయనుడు !.. సశేషం.. 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞🙏🌹🎻
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸‘‘మహారాజా ! మహారాజా ! ఎవరో యువకుడు వచ్చి తమ దర్శనం కోరుతున్నాడు ! పంపమంటారా ?’’ పరిచారిక తెచ్చిన వార్త భయాందోళనలతో సతమతవౌతున్న రాజులో ఆనందాన్ని నింపింది !
స్వామి చెప్పిన యువకుడి రాకకోసం ఎంతో ఆత్రంతో ఎదురుచూస్తుండగానే కొన్ని సంవత్సరాలు తిరిగిపోయాయి ! ఉదయనుడు ఇతర రాజ్యాలమీదకు దండయాత్రలు సాగిస్తుండటంతో పంబల రాజ్యం వైపు రాకపోవడం కొంతవరకు ఊరట కలిగించినా , ఎప్పుడు వచ్చి విరుచుకుపడతాడోనన్న భయంతోనే కాలం గడుపుతున్నారు రాజు , ప్రజలు !
🌿 వాళ్ళు భయపడుతున్నట్లుగానే స్వయంగా ఉదయనుడే దండెత్తి రాకపోయినా అతని వద్దనుండి వచ్చిన వర్తమానం రాజును సంకటంలో పడేసింది ! ‘‘రాజా ! నీ కుమార్తె అందచందాల గూర్చి ఈమధ్యే విన్నాను ! ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను ! కొద్ది రోజుల్లో వస్తున్నాను ! వివాహానికి ఏర్పాట్లు కావించిసిద్ధంగా ఉండు !’’ ఉదయనుండి వ్రాలు ! అని అతడు వ్రాసి పంపిన సందేశం రాజు కుటుంబంలో కలవరాన్ని రేకెత్తిచింది !
🌸 ‘స్వామీ ! ఏమిటీ విపరీతం ! మీరు సెలవిచ్చిన బ్రాహ్మణ కుమారుడి జాడ లేదు. ఈ దుర్మార్గుడి నుండి ఇటువంటి వార్త వచ్చి పడింది ! నాకేమి చేయాలో తోచడంలేదు ! అయ్యప్పా ! నీదే భారం !’’ అంటూ ఏం చేయాలో తోచని పరిస్థితిలో సతమతవౌతున్న రాజు పరిచారిక తెచ్చిన వార్త విని సంభ్రమాశ్చర్యాలతో లేచి యువకునికి ఎదురువెళ్ళాడు ! సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు జరిపాడు !
🌿 ‘‘కుమారా ! నీ కోసమే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాము ! ఇప్పటికి మా నిరీక్షణ ఫలించింది ! ఇక మాకే చింతా లేదు ! ఆ దుర్మార్గుడు ఉదయనుడి బారి నుండి మమ్మల్ని కాపాడాల్సిన భారం నీదే’’ అన్న రాజు మాటలకు చిన్నగా నవ్వాడు జయవర్థనుడు ! ‘‘అంతా అయ్యప్పస్వామి సంకల్పం ప్రకారమే జరుగుతుంది ! నన్ను మీ కుమార్తెను వివాహం చేసుకోవలసిందిగా ఆదేశించి పంపారు స్వామీ !’’ అన్నాడు.
🌸 ‘‘అవును ! మాకు అటువంటి ఆదేశమే ఇచ్చారు స్వామి ! మీకు మా కుమార్తెను ఇచ్చి వెంటనే వివాహం జరిపిస్తాను ! ఎందుకంటే ఆ ఉదయనుడు ఏ క్షణంలోనైనా ఇక్కడకు రావచ్చును !’’ అంటూ అప్పటికప్పుడు ఏ ఆడంబరాలు లేకుండా అయ్యప్పస్వామి విగ్రహం ముందరే తన కుమార్తె శశికళను జయవర్థనుడికిచ్చి వివాహం జరిపించాడు !
🌿 ‘‘ఇక మేము మా ప్రాంతానికి తిరిగి వెళ్లడానికి అనుమతినివ్వండి మహారాజా ! ఆ ప్రాంతం అయ్యప్పస్వామి తిరుగాడిన పవిత్ర ప్రదేశం కావడంతో అటువైపు ఆ దుర్మార్గుడు రాలేడు !’’ అన్నాడు జయవర్థనుడు భార్యా సమేతంగా వెళ్లడానికి సిద్ధమై ! ‘‘అవును ! త్వరగా మీ ప్రాంతానికి చేరుకోవడమే మంచిది ! వెళ్లిరండి ! స్వామి దయతో సర్వశుభాలతో సంతోషంగా జీవించండి’’ అంటూ ఆశీర్వదించి వాళ్లు వెళ్లిపోయాక దీర్ఘంగా నిట్టూర్చాడు రాజు తేలిక పడిన హృదయంతో.
🌸 ‘‘ఏమిటి? నీ కుమార్తెకు ఎప్పుడో వివాహమైపోయిందా ? ఆమె నీ భవనంలో లేదా ? రాజా ! నీవు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు ! ఆమెనెక్కడో దాచి నా కంటబడకుండా చేసావు గదూ ? నిన్ను తేలిగ్గా వదిలిపెట్టను !’’ కోపంగా రాజును కొరడాలతో కొట్టించి కసి తీరక కారాగారంలో బంధించివేశాడు ఉదయనుడు !
🌿రాజభవనమంతా వెతికించి రాకుమార్తె కనబడకపోడంతో నిరాశ కోపం ఆపుకోలేక అక్కడ అంతా ధ్వంసం చేసి పరివారాన్ని చంపివేసి తన ప్రతినిధులను రాజ్యపాలనకు నియోగించి వెళ్లిపోయాడు ఉదయనుడు !.. సశేషం.. 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞🙏🌹🎻
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 20వ అధ్యాయం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...!!
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 20 ,వ భాగం... ప్రారంభం....!!🌹🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఇరుముడిలో పెట్టే వస్తువులు:🌹
🌸రెండు అరలుగా వున్న ఒక సంచీని తీసుకుని ముందు అరలో స్వామికి సమర్పించవలసిన వస్తువులను , వెనక అరలో ఆహార పదార్థాలను వుంచి తాడుతో మూట కట్టడంతో ఇరుముడి తయారౌతుంది ! ముందు అరలో ఆవు నేతితో నింపిన కురిడీ , విభూది , చందనం , పన్నీరు , ఊదివత్తులు , కర్పూరం ,
🌿అమ్మవారికి సమర్పించడానికి వస్త్రం , పసుపు , కుంకుమలు , మిరియాలు , పటికబెల్లం , బియ్యం , పెసరపప్పు , దక్షిణగా సమర్పించడానికి నాణేలు పెట్టుకోవడానికి కావలసి ఉంటాయి !
వెనక భాగంలో మార్గంలో భుజించడానికి అవసరమైన పండ్లు , అటుకులు , ఇతర తినుబండారాలు పెట్టుకోవచ్చును.
🌹ఇరుముడి కట్టే విధానం:🌹
🌸ఇరుముడి దేవాలయంలోగాని , గురుస్వామి ఇంటిలోగానీ కట్టడం జరుగుతుంది. ముందుగా కొబ్బరి కురిడీ లేక ముద్రను సిద్ధం చేస్తారు !
🌹ముద్రను సిద్ధం చేసే విధానం:🌹
🌿శుభ్రమైన మంచి కొబ్బరికాయకు పీచు తీసి నున్నగా చేసిదాని కన్నులలో ఒక కన్నుకు రంధ్రం చేసి కాయలో వున్న నీటిని తీసివేయాలి ! ఆ కాయను కలశం మీద వుంచి దీక్ష పూర్తిచేసిన స్వామి చేత కొబ్బరికాయను ఆవు నేతితో నింపిస్తారు గురుస్వామి ! ఆ సమయంలో ఇద్దరూ మనస్సులో అయ్యప్పస్వామిని ధ్యానిస్తూ వుండాలి ! నింపిన తర్వాత గురుస్వామి రంధ్రాన్ని మూసివేయడం జరుగుతుంది ! కాబట్టి కొబ్బరికాయలోని నెయ్యి బయటకు రాకుండా జాగ్రత్తతీసుకుంటారు ! ఈ విధంగా నెయ్యితో నింపబడ్డ కొబ్బరికురిడీనే ముద్ర అంటారు !
🌸 ఈ ముద్రను ఒకవస్త్రంలో నాణాలతో కలిపి కట్టి దానిని ఇతర పూజా ద్రవ్యాలతో కలిపి సంచీ ముందుభాగంలో వుంచటం జరుగుతుంది. ఆ భాగాన్ని గట్టిగా కట్టివేసి , వెనక భాగంలో ఆహార పదార్థాలను వుంచి కట్టిన తర్వాత రెంటినీ కలిపి ఒకటిగా ముడివేస్తారు ! దీక్షాధారులు ఇరుముడిని తలమీద పెట్టుకుని ప్రయాణం చేయవలసి వుంటుంది !
🌿కొబ్బరి కురిడీ ముద్ర అంతరార్థం
కొబ్బరికాయలకు మూడు కళ్లువుంటాయి ! వాటిలో రెండు కళ్లు గట్టిగా వుండి ఒకటి మెత్తగా వుంటుంది ! గట్టిగా వుండే రెండు కళ్ళు మనిషిలో పైకి కనిపించే రెండు కళ్లకు సంకేతాలు ! మెత్తని కన్ను మనిషి లోపలి జ్ఞాన నేత్రానికి సంకేతం ! జ్ఞాన నేత్రం మాత్రమే సాధనవల్ల భగవంతుని తనలోనే దర్శించగల సమర్థత కలిగివుంటుంది !
🌸మెత్తని కన్నును తెరిచి నీరు తీసివేసి స్వచ్ఛమైన నేతితో నింపినట్లు జ్ఞాన నేత్రం అహంకారాన్ని వదిలి భక్తి భావంతో భగవంతుని దర్శించాలన్న సందేశం దాగి వుంది ముద్రను సిద్ధం చేయటంలో !
🌹ఇరుముడికి పూజ:🌹
🌿కట్టడం పూర్తిచేసిన ఇరుముడిని భక్తితో పూజిస్తారు దీక్షాధారులు ! ఇరుముడి వల్ల కలిగే శక్తి యాత్రను సజావుగా శుభప్రదంగా సంపన్నం అయ్యేలాచేస్తుంది ! పూజ పూర్తయినాక ఇరుముడి కట్టించిన గురుస్వామికి నమస్కరించి , దక్షిణ సమర్పించి గురుస్వామి చేత మూటను పెట్టించుకుని అయ్యప్పస్వామి దేవాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని యాత్రసఫలం కావించమని ప్రార్థించాలి !
🌸ఇరుముడిని స్వామి ప్రక్కన వుంచి పూలమాల వేసి నమస్కరించాలి ! ఈ విధంగా పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఇరుముడులకు హారతి చూపి , శరణుఘోష చేస్తూ దీక్షాధారలందరూ ప్రయాణం ప్రారంభించి శబరిగిరి వైపు సాగిపోతారు ! ఇతరులు మేళతాళాలతో ఊరి పొలిమేరల వరకు వారి వెంట వెళ్లి వీడ్కోలు చెప్పి జయప్రదంగా యాత్ర ముగించుకు రావాలని శుభకాంక్షలు తెలిపి వెనుదిరుగుతారు !
🌿ఇరుముడికి - జాగ్రత్తలు
ఇరుముడి కట్టే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇతరుల ఇండ్లకు వెళ్లగూడదు !
దేవాలయాలు , సత్రాలలో తప్ప ఇతరుల గృహాలలో బస చేయకూడదు !
స్వామివారికి అర్పించే పూజాద్రవ్యాలు , ముద్ర వున్న భాగం శిరస్సు ముందుభాగంలో వుండేలాగా , జారిపోకుండా జాగ్రత్త వహించాలి !
🌸యాత్రాకాలంలో కూడా రోజూ ఉదయం , సాయంత్రం ఇరుముడికి హారతి ఇచ్చి భజనలు చేయాలి !
పద్దెనిమిది మెట్లు ఎక్కి వెళ్లి స్వామి సన్నిధానాన్ని చేరేవరకు ఇరుముడిని పవిత్రంగా చూసుకోవాలి !
మొదటిసారి వెళుతున్న దీక్షాధారులు (కన్నిస్వాములు) తాము స్వయంగా ఇరుముడిని తలపై నుండి దింపటం తిరిగి ఎత్తుకోవడం చేయకూడదు ! ఆరు సార్లు వెళ్లి వచ్చినవాళ్ల సహాయంతో ఆ పని చేయాలి ! ఇరుముడిని అయ్యప్ప స్వామిగా భావిస్తూ పూజిస్తూ శబరిగిరి చేరుకోవాలి.
🌿శబరిగిరి యాత్రకు
తీసుకువెళ్లవలసిన ఆయుధాలు
మొదటి సంవత్సరం యాత్రకు వెళ్ళేవారు తమ వెంట ఒక బాణాన్ని తీసుకువెళ్లి శరణుగుచ్చిలో అర్పించాలి ! మొదటిసారిగా దీక్ష స్వీకరించే ఈ స్వాములను కన్నిస్వాములంటారు !
రెండవ సంవత్సరం వెళుతున్న దీక్షధారులు కత్తిని సమర్పించాలి !
మూడవ సంవత్సరం గంటను తీసుకువెళ్లి అర్పించాలి.
🌸నాలుగవ సంవత్సరం గదను
ఐదవ సంవత్సరం విల్లును
ఆరవ సంవత్సరం దీపాన్ని వెలిగించి అర్పించాలి!
ఏడవ సంవత్సరం సూర్యప్రతిమను (సూర్యుని రాగి రేకు)
ఎనిమిదవ సంవత్సరం చంద్రప్రతిమను (చంద్రుని రాగిరేకు)🌿తొమ్మిదవ సంవత్సరం త్రిశూలాన్ని
పదవ
సంవత్సరం విష్ణుచక్రాన్ని
పదకొండవ సంవత్సరం
శంఖాన్ని
పన్నెండవ సంవత్సరం నాగాభరణాన్ని
పదమూడవ సంవత్సరం వేణువును
పధ్నాల్గవ సంవత్సరం తామర పువ్వును
పదిహేనవ సంవత్సరం శూలంని (కుమారస్వామి ఆయుధం)
పదహారవ సంవత్సరం రాయిని
పదిహేడవ సంవత్సరం ఓంకారంగల రాగిరేకును
పద్ధెనిమిదవ సంవత్సరం కొబ్బరిమొక్కను తీసుకువెళ్లి సమర్పించాలి !
🌸ఈ విధంగా పద్ధెనిమిది సంవత్సరాలు మండల దీక్షను స్వీకరించి పద్ధెనిమిదిమెట్లు ఎక్కివెళ్లి ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆయుధాన్ని స్వామికి సమర్పించేవారికి అయ్యప్పస్వామి సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది ! వారి జన్మ ధన్యమై ఇహంలో సర్వాభీష్టాలు నెరవేరి చివరకు ముక్తిని పొందుతాడు ! ఏదీ, అందరూ ఒక్కసారి ముక్తకంఠాలతో ఆ స్వామిని మనోనేత్రాలతో దర్శించి నమస్కరించండి.
‘🌹‘హరివరాసనం విశ్వమోహనం హరితదీశ్వరం ఆరాధ్యపాదుకం
హరి విమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయ్ ! 🌹
🌿ఓం స్వామియే శరణం అయ్యప్ప’’
అంటూ స్తుతించారు సూత మహర్షి కన్నులరమోడ్చి , అంజలి ఘటిస్తూ ! ‘‘ఓం స్వామియే శరణం ! శరణం అయ్యప్ప !’’ అంటూ ముక్తకంఠాలతో మనులందరూ శరణుఘోష భజన చేస్తుంటే నైమిశారణ్య ప్రాంతమంతా భక్తిపూరిత వాతావరణం నెలకొన్నది !
🌸శబరిమల మీద విగ్రహ రూపంలో వెలసిన అయ్యప్పస్వామి తర్వాత ఏం చేశారు ? ఎవరికైనా కనిపించారా ?
‘‘అయ్యప్పస్వామి జ్యోతిగా మారాక జరిగిన విషయాలు పురాణాలలో చెప్పబడలేదు ! భక్తులందరూ కాలినడకన అరణ్యప్రాంతంలో కష్టపడి ప్రయాణించి శబరిమలకు చేరుకుని స్వామి దర్శనం చేశాడు గదా ! క్రమంగా యాత్ర చేసే భక్తుల సంఖ్య పెరిగి పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది శబరిమల ప్రాంతం ! అంతవరకే పౌరాణిక గాథ !
🌿 అయితే ఆ ప్రాంతంలో వుండే ప్రజలలో ఒక జానపద గాథ చాలా ప్రచారంలో వుండేది ! అది అయ్యప్పస్వామికి సంబంధించి వుండటంతో దాన్ని కూడా అయ్యప్ప చరితంలో భాగంగానే భావిస్తారు ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు ! చాలా ఆసక్తికరంగా వుంటుంది.
🌹అయ్యప్పస్వామి జానపద చరితం - స్వామి మహిమ
ధర్మశాస్తా పంచరత్నం🌹
🌸‘‘లోక వీర్యం మహాపూజ్యం
సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం
శాస్తారం ప్రణమామ్యహం
విప్ర పూజ్యం విశ్వవంద్యం
విష్ణుం శంభుప్రియసుతం
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం
ప్రణమామ్యహం!
మత్తమాతంగ గమనం
కారుణ్యామృత పూజితం
సర్వవిఘ్నహరం దేవం
శాస్తారం ప్రణమామ్యహం
అస్మత్ కులేశ్వరం దేవం
అస్మద్ శతృ వినాశనం
అస్మదిష్ట ప్రదాతారాం
శాస్తారం ప్రణమామ్యహం
పాండ్యేశ వంగ తిలకం
కేరళే కేళి విగ్రహం
ఆర్తత్రాణ పరందేవం
శాస్తారం ప్రణమామ్యహం!
పంచ రత్నాఖ్యమే తద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే !
🌿‘‘అయ్యప్పస్వామి ! నీవు శబరిమల మీద వెలసి మమ్మల్నందరిని కాపాడుతూ వుంటానని మాట ఇచ్చావు గదా ! మరి ఈ కష్టాలు మాకెందుకు కలుగుతున్నాయి స్వామీ ! పాండ్య వంశస్థుడైన రాజశేఖరునికి పుత్రుడివై పందల రాజకుమారుడిగా నీవు పాలించిన పందల రాజ్యం ఈనాడు ఉదయనుడే గజదొంగ దాడులతో ఛిన్నాభిన్నమైపోయింది !
🌸ఆ వంశపు వాళ్లు ఇక్కడ కట్టించిన మీ దేవాలయంలో మీ పూజార్చనలు ఎంతో కష్టంమీద జరుపుతూ అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం నేనూ , నా కుమారుడు !ధర్మదేవతను శాసించే హే ! ధర్మశాస్తా ! అయ్యప్పా ! ఇప్పుడు నామమాత్రంగా మిగిలిన ఈ చిన్న పందల రాజ ప్రభువు రాజశేఖరుడు కూడా మీ దయాదృష్టికోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాడు ! మా అందరి కష్టాలు తీర్చి మమ్మల్ని కాపాడుస్వామి !
🌿’’పందల రాజ్యంలోని ధర్మశాస్తా మందిరం పూజారి స్వామి విగ్రహం ముందు నిలుచుని దీనంగా మొరపెట్టుకున్నాడు !
ఆ సమయంలో కలి పురుషుని ప్రభావానికి లోనైన ఉదయనుడనే గజదొంగ కారణంగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిన పందల రాజ్యంలో కొంత కాలంగా అరాచకత్వం , బీభత్సం తాండవిస్తున్నాయి. !
🌸ఉదయనుడు తనను ఎదిరించేవారు లేకపోవడంతో ఆ ప్రాంతమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించిన వారిని దారుణంగా చంపివేస్తూ ప్రజల ఆస్తులను దోచుకుని వీరవిహారం సాగిస్తున్నాడు ! రాజైన రాజశేఖరుడికి అతడిని ఎదిరించే బలం లేకపోవడంతో భగవంతునిమీద భారం వేసి రోజులు భారంగా గడుపుతున్నాడు !
🌿ఆ రోజు ధర్మశాస్తా మందిరంలో స్వామిని ప్రార్థిస్తున్న పూజారి వులిక్కిపడి లేచాడు గుర్రం డెక్కల చప్పుడు విని ! అతని గుండెలు దడదడమన్నాయి ! ‘ఉదయనుడే ఇట్లు వస్తున్నట్లున్నాడు’! ఈ ఆలయంమీద ఆ దుష్టుడి చూపు పడి లోపలకు రాడు గదా ! అనే ఆలోచన వచ్చేసరికి భయంతో గజగజలాడుతున్న పూజారి ప్రక్కగా దేవుడి పళ్లాల సవరిస్తున్న కొడుకు వైపు ఆందోళనగా చూస్తూ ‘‘జయవర్థనా ! నాయనా ! పరుగెత్తి వెళ్లి ఎక్కడైనా దాక్కో ! ఆ దుర్మార్గుడు గుడిలోపలకు వస్తాడేమో ! పారిపో , వాడి కంటబడకుండా !’’ అంటూ తొందరపెట్టాడు !
🌸 ‘‘మరి మీరో ?’’ తండ్రివైపు చూస్తూ అడిగాడు పన్నెండేళ్ల జయవర్థనుడు ! ‘‘నీవు ప్రాణాలు దక్కించుకో నాయనా , నా మాట విను ! నేను పరుగెత్తలేను ! ఇక్కడే మనం నమ్మిన స్వామి దగ్గరే వుంటాను ! ఏమైతే అది అవుతుంది ! వెళ్లు , ఆలస్యం చేయకు !’’ అన్నాడు పూజారి విష్ణుదత్తుడు !....సశేషం..🙏
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 20 ,వ భాగం... ప్రారంభం....!!🌹🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఇరుముడిలో పెట్టే వస్తువులు:🌹
🌸రెండు అరలుగా వున్న ఒక సంచీని తీసుకుని ముందు అరలో స్వామికి సమర్పించవలసిన వస్తువులను , వెనక అరలో ఆహార పదార్థాలను వుంచి తాడుతో మూట కట్టడంతో ఇరుముడి తయారౌతుంది ! ముందు అరలో ఆవు నేతితో నింపిన కురిడీ , విభూది , చందనం , పన్నీరు , ఊదివత్తులు , కర్పూరం ,
🌿అమ్మవారికి సమర్పించడానికి వస్త్రం , పసుపు , కుంకుమలు , మిరియాలు , పటికబెల్లం , బియ్యం , పెసరపప్పు , దక్షిణగా సమర్పించడానికి నాణేలు పెట్టుకోవడానికి కావలసి ఉంటాయి !
వెనక భాగంలో మార్గంలో భుజించడానికి అవసరమైన పండ్లు , అటుకులు , ఇతర తినుబండారాలు పెట్టుకోవచ్చును.
🌹ఇరుముడి కట్టే విధానం:🌹
🌸ఇరుముడి దేవాలయంలోగాని , గురుస్వామి ఇంటిలోగానీ కట్టడం జరుగుతుంది. ముందుగా కొబ్బరి కురిడీ లేక ముద్రను సిద్ధం చేస్తారు !
🌹ముద్రను సిద్ధం చేసే విధానం:🌹
🌿శుభ్రమైన మంచి కొబ్బరికాయకు పీచు తీసి నున్నగా చేసిదాని కన్నులలో ఒక కన్నుకు రంధ్రం చేసి కాయలో వున్న నీటిని తీసివేయాలి ! ఆ కాయను కలశం మీద వుంచి దీక్ష పూర్తిచేసిన స్వామి చేత కొబ్బరికాయను ఆవు నేతితో నింపిస్తారు గురుస్వామి ! ఆ సమయంలో ఇద్దరూ మనస్సులో అయ్యప్పస్వామిని ధ్యానిస్తూ వుండాలి ! నింపిన తర్వాత గురుస్వామి రంధ్రాన్ని మూసివేయడం జరుగుతుంది ! కాబట్టి కొబ్బరికాయలోని నెయ్యి బయటకు రాకుండా జాగ్రత్తతీసుకుంటారు ! ఈ విధంగా నెయ్యితో నింపబడ్డ కొబ్బరికురిడీనే ముద్ర అంటారు !
🌸 ఈ ముద్రను ఒకవస్త్రంలో నాణాలతో కలిపి కట్టి దానిని ఇతర పూజా ద్రవ్యాలతో కలిపి సంచీ ముందుభాగంలో వుంచటం జరుగుతుంది. ఆ భాగాన్ని గట్టిగా కట్టివేసి , వెనక భాగంలో ఆహార పదార్థాలను వుంచి కట్టిన తర్వాత రెంటినీ కలిపి ఒకటిగా ముడివేస్తారు ! దీక్షాధారులు ఇరుముడిని తలమీద పెట్టుకుని ప్రయాణం చేయవలసి వుంటుంది !
🌿కొబ్బరి కురిడీ ముద్ర అంతరార్థం
కొబ్బరికాయలకు మూడు కళ్లువుంటాయి ! వాటిలో రెండు కళ్లు గట్టిగా వుండి ఒకటి మెత్తగా వుంటుంది ! గట్టిగా వుండే రెండు కళ్ళు మనిషిలో పైకి కనిపించే రెండు కళ్లకు సంకేతాలు ! మెత్తని కన్ను మనిషి లోపలి జ్ఞాన నేత్రానికి సంకేతం ! జ్ఞాన నేత్రం మాత్రమే సాధనవల్ల భగవంతుని తనలోనే దర్శించగల సమర్థత కలిగివుంటుంది !
🌸మెత్తని కన్నును తెరిచి నీరు తీసివేసి స్వచ్ఛమైన నేతితో నింపినట్లు జ్ఞాన నేత్రం అహంకారాన్ని వదిలి భక్తి భావంతో భగవంతుని దర్శించాలన్న సందేశం దాగి వుంది ముద్రను సిద్ధం చేయటంలో !
🌹ఇరుముడికి పూజ:🌹
🌿కట్టడం పూర్తిచేసిన ఇరుముడిని భక్తితో పూజిస్తారు దీక్షాధారులు ! ఇరుముడి వల్ల కలిగే శక్తి యాత్రను సజావుగా శుభప్రదంగా సంపన్నం అయ్యేలాచేస్తుంది ! పూజ పూర్తయినాక ఇరుముడి కట్టించిన గురుస్వామికి నమస్కరించి , దక్షిణ సమర్పించి గురుస్వామి చేత మూటను పెట్టించుకుని అయ్యప్పస్వామి దేవాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని యాత్రసఫలం కావించమని ప్రార్థించాలి !
🌸ఇరుముడిని స్వామి ప్రక్కన వుంచి పూలమాల వేసి నమస్కరించాలి ! ఈ విధంగా పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత ఇరుముడులకు హారతి చూపి , శరణుఘోష చేస్తూ దీక్షాధారలందరూ ప్రయాణం ప్రారంభించి శబరిగిరి వైపు సాగిపోతారు ! ఇతరులు మేళతాళాలతో ఊరి పొలిమేరల వరకు వారి వెంట వెళ్లి వీడ్కోలు చెప్పి జయప్రదంగా యాత్ర ముగించుకు రావాలని శుభకాంక్షలు తెలిపి వెనుదిరుగుతారు !
🌿ఇరుముడికి - జాగ్రత్తలు
ఇరుముడి కట్టే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇతరుల ఇండ్లకు వెళ్లగూడదు !
దేవాలయాలు , సత్రాలలో తప్ప ఇతరుల గృహాలలో బస చేయకూడదు !
స్వామివారికి అర్పించే పూజాద్రవ్యాలు , ముద్ర వున్న భాగం శిరస్సు ముందుభాగంలో వుండేలాగా , జారిపోకుండా జాగ్రత్త వహించాలి !
🌸యాత్రాకాలంలో కూడా రోజూ ఉదయం , సాయంత్రం ఇరుముడికి హారతి ఇచ్చి భజనలు చేయాలి !
పద్దెనిమిది మెట్లు ఎక్కి వెళ్లి స్వామి సన్నిధానాన్ని చేరేవరకు ఇరుముడిని పవిత్రంగా చూసుకోవాలి !
మొదటిసారి వెళుతున్న దీక్షాధారులు (కన్నిస్వాములు) తాము స్వయంగా ఇరుముడిని తలపై నుండి దింపటం తిరిగి ఎత్తుకోవడం చేయకూడదు ! ఆరు సార్లు వెళ్లి వచ్చినవాళ్ల సహాయంతో ఆ పని చేయాలి ! ఇరుముడిని అయ్యప్ప స్వామిగా భావిస్తూ పూజిస్తూ శబరిగిరి చేరుకోవాలి.
🌿శబరిగిరి యాత్రకు
తీసుకువెళ్లవలసిన ఆయుధాలు
మొదటి సంవత్సరం యాత్రకు వెళ్ళేవారు తమ వెంట ఒక బాణాన్ని తీసుకువెళ్లి శరణుగుచ్చిలో అర్పించాలి ! మొదటిసారిగా దీక్ష స్వీకరించే ఈ స్వాములను కన్నిస్వాములంటారు !
రెండవ సంవత్సరం వెళుతున్న దీక్షధారులు కత్తిని సమర్పించాలి !
మూడవ సంవత్సరం గంటను తీసుకువెళ్లి అర్పించాలి.
🌸నాలుగవ సంవత్సరం గదను
ఐదవ సంవత్సరం విల్లును
ఆరవ సంవత్సరం దీపాన్ని వెలిగించి అర్పించాలి!
ఏడవ సంవత్సరం సూర్యప్రతిమను (సూర్యుని రాగి రేకు)
ఎనిమిదవ సంవత్సరం చంద్రప్రతిమను (చంద్రుని రాగిరేకు)🌿తొమ్మిదవ సంవత్సరం త్రిశూలాన్ని
పదవ
సంవత్సరం విష్ణుచక్రాన్ని
పదకొండవ సంవత్సరం
శంఖాన్ని
పన్నెండవ సంవత్సరం నాగాభరణాన్ని
పదమూడవ సంవత్సరం వేణువును
పధ్నాల్గవ సంవత్సరం తామర పువ్వును
పదిహేనవ సంవత్సరం శూలంని (కుమారస్వామి ఆయుధం)
పదహారవ సంవత్సరం రాయిని
పదిహేడవ సంవత్సరం ఓంకారంగల రాగిరేకును
పద్ధెనిమిదవ సంవత్సరం కొబ్బరిమొక్కను తీసుకువెళ్లి సమర్పించాలి !
🌸ఈ విధంగా పద్ధెనిమిది సంవత్సరాలు మండల దీక్షను స్వీకరించి పద్ధెనిమిదిమెట్లు ఎక్కివెళ్లి ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆయుధాన్ని స్వామికి సమర్పించేవారికి అయ్యప్పస్వామి సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది ! వారి జన్మ ధన్యమై ఇహంలో సర్వాభీష్టాలు నెరవేరి చివరకు ముక్తిని పొందుతాడు ! ఏదీ, అందరూ ఒక్కసారి ముక్తకంఠాలతో ఆ స్వామిని మనోనేత్రాలతో దర్శించి నమస్కరించండి.
‘🌹‘హరివరాసనం విశ్వమోహనం హరితదీశ్వరం ఆరాధ్యపాదుకం
హరి విమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయ్ ! 🌹
🌿ఓం స్వామియే శరణం అయ్యప్ప’’
అంటూ స్తుతించారు సూత మహర్షి కన్నులరమోడ్చి , అంజలి ఘటిస్తూ ! ‘‘ఓం స్వామియే శరణం ! శరణం అయ్యప్ప !’’ అంటూ ముక్తకంఠాలతో మనులందరూ శరణుఘోష భజన చేస్తుంటే నైమిశారణ్య ప్రాంతమంతా భక్తిపూరిత వాతావరణం నెలకొన్నది !
🌸శబరిమల మీద విగ్రహ రూపంలో వెలసిన అయ్యప్పస్వామి తర్వాత ఏం చేశారు ? ఎవరికైనా కనిపించారా ?
‘‘అయ్యప్పస్వామి జ్యోతిగా మారాక జరిగిన విషయాలు పురాణాలలో చెప్పబడలేదు ! భక్తులందరూ కాలినడకన అరణ్యప్రాంతంలో కష్టపడి ప్రయాణించి శబరిమలకు చేరుకుని స్వామి దర్శనం చేశాడు గదా ! క్రమంగా యాత్ర చేసే భక్తుల సంఖ్య పెరిగి పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది శబరిమల ప్రాంతం ! అంతవరకే పౌరాణిక గాథ !
🌿 అయితే ఆ ప్రాంతంలో వుండే ప్రజలలో ఒక జానపద గాథ చాలా ప్రచారంలో వుండేది ! అది అయ్యప్పస్వామికి సంబంధించి వుండటంతో దాన్ని కూడా అయ్యప్ప చరితంలో భాగంగానే భావిస్తారు ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు ! చాలా ఆసక్తికరంగా వుంటుంది.
🌹అయ్యప్పస్వామి జానపద చరితం - స్వామి మహిమ
ధర్మశాస్తా పంచరత్నం🌹
🌸‘‘లోక వీర్యం మహాపూజ్యం
సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం
శాస్తారం ప్రణమామ్యహం
విప్ర పూజ్యం విశ్వవంద్యం
విష్ణుం శంభుప్రియసుతం
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం
ప్రణమామ్యహం!
మత్తమాతంగ గమనం
కారుణ్యామృత పూజితం
సర్వవిఘ్నహరం దేవం
శాస్తారం ప్రణమామ్యహం
అస్మత్ కులేశ్వరం దేవం
అస్మద్ శతృ వినాశనం
అస్మదిష్ట ప్రదాతారాం
శాస్తారం ప్రణమామ్యహం
పాండ్యేశ వంగ తిలకం
కేరళే కేళి విగ్రహం
ఆర్తత్రాణ పరందేవం
శాస్తారం ప్రణమామ్యహం!
పంచ రత్నాఖ్యమే తద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే !
🌿‘‘అయ్యప్పస్వామి ! నీవు శబరిమల మీద వెలసి మమ్మల్నందరిని కాపాడుతూ వుంటానని మాట ఇచ్చావు గదా ! మరి ఈ కష్టాలు మాకెందుకు కలుగుతున్నాయి స్వామీ ! పాండ్య వంశస్థుడైన రాజశేఖరునికి పుత్రుడివై పందల రాజకుమారుడిగా నీవు పాలించిన పందల రాజ్యం ఈనాడు ఉదయనుడే గజదొంగ దాడులతో ఛిన్నాభిన్నమైపోయింది !
🌸ఆ వంశపు వాళ్లు ఇక్కడ కట్టించిన మీ దేవాలయంలో మీ పూజార్చనలు ఎంతో కష్టంమీద జరుపుతూ అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం నేనూ , నా కుమారుడు !ధర్మదేవతను శాసించే హే ! ధర్మశాస్తా ! అయ్యప్పా ! ఇప్పుడు నామమాత్రంగా మిగిలిన ఈ చిన్న పందల రాజ ప్రభువు రాజశేఖరుడు కూడా మీ దయాదృష్టికోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాడు ! మా అందరి కష్టాలు తీర్చి మమ్మల్ని కాపాడుస్వామి !
🌿’’పందల రాజ్యంలోని ధర్మశాస్తా మందిరం పూజారి స్వామి విగ్రహం ముందు నిలుచుని దీనంగా మొరపెట్టుకున్నాడు !
ఆ సమయంలో కలి పురుషుని ప్రభావానికి లోనైన ఉదయనుడనే గజదొంగ కారణంగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిన పందల రాజ్యంలో కొంత కాలంగా అరాచకత్వం , బీభత్సం తాండవిస్తున్నాయి. !
🌸ఉదయనుడు తనను ఎదిరించేవారు లేకపోవడంతో ఆ ప్రాంతమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించిన వారిని దారుణంగా చంపివేస్తూ ప్రజల ఆస్తులను దోచుకుని వీరవిహారం సాగిస్తున్నాడు ! రాజైన రాజశేఖరుడికి అతడిని ఎదిరించే బలం లేకపోవడంతో భగవంతునిమీద భారం వేసి రోజులు భారంగా గడుపుతున్నాడు !
🌿ఆ రోజు ధర్మశాస్తా మందిరంలో స్వామిని ప్రార్థిస్తున్న పూజారి వులిక్కిపడి లేచాడు గుర్రం డెక్కల చప్పుడు విని ! అతని గుండెలు దడదడమన్నాయి ! ‘ఉదయనుడే ఇట్లు వస్తున్నట్లున్నాడు’! ఈ ఆలయంమీద ఆ దుష్టుడి చూపు పడి లోపలకు రాడు గదా ! అనే ఆలోచన వచ్చేసరికి భయంతో గజగజలాడుతున్న పూజారి ప్రక్కగా దేవుడి పళ్లాల సవరిస్తున్న కొడుకు వైపు ఆందోళనగా చూస్తూ ‘‘జయవర్థనా ! నాయనా ! పరుగెత్తి వెళ్లి ఎక్కడైనా దాక్కో ! ఆ దుర్మార్గుడు గుడిలోపలకు వస్తాడేమో ! పారిపో , వాడి కంటబడకుండా !’’ అంటూ తొందరపెట్టాడు !
🌸 ‘‘మరి మీరో ?’’ తండ్రివైపు చూస్తూ అడిగాడు పన్నెండేళ్ల జయవర్థనుడు ! ‘‘నీవు ప్రాణాలు దక్కించుకో నాయనా , నా మాట విను ! నేను పరుగెత్తలేను ! ఇక్కడే మనం నమ్మిన స్వామి దగ్గరే వుంటాను ! ఏమైతే అది అవుతుంది ! వెళ్లు , ఆలస్యం చేయకు !’’ అన్నాడు పూజారి విష్ణుదత్తుడు !....సశేషం..🙏
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 19 అధ్యాయం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 19 ,వ భాగం... ప్రారంభం....!!🌹🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹 పానీయాలు: 🌹
🌸ఆహార పానీయాల విషయంలో శ్రద్ధ తీసుకుని , నిషిద్ధమైనవి స్వీకరించకుండా వుండటంవల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ! అప్పుడే మనస్సు ఆరోగ్యంగా ఉండి మండల దీక్ష పూర్తిచేయడానికి వీలు కలుగుతుంది !
అనారోగ్యకారణమైన మత్తు పదార్థాలతో కూడిన పానీయాలు త్రాగకూడదు ! సురాపానం చేయరాదు!
🌿ఆరోగ్యాన్ని కలిగించే పాలు , మజ్జిగ తేట , పండ్ల రసాలు త్రాగవచ్చును ! సరైన ఆహారంవలన దేహానికి శక్తి లభిస్తుంది ! మనస్సు ప్రశాంతంగా వుంటుంది ! నిద్ర సరిగా పడుతుంది ! దీక్షాకాలంలో సాత్వికాహారం స్వీకరించాలి !
🌸అటుకులు , కాయగూరలు , అన్నం మధ్యాహ్నం వేళ స్వీకరించి , ఉదయం , రాత్రి కాలంలో పాలు , పండ్లు స్వీకరించాలి !
🌹ఇతర దీక్షా నియమాలు :🌹
🌿దీక్ష స్వీకరించిన మొదట రోజూ మూడుసార్లు చన్నీటితో తలస్నానం ఆచరించాలి ! నుదుట విభూది , చందనం , కుంకుమధారణచేసి నల్లని వస్త్రాలు ధరించాలి !
ఉదయ , సాయంకాల సమయాలలో దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం , గురుస్వామి దర్శనం చేయాలి !
🌹కర్మేంద్రియాలు: 🌹
🌸మాట్లాడే నాలుక, పనులు చేసే చేతులు, నడిపించే కాళ్లు, మూత్ర విసర్జన మరియు మలమూత్రలు అనబడే ఐదు కర్మేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని వాటి చేత మంచి పనులు చేయించడం దీక్షా నియమాల ముఖ్యోద్దేశం !
నాలుక మాట్లాడటానికి సహకరించే కర్మేంద్రియం ! అట్లాగే రుచిని తెలిపే జ్ఞానేంద్రియం కూడా !
దీక్షాకాలంలో నాలుకను అదుపులో పెట్టుకోవటం చాలా ముఖ్యం!
🌿 అందువల్ల మాటల చేత , తినడం చేత జరిగే తప్పులను , పొరబాట్లను అరికట్టడం జరుగుతుంది !
కోపాన్ని విడిచి , శాంతంగా వుండాలి !
వాక్కుకు సంబంధించి దీక్షాకాలంలో మితంగా \, మృదువుగా మాట్లాడటం అలవర్చుకోవాలి ! సత్యం మాట్లాడాలి ! సౌమ్యంగా , ఇతరులను సంతోషపెట్టేలా మాట్లాడాలి !
🌸అనవసరపు మాటలు , అబద్ధాలు చెప్పడం , ఇతరులను నొప్పించేలా మాట్లాడటం , వివాదాలు , తగవులుపడటం , ఇతరులను దూషించడం దీక్షాకాలంలో చేయకూడదు !
🌿భగవద్భక్తిని కలిగించే పుస్తకాలు , నీతి బోధకాలైన పుస్తకాలు చదవాలి !
చేతులు మంచి కార్యాలు - దానధర్మాలు చేయడానికి , స్వామి పూజకు ఉపయోగపడాలి ! జీవహింస, దొంగతనాలు , ఇతరులను కొట్టడం వంటి పనులు దీక్షాకాలంలో చేయరాదు !
🌸పాదములు - దేవాలయాలను , పుణ్యక్షేత్రాలను దర్శించడానికి కాలినడకన (శక్తినిబట్టి) వెళ్లడం మంచిది !
జూదగృహాలు , వేశ్యాగృహాలకు వెళ్లకూడదు !
దీక్షాకాలంలో బ్రహ్మచర్యాన్ని విధిగా పాటించాలి !
🌿వేశ్యలతో సంపర్కం , బలాత్కరించడం మొదలైన విషయాల గూర్చి ఆలోచించకూడదు ! కోరికలను అదుపులో ఉంచుకుని ఆస్ఖలిత బ్రహ్మచర్యాన్ని ( స్త్రీ సంబంధిత ఆలోచనలతో వీర్యస్ఞలనమవడం) పాటించడానికి ప్రయత్నిచాలి !
మనస్సు విషయవాంఛలవైపు పరిగెత్తకుండా ఉండటానికోసమే సాత్వికాహారం తీసుకోవాలన్న నియమం ఏర్పడింది !
🌹దమము: 🌹
🌸ఆహార నియమాలు సక్రమంగా పాటించడంవల్ల విరేచనాలు మలబద్ధకం వంటిరోగాలకు గురికాకుండా శరీరారోగ్యాన్ని కాపాడుకోవచ్చును !
కర్మేంద్రియాలను నిగ్రహించడాన్ని దమము అంటారు.
🌿జ్ఞానేంద్రియాలైన ముక్కు , చెవులు , కళ్లు , నాలుక , చర్మము వీటిని నియత్రించడాన్ని ‘శమము’ అంటారు .
జ్ఞానేంద్రియాల విషయంగా దీక్షాకాలంలో పాటించవలసిన నియమాలు.
🌹చెవులు: 🌹
🌸శబ్దాన్ని గ్రహించే జ్ఞానేంద్రియాలు చెవులు ! దీక్షాకాలంలో చెవులను బ్రద్దలు చేసే పెద్ద పెద్ద శబ్దాలను , ఇంద్రియాలను ఉద్రేకపరిచే సంభాషణలను వినగూడదు ! మనస్సుకు శాంతిని ప్రసాదించే దైవ సంబంధిత పాటలను , పురాణాలను వినాలి ! శాస్ర్తీయ సంగీతాన్ని వినడంవల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది ;
🌹కళ్లు: 🌹
🌿ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ పరిశీలనాగుణాన్ని అలవరచుకోవాలి ! విషాదకరమైన , భయానకమైన , శృంగారపరమైన దృశ్యాలనుర చూడకూడదు ! ఎటుచూసినా కళ్లకు స్వామి అయ్యప్ప గోచరించే స్థితికి మనస్సు , కళ్లు చేరుకోవడానికి దీక్షాకాలంలో సాధన చేయాలి !
🌹నాలుక: 🌹
🌸రుచిని తెలియజేసే జ్ఞానేంద్రియం నాలుక ! దీక్షాకాలంలో అన్ని రకాల రుచులు కోరుకునే నాలుకను నియంత్రించి సాత్వికాహారాన్ని మాత్రమే భుజించాలి ! తీపి , ఉప్పు , పులుపు , కారం , మసాలా దినుసులు లేని ఆహారం తినాలి ! అటుకులు , పాలు , పండ్లు స్వీకరించాలి !
🌹ముక్కు: 🌹
🌿వాసనను గ్రహించే జ్ఞానేంద్రియం ముక్కు ! దుర్వాసనలు వచ్చే అశున్ర వాతావరణంలో వుండకూడదు మనస్సుకు హాయిని , శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పూలతోటలలో తిరగడం , పూజకు పూలు సేకరించడం చేయాలి !
🌹చర్మము: 🌹
🌸శరీరం అంతర్భాగాలను కప్పివుంచి , స్పర్శజ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానేంద్రియ చర్మం ! సౌందర్యం చర్మంవల్లనే కలుగుతుంది శరీరానికి !
చల్లని నీటితో రోజూ మూడుసార్లు స్నానం చేయడంవల్ల చర్మం పరిశుభ్రమైన హాయిని ప్రసాదిస్తుంది ! చర్మానికి హాని కలిగించే తైలాలు, లేపనాలు వాడకూడదు !
నలుగుపిండితో చర్మాన్ని శుభ్రపరచుకోవాలి !
దీక్షాకాలంలో ముఖ క్షవరం , కేశఖండనం (జుత్తు కత్తిరించడం) గోళ్లు తీయడం చేయరాదు ! పాదరక్షలు వాడకూడదు !
🌸దీక్షాకాలంలో శవాలను చూడరాదు !
బహిష్టు స్త్రీలను చూడరాదు ! పొరపాటున చూస్తే తలస్నానం చేసి , కర్పూరం వెలిగించి , శరణు ఘోష చేయాలి !
వ్రత దీక్షాకాలంలో దీక్షలో వున్న ఇతరులను ‘స్వామి’ అని , చిన్నపిల్లలను ‘మణికంఠ’ అని , స్త్రీలను ‘భగవతి’ అని పిలవాలి !
🌿అయ్యప్ప స్వాములు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ముందు మూడుసార్లు ‘స్వామి శరణం’ అని చెప్పుకుని సంభాషణ పూర్తి అయిన తరువాత తిరిగి ‘స్వామి శరణం’ అని మూడుసార్లు చెప్పడం అలవర్చుకోవాలి !
🌸శ్రీ అయ్యప్ప పూజ ఎక్కడ జరుగుతున్నా , పిలవకపోయినా వెళ్లి భజన కార్యక్రమంలో పాల్గొనాలి ! దీక్షకాలంలో కనీసం ఐదు పూజా , భజన కార్యక్రమాలలో పాల్గొనాలి ! శబరిమల యాత్రకు వెళ్లేముందు కనీసం పదిమందికి అన్నసంతర్పణ కావించాలి ! అయ్యప్ప ఎవరుగానీ సద్ది , భిక్షలకు ఆహ్వానిస్తే నిరాకరించకూడదు. కుల , మత , తర తమ భేదాలు మరిచి అందూ కలిసి భుజించాలి !
🌿దీక్షలో వున్నపుడు మాంసము భుజించరాదు. తాంబూలం , ధూమపానం , క్షవరం , గోర్లు , కత్తిరించడం చేయకూడదు. చెడుఅలవాటులకు దూరంగా ఉండవలెను. మండల దీక్షాకాలంలో చెప్పబడిన నియమాలను సక్రమంగా పాటించడం వల్ల పంచేంద్రియాల వల్ల కలిగే ప్రలోభాలకు
లొంగకుండా మనస్సును నిశ్చలంగా నియంత్రించడానికి తగిన సాధన లభిస్తుంది.
🌸అయ్యప్పస్వామి ఎక్కి వెళ్లిన పద్ధెనిమిది మెట్లను ఎక్కడానికి అర్హత ప్రసాదించడంలో పంచేంద్రియాల నియంత్రణ మొదటి ఐదు మెట్లను ఎక్కే సామర్థ్యతను కలిగిస్తాయి ! ఇంకా అష్టరాగాలనే 8 రాగాలు , త్రిగుణాలనే 3 గుణాలు , విద్య - అవిద్య అనే రెండు (మొత్తం 13) కూడ నియంత్రించబడితేనే మిగిలిన పదమూడు మెట్లు ఎక్కడానికి సమర్థత లభిస్తుంది !
🌹అష్టరాగములు:🌹
🌿అహంకారమనే మాయ పొర ఎప్పుడూ మనస్సును ఆవరించే వుంటుంది !
అహంకారం నుండి మదం మొలకెత్తుతుంది !
నేను, నాది, నావల్లనే సర్వం జరుగుతున్నది, నన్ను మా ఇంచినది మరొకటి లేదు అనబడే భావాలన్నీ అహంకారం నుండి పుట్టి మదంతో కలిసి పతనానికి దారితీసేలా చేస్తాయి !
అహంకారం , మదంలను కలిపి అష్టరాగాలు లేక అష్టమదాలుగా వ్యవహరిస్తారు.
🌸అవి - విద్యామదము, శీలమదము, రూప మదము, తపోమదము, కుల మదము, యవ్వనమదము, ధనమదము , రాజ్యమదము. దీక్షాకాలంలో ఈ ఎనిమిది మదాలు తలేత్తకుండా జాగ్రత్తపడాలి !
🌿 అహంకారానికి మూలమైన ఈ ఎనిమిది రాగాలవల్ల ప్రభావితం కాకుండా మనస్సును , భక్తి మార్గంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించాలి.
🌹భక్తిమార్గము: 🌹
🌸సామాన్యులకు , దీక్షాధారులకు అందరికీ అనుసరించదగ్గ మార్గం భక్తిమార్గం !
భగవంతుడు వున్నాడనే నమ్మకం, విశ్వాసం దృఢంగా కలిగివుండి, ఆ భగవంతుడిని ఎవరికి ఇష్టమైన రూపంలో వారు ఆరాధించడం భక్తిమార్గంగా తెలుపబడింది !
ఈ మార్గంలో మండలకాలంలో దీక్షాధారులు రోజూ మూడు పూటలు అయ్యప్పస్వామిని పూజించి , భజనలు చేసి అందరిలో ఆ స్వామిని దర్శిస్తూ , సదా అయ్యప్ప నామస్మరణ చేస్తూ గడపడంవల్ల వాళ్ళకు సత్త్వ , రజో తమోగుణాలనే మూడు గుణాలను నియంత్రించే సామర్థ్యం లభిస్తుంది !
🌹త్రిగుణాలు
తమోగుణము: 🌹
🌿అజ్ఞానం , అలసత్వం , విపరీతమైన నిద్ర , కపటం , గర్వం , దురభిమానం , క్రోధం, కోపం , పౌరుషం ఈ గుణం లక్షణాలు ! దీక్షాకాలంలో వీటన్నిటినీ నియంత్రించి మనస్సు వాటివల్ల ప్రభావితం కాకుండా చూసుకోవాలి.
🌹రజోగుణము: 🌹
🌸రాగద్వేషాలను కలిగిస్తుంది ! కోరికలను రేకెత్తిస్తుంది ! దంభము , దురభిమానము , రాజసం , గర్వాహంకారాలు ఈ గుణంవల్ల ప్రకోపిస్తాయి. వీటిని దీక్షాకాలంలో అణచివేసి ప్రశాంతంగా వుండటం అలవరచుకోవాలి !
🌹సత్త్వగుణము: 🌹
🌿సత్యము , శౌచము , క్షమాగుణం , అనుకంప , శాంతి , సంతోషం మొదలైనవి సత్త్వగుణ లక్షణాలు ! వీటిని అలవరచుకుని దీక్షాకాలంలో మసలుకోవడం ప్రధానం ! మంచి గుణాలు అలవరచుకుని , చెడు గుణాలకు దూరంగా ఉంటూ భగవధ్యానంలో గడపాలి !
🌹అవిద్య - విద్య🌹
🌸అవిద్య అంటే అజ్ఞానం! మంచి విషయాలను తెలుసుకోవాలన్న కోరిక లేకపోవడం అవిద్యకు కారణం! అవిద్యవల్ల వివేచనా, తెలివితేటలు, బుద్ధి వికాసం లేకుండా నిస్సారమైన జీవితం గడపవలసి వుంటుంది !
🌿విద్య నేర్పే గురువుల సహాయంతో అవిద్యను తొలగించవచ్చును ! మూఢుడైన శిష్యుడికి విద్యాబోధన చేసి మంచి విషయాలు తెలుసుకోవాలన్న కోరిక కలిగేలా చేస్తాడు గురువు ! అంతవరకు అతడు పశుప్రాయమైన జీవితం గడుపుతూ వచ్చిన విషయం శిష్యునికి తెలిసేలా చేస్తాడు !
🌸అవిద్య ప్రభావం నుండి బయటపడి విద్య నేర్చుకోవడానికి ఆసక్తి కలగడంతో గురువుగారి నాశ్రయించి విద్యనభ్యసిస్తాడు శిష్యుడు ! కొన్ని శాస్త్రాలలో నిపుణడౌతాడు !
భగవంతుని గూర్చిన విషయాలు పౌరాణిక గ్రంథాలను చదివి , గురువుగారి ఉపదేశాలు విని కొంతవరకు తెలుసుకోవడం జరుగుతుంది !
🌿విద్యావంతులు వేదాధ్యయనం చేసి భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ! వారికంతా తెలిసిపోయినట్లనిపిస్తుంది మొదట్లో ! అంతటితో భగవంతుని తత్వాన్ని గ్రహించి జ్ఞానులైపోయారన్న మిథ్యాజ్ఞానం కలుగుతుంది ! ఆ భావన నిజం కాదు ! అందుకే దాన్ని మిథ్యాజ్ఞానం అన్నారు.
🌸ఈ మిథ్యాజ్ఞానం వల్ల అహంకారం మొలకెత్తుతుంది !
దీక్షాకాలంలో ఈ మిథ్యాజ్ఞానంవల్ల వచ్చే అహంకారాన్ని (విద్యామదం) అణచివేయాలి ! అందుకు భక్తిమార్గం సహకరిస్తుంది !
అవిద్యను వదలి విద్యావంతుడైన భక్తుడు స్వామి సేవలో గడిపి ధన్యుడౌతాడు.
🌿శౌనకాది మునులారా ! అయ్యప్పస్వామి ఎక్కివెళ్లిన పద్ధెనిమిది మెట్లను ఎక్కి వెళ్లి ఆ స్వామి దర్శనం చేసుకోవడానికి గురువు ద్వారా తీసుకోవలసిన దీక్ష , మాలధారణ , దినచర్య పాటించవలసిన నియమాల గూర్చి మీకు తెలియజెప్పాను ! ఆ నియమాలన్నీ పాటించడమంటే తపస్సుతో సమానమని గ్రహించండి !
🌸 విషయ వాంఛలనుండి ఇంద్రియాలను నిగ్రహించి , సత్కర్మలే ఆచరిస్తూ , సమతాభావంతో అయ్యప్ప ధ్యానంలో గడిపే మండల దీక్షాకాలం కఠోర తపస్సుతో సమానమైనది ! ముఖ్యంగా కలియుగంలో కలి ప్రభావానికి గురికాకుండా వుండటానికి , మానవులను సన్మార్గంలో నడిపించడానికి అయ్యప్పస్వామి ఈ విధమైన నియమాలను ఏర్పరచటం జరిగింది.
🌿ఆ స్వామి మీద చెక్కు చెదరని విశ్వాసంతో మండల దీక్ష స్వీకరించాలన్న సంకల్పం కలిగిన భక్తులను స్వామే స్వయంగా నియామకాలను పాటించే శక్తి సామర్థ్యాను ప్రసాదిస్తాడు.
🌸నిజమైన భక్తి విశ్వాసాలు లేకుండా కేవలం ఆడంబరానికి దీక్ష స్వీకరించి నియమాలను సరిగా పాటించనివారు యాత్ర చేయలేరు ! ఏదోవిధమైన ఆటంకం ఏర్పడి మండల దీక్ష అసంపూర్తిగా ఆగిపోతుంది ! అందుకే భక్తివిశ్వాసాలతో , త్రికరణశుద్ధిగా (మనసా , వాచా , కర్మలచేత) నియమాలను పాటించి శబరిమల యాత్రకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ధన్యులవుతారు. మండల దీక్ష స్వీకరించిన స్వాములు ! అంటూ చెప్పటం ఆపారు సూతమహర్షి !
🌿‘‘మహర్షి ! మీ నోట తపస్సుతో సమానమైన అయ్యప్పస్వామి మండల దీక్ష , నియమాల గూర్చి విని ధన్యులమైనాము దీక్షా కాలం ముగిసాక చేయవలసిన శబరిగిరి యాత్ర గురించి కూడా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ అడిగారు మునిబృందాలు !
🌸‘‘తప్పకుండా తెలియజెబుతాను ! ముందుగా ఒక్కసారి ఆ శబరిగిరీశుని మనస్సులో నిలిపి భక్తిపూర్వకంగా ధ్యానించండి !
‘‘ఓంకారమూలం జ్యోతి స్వరూపం
పంబానదీ తీర శ్రీ భూతనాథం
శ్రీదేవదేవం చతుర్వేదపాలం
శ్రీ ధర్మశాస్తారం మనసా స్మరామి
వందే మహేశ హరిమోహిని భాగ్యపుత్రం
వందే మహోజ్జ్వల కరం కమనీయ నేత్రం
వందే మహేంద్ర వరదం జగదేక మిత్రం.
వందే మహోత్సవ నటనం మణికంఠ సూత్రం" అంటూ కన్నులరమోడ్చి ధ్యానించి చెప్పసాగాడు సూతమహర్షి !
🌹శబరిగిరి (శబరిమల) యాత్ర వివరాలు యాత్ర అంతరార్థం:🌹
🌿జీవాత్మ ఒక దేహాన్ని వదిలి పైలోకాలకు ప్రయాణించే అంతిమ యాత్రను మహాప్రస్థానం అంటారు ! ఆ ప్రయాణంలో బంధువులెవరూ వెంట వెళ్లలేరు ! ఆ జన్మలో చేసిన పుణ్యపాప కర్మలు మాత్రమే వెంట వెళుతాయి ! తాను సంపాదించినవేవీ వెంట వెళ్లలేవు ! తాను చేసిన పుణ్యపాప ఫలితాలమీద తర్వాత వచ్చే జన్మ ఆధారపడి వుంటుంది !
🌸 జీవించి వుండగానే పవిత్రమైన (నియమాలవల్ల) జీవాత్మ , పరబ్రహ్మమైన అయ్యప్పస్వామిని దర్శించుకుని , పునర్జన్మ లేకుండా ఆ స్వామిలో లయం కావాలన్న కోరిక విన్నవించుకోవడానికి చేసే ప్రయాణమే శబరిగిరి యాత్ర ! స్వామి అనుగ్రహంతో జీవించి వున్నంతవరకు సత్కర్మలు , పుణ్యకార్యాలు ఆచరిస్తూ ముక్తిని పొందాలన్న అంతరార్థం కలిగివుంది శబరిగిరియాత్ర !
🌿యాత్రకు తరలివెళ్ళే విధానం
మండల కాల దీక్ష పూర్తయిన మరునాడు దీక్ష స్వీకరించిన స్వాములకు ఇండ్లలో వాళ్లు (కుటుంబ సభ్యులు) భిక్ష వేసి హారతి ఇచ్చి , దిష్టికాయ కొట్టి యాత్ర సఫలంగా జరగాలని శుభాకాంక్షలు చెబుతారు !
🌸 ఇక తిరిగి వెనుదిరగకుండా గురుస్వామి దగ్గరకు చేరుకుంటారు దీక్షాధారులు ! గురుస్వామి వారి చేత ముందుగా ఇరుముడి కట్టించుతారు !
మాలధారణలాగే ఇరుముడి కట్టే కార్యక్రమం కూడా చాలా ముఖ్యమైనది !
🌹ఇరుముడి ప్రాముఖ్యత🌹
🌿మణికంఠుడు తల్లికోసం పులిపాలు తేవడానికి అరణ్యానికి బయలుదేరినపుడు తండ్రి రాజశేఖరుడు ఒక వస్త్రంలో రెండు అరలుగా చేసి ఒక దాంట్లో మణికంఠునికి రక్షగా ఈశ్వరుని ధ్యానిస్తూ కొబ్బరికాయ , పూజాద్రవ్యాలు ఒక అరలోనూ , రెండవ దానిలో ప్రయాణపుదారిలో తినడానికి ఆహార పదార్థాలు పెట్టి , మూటగా కట్టి తీసుకువెళ్లమని కుమారునికి ఇస్తాడు !
🌸 తండ్రి మాటను కాదనకుండా ఆ మూటను తలమీద పెట్టుకుని వెళతాడు మణికంఠుడు ! ఆ మూటే ‘ఇరుముడి’ గా పిలువబడుతుంది ! (రెండు అరలు కలిపి ముడి వేసిన సంచి) మణికంఠుడు ఇరుముడిని తలమీద ధరించి వెళ్లినట్లే మండల దీక్ష ముగించి స్వాములు కూడా అదేవిధంగా నింపిన సంచులను తలమీద పెట్టుకుని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లడం శుభప్రదంగా భావింపబడుతున్నది !..సశేషం... 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
🌸ఈ మిథ్యాజ్ఞానం వల్ల అహంకారం మొలకెత్తుతుంది !
దీక్షాకాలంలో ఈ మిథ్యాజ్ఞానంవల్ల వచ్చే అహంకారాన్ని (విద్యామదం) అణచివేయాలి ! అందుకు భక్తిమార్గం సహకరిస్తుంది !
అవిద్యను వదలి విద్యావంతుడైన భక్తుడు స్వామి సేవలో గడిపి ధన్యుడౌతాడు.
🌿శౌనకాది మునులారా ! అయ్యప్పస్వామి ఎక్కివెళ్లిన పద్ధెనిమిది మెట్లను ఎక్కి వెళ్లి ఆ స్వామి దర్శనం చేసుకోవడానికి గురువు ద్వారా తీసుకోవలసిన దీక్ష , మాలధారణ , దినచర్య పాటించవలసిన నియమాల గూర్చి మీకు తెలియజెప్పాను ! ఆ నియమాలన్నీ పాటించడమంటే తపస్సుతో సమానమని గ్రహించండి !
🌸 విషయ వాంఛలనుండి ఇంద్రియాలను నిగ్రహించి , సత్కర్మలే ఆచరిస్తూ , సమతాభావంతో అయ్యప్ప ధ్యానంలో గడిపే మండల దీక్షాకాలం కఠోర తపస్సుతో సమానమైనది ! ముఖ్యంగా కలియుగంలో కలి ప్రభావానికి గురికాకుండా వుండటానికి , మానవులను సన్మార్గంలో నడిపించడానికి అయ్యప్పస్వామి ఈ విధమైన నియమాలను ఏర్పరచటం జరిగింది.
🌿ఆ స్వామి మీద చెక్కు చెదరని విశ్వాసంతో మండల దీక్ష స్వీకరించాలన్న సంకల్పం కలిగిన భక్తులను స్వామే స్వయంగా నియామకాలను పాటించే శక్తి సామర్థ్యాను ప్రసాదిస్తాడు.
🌸నిజమైన భక్తి విశ్వాసాలు లేకుండా కేవలం ఆడంబరానికి దీక్ష స్వీకరించి నియమాలను సరిగా పాటించనివారు యాత్ర చేయలేరు ! ఏదోవిధమైన ఆటంకం ఏర్పడి మండల దీక్ష అసంపూర్తిగా ఆగిపోతుంది ! అందుకే భక్తివిశ్వాసాలతో , త్రికరణశుద్ధిగా (మనసా , వాచా , కర్మలచేత) నియమాలను పాటించి శబరిమల యాత్రకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ధన్యులవుతారు. మండల దీక్ష స్వీకరించిన స్వాములు ! అంటూ చెప్పటం ఆపారు సూతమహర్షి !
🌿‘‘మహర్షి ! మీ నోట తపస్సుతో సమానమైన అయ్యప్పస్వామి మండల దీక్ష , నియమాల గూర్చి విని ధన్యులమైనాము దీక్షా కాలం ముగిసాక చేయవలసిన శబరిగిరి యాత్ర గురించి కూడా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము’’ అడిగారు మునిబృందాలు !
🌸‘‘తప్పకుండా తెలియజెబుతాను ! ముందుగా ఒక్కసారి ఆ శబరిగిరీశుని మనస్సులో నిలిపి భక్తిపూర్వకంగా ధ్యానించండి !
‘‘ఓంకారమూలం జ్యోతి స్వరూపం
పంబానదీ తీర శ్రీ భూతనాథం
శ్రీదేవదేవం చతుర్వేదపాలం
శ్రీ ధర్మశాస్తారం మనసా స్మరామి
వందే మహేశ హరిమోహిని భాగ్యపుత్రం
వందే మహోజ్జ్వల కరం కమనీయ నేత్రం
వందే మహేంద్ర వరదం జగదేక మిత్రం.
వందే మహోత్సవ నటనం మణికంఠ సూత్రం" అంటూ కన్నులరమోడ్చి ధ్యానించి చెప్పసాగాడు సూతమహర్షి !
🌹శబరిగిరి (శబరిమల) యాత్ర వివరాలు యాత్ర అంతరార్థం:🌹
🌿జీవాత్మ ఒక దేహాన్ని వదిలి పైలోకాలకు ప్రయాణించే అంతిమ యాత్రను మహాప్రస్థానం అంటారు ! ఆ ప్రయాణంలో బంధువులెవరూ వెంట వెళ్లలేరు ! ఆ జన్మలో చేసిన పుణ్యపాప కర్మలు మాత్రమే వెంట వెళుతాయి ! తాను సంపాదించినవేవీ వెంట వెళ్లలేవు ! తాను చేసిన పుణ్యపాప ఫలితాలమీద తర్వాత వచ్చే జన్మ ఆధారపడి వుంటుంది !
🌸 జీవించి వుండగానే పవిత్రమైన (నియమాలవల్ల) జీవాత్మ , పరబ్రహ్మమైన అయ్యప్పస్వామిని దర్శించుకుని , పునర్జన్మ లేకుండా ఆ స్వామిలో లయం కావాలన్న కోరిక విన్నవించుకోవడానికి చేసే ప్రయాణమే శబరిగిరి యాత్ర ! స్వామి అనుగ్రహంతో జీవించి వున్నంతవరకు సత్కర్మలు , పుణ్యకార్యాలు ఆచరిస్తూ ముక్తిని పొందాలన్న అంతరార్థం కలిగివుంది శబరిగిరియాత్ర !
🌿యాత్రకు తరలివెళ్ళే విధానం
మండల కాల దీక్ష పూర్తయిన మరునాడు దీక్ష స్వీకరించిన స్వాములకు ఇండ్లలో వాళ్లు (కుటుంబ సభ్యులు) భిక్ష వేసి హారతి ఇచ్చి , దిష్టికాయ కొట్టి యాత్ర సఫలంగా జరగాలని శుభాకాంక్షలు చెబుతారు !
🌸 ఇక తిరిగి వెనుదిరగకుండా గురుస్వామి దగ్గరకు చేరుకుంటారు దీక్షాధారులు ! గురుస్వామి వారి చేత ముందుగా ఇరుముడి కట్టించుతారు !
మాలధారణలాగే ఇరుముడి కట్టే కార్యక్రమం కూడా చాలా ముఖ్యమైనది !
🌹ఇరుముడి ప్రాముఖ్యత🌹
🌿మణికంఠుడు తల్లికోసం పులిపాలు తేవడానికి అరణ్యానికి బయలుదేరినపుడు తండ్రి రాజశేఖరుడు ఒక వస్త్రంలో రెండు అరలుగా చేసి ఒక దాంట్లో మణికంఠునికి రక్షగా ఈశ్వరుని ధ్యానిస్తూ కొబ్బరికాయ , పూజాద్రవ్యాలు ఒక అరలోనూ , రెండవ దానిలో ప్రయాణపుదారిలో తినడానికి ఆహార పదార్థాలు పెట్టి , మూటగా కట్టి తీసుకువెళ్లమని కుమారునికి ఇస్తాడు !
🌸 తండ్రి మాటను కాదనకుండా ఆ మూటను తలమీద పెట్టుకుని వెళతాడు మణికంఠుడు ! ఆ మూటే ‘ఇరుముడి’ గా పిలువబడుతుంది ! (రెండు అరలు కలిపి ముడి వేసిన సంచి) మణికంఠుడు ఇరుముడిని తలమీద ధరించి వెళ్లినట్లే మండల దీక్ష ముగించి స్వాములు కూడా అదేవిధంగా నింపిన సంచులను తలమీద పెట్టుకుని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లడం శుభప్రదంగా భావింపబడుతున్నది !..సశేషం... 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 18వ అధ్యాయం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 18,వ భాగం... ప్రారంభం....!!🌹🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌸‘‘గురువర్యులకు ప్రణామాలు ! మీ సందేశం అందుకుని వెంటనే బయలుదేరాము ! మా ప్రాంతంలో పవిత్ర గోదావరి నది పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తున్నది ! స్వామి కార్యమని నమస్కరించి విన్నవించాము !
🌿ఆ నదీమతల్లి కరుణతో రెండు పాయలుగా చీలి మాకు దారి ఇచ్చింది ! త్వరగా దాటి ఇలా మీ సన్నిధికే వస్తున్నాము ! ఆలస్యానికి మన్నించండి !’’ అంటూ విన్నవించుకున్నవారు ఆ ఇద్దరు వ్యక్తులు ! పరశురాములవారు వాళ్ల వైపు ప్రసన్నంగా చూసారు !
🌸‘‘పరవాలేదు ! మేము అర్థం చేసుకున్నాము !’’అంటూ రాజును , ప్రజలను ఉద్దేశిం ‘‘భక్తులారా ! ఇకపై వీరే ఈ ఆలయ బాధ్యతలన్నీ నిర్వహిస్తారు ! రేపటి నుండి స్వామికి వేదోక్తంగా పూజావిధులు జరుపుతారు ! వీరు తపస్సంపన్నులు ! తారక బ్రహ్మ అయ్యప్ప స్వామి భక్తులు ! గోదావరి నది తీర ప్రాంతంలో హరిహరుల దేవాలయంలో అర్చకులైన వీరు ఇక్కడ స్వామిని సేవించడానికి అర్హులని నిర్ణయించి ఇక్కడకు రప్పించడం జరిగింది !
🌿వీరి పేర్లు తాయమన్ సోదరులు ! ఇప్పటినుండీ వీరు , వీరి తర్వాత వీరి వంశస్థులు అయ్యప్పస్వామి ప్రధాన అర్చకులుగా ఈ ప్రాంతంలోనే నివసించగలరు ! మేము వారికన్నీ వివరంగా తెలిపి వెళుతాము ! మీరందరూ తిరిగి వెళ్లి రేపు ఉదయం వచ్చి దర్శించుకోండి ! ప్రధాన తంత్రులు (అర్చకులు) అయిన వీరే గురువులుగా మీకు స్వామి ఆరాధనా విధులు తెలియజెబుతారు !
🌸అందరూ భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధించి జీవితాలు ధన్యం చేసుకోండి !’’ అని తెలియజెప్పారు ! ‘‘మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాము ! మీకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము! స్వీకరించండి గురుదేవులారా !’’ అంటూ పరశురాములవారికి అగస్త్య మహర్షికి ప్రణామాలు అర్పించి కొండ దిగి వచ్చారు రాజు , పరివారం , పందల రాజ్య ప్రజలు !
🌿 మర్నాడు వారందరూ తిరిగి కొండమీదికి వచ్చేసరికి ప్రధాన తంత్రులు స్వామికి అభిషేకార్చనలు , అలంకారం , పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ! అవన్నీ చూసి పులకించిపోయారు రాజు, పరివారం !
🌸వాళ్లను చిరునవ్వుతో పలకరించి తీర్థ , ప్రసాదాలు ఇచ్చారు అర్చక తాంత్రులు ! ‘‘భక్తులారా ! స్వామిని మీరీవిధంగా రోజూ దర్శించుకోవచ్చును ! మీరు తనివితీరా దర్శించుకుని మీ నివాసాలకు తిరిగి వెళ్లి మీ గృహాలలో స్వామి రూపాలను చిత్రపటాలుగా గానీ , విగ్రహాలుగా గానీ పవిత్రమైన స్థలంలో వుంచుకుని పూజించుకోండి !’’ అంటూ వాళ్లకు చిత్ర పటాలు , విగ్రహాలు ఇచ్చారు!
🌿 ‘‘రాజా ! పరశురాములవారు , అగస్త్య మహర్షి మీ అందరికోసం ఈ పటాలను , విగ్రహాలను ఇచ్చి వెళ్లారు ! స్వామికి రోజూ పూజార్చనలు చేసుకోండి ! మీకు మనస్సు కలిగినప్పుడు వచ్చి ఈ శబరిగిరి క్షేత్రంలో స్వామిని దర్శించుకోండి ! మీకు పూజా విధానం తెలియజేస్తాము !
🌸 మీరు మీ రాజ్యానికి తిరిగి వెళ్లి అక్కడ కూడా స్వామికి ఆలయం నిర్మింపజేయండి నిపుణులైన శిల్పులతో ! స్వామి విగ్రహ ప్రతిష్ఠ మేము కావించుతాము !’’ అంటూ ప్రధాన తాంత్రి చెప్పినది విని ‘‘తప్పకుండా అట్లాగే చేస్తాను ! అర్చకస్వాములారా ! నాదొక విన్నపం !
🌿మణికంఠుడు మా కన్నుల వెలుగు రాజకుమారునిగా అమూల్యమైన ఆభరణాలు ధరించి ఆనందాన్ని పంచిన రోజులు ఇంకా మా కళ్లముందు కదలాడుతూనే వున్నాయి ! పులిపాల కోసం అరణ్యానికి బయలుదేరినప్పుడు ఆ ఆభరణాలు తీసివేసి నార బట్టలు ధరించి వెళ్లాడు ! ఆ నగలు రాజభవనంలో జాగ్రత్త చేయబడి వున్నాయి ! వాటిని స్వామి విగ్రహానికి అలంకరింప జేయాలని ఆశిస్తున్నాను !’’ అన్నాడు ప్రార్థన పూర్వకంగా నమస్కరించి !
🌸 ‘‘తప్పకుండా ! ప్రతి సంవత్సరం మకరజ్యోతిగా స్వామి దర్శనమిచ్చే సమయంలో మీరు ఆ ఆభరణాలను స్వయంగా తీసుకుని వచ్చి మాకందిస్తే వాటిని విగ్రహనికి అలంకరిస్తాము ! మీరు తృప్తితీరా చూడవచ్చును ! తిరిగి వాటిని మర్నాడు తీసుకువెళ్లి మీ రక్షణలో వుంచి మరు సంవత్సరం తిరిగి తీసుకుని రావాలి ! ప్రతి రోజూ విగ్రహానికి స్వామి స్వయంగా వ్యక్తమైనపుడు వుండిన ఆభరణాలు మాత్రమే అలంకరింపజేయడం జరుగుతుంది’’ అని వాళ్ళు చెప్పింది విని తృప్తిగా నిశ్వసించాడు రాజు !
🌿‘‘శౌనకాది మునులారా ! ఆ విధంగా అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ! ప్రధాన తంత్రుల ద్వారా స్వామి పూజా విధానం సామాన్యజనులు నేర్చుకుని వ్యాప్తి కావించారు. పందళ రాజ్యంలోనూ, చుట్టుప్రక్కల క్రమంగా ఆలయాలు వెలసి స్వామి విగ్రహ ప్రతిష్ఠలు శాస్త్రోక్తంగా జరిగాయి.
🌸ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ! ఇండ్లలో తమ ప్రాంతాలలోని గుడులలో స్వామి అర్చించుకుంటున్నా శబరిగిరి మీది స్వామిని దర్శించుకోవడంలో లభించే ఆనందం, తృప్తి వర్ణనాతీతమైవని గ్రహించారు పందళ ప్రజలు !
శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 18,వ భాగం... ప్రారంభం....!!🌹🙏
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌸‘‘గురువర్యులకు ప్రణామాలు ! మీ సందేశం అందుకుని వెంటనే బయలుదేరాము ! మా ప్రాంతంలో పవిత్ర గోదావరి నది పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తున్నది ! స్వామి కార్యమని నమస్కరించి విన్నవించాము !
🌿ఆ నదీమతల్లి కరుణతో రెండు పాయలుగా చీలి మాకు దారి ఇచ్చింది ! త్వరగా దాటి ఇలా మీ సన్నిధికే వస్తున్నాము ! ఆలస్యానికి మన్నించండి !’’ అంటూ విన్నవించుకున్నవారు ఆ ఇద్దరు వ్యక్తులు ! పరశురాములవారు వాళ్ల వైపు ప్రసన్నంగా చూసారు !
🌸‘‘పరవాలేదు ! మేము అర్థం చేసుకున్నాము !’’అంటూ రాజును , ప్రజలను ఉద్దేశిం ‘‘భక్తులారా ! ఇకపై వీరే ఈ ఆలయ బాధ్యతలన్నీ నిర్వహిస్తారు ! రేపటి నుండి స్వామికి వేదోక్తంగా పూజావిధులు జరుపుతారు ! వీరు తపస్సంపన్నులు ! తారక బ్రహ్మ అయ్యప్ప స్వామి భక్తులు ! గోదావరి నది తీర ప్రాంతంలో హరిహరుల దేవాలయంలో అర్చకులైన వీరు ఇక్కడ స్వామిని సేవించడానికి అర్హులని నిర్ణయించి ఇక్కడకు రప్పించడం జరిగింది !
🌿వీరి పేర్లు తాయమన్ సోదరులు ! ఇప్పటినుండీ వీరు , వీరి తర్వాత వీరి వంశస్థులు అయ్యప్పస్వామి ప్రధాన అర్చకులుగా ఈ ప్రాంతంలోనే నివసించగలరు ! మేము వారికన్నీ వివరంగా తెలిపి వెళుతాము ! మీరందరూ తిరిగి వెళ్లి రేపు ఉదయం వచ్చి దర్శించుకోండి ! ప్రధాన తంత్రులు (అర్చకులు) అయిన వీరే గురువులుగా మీకు స్వామి ఆరాధనా విధులు తెలియజెబుతారు !
🌸అందరూ భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధించి జీవితాలు ధన్యం చేసుకోండి !’’ అని తెలియజెప్పారు ! ‘‘మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాము ! మీకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము! స్వీకరించండి గురుదేవులారా !’’ అంటూ పరశురాములవారికి అగస్త్య మహర్షికి ప్రణామాలు అర్పించి కొండ దిగి వచ్చారు రాజు , పరివారం , పందల రాజ్య ప్రజలు !
🌿 మర్నాడు వారందరూ తిరిగి కొండమీదికి వచ్చేసరికి ప్రధాన తంత్రులు స్వామికి అభిషేకార్చనలు , అలంకారం , పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ! అవన్నీ చూసి పులకించిపోయారు రాజు, పరివారం !
🌸వాళ్లను చిరునవ్వుతో పలకరించి తీర్థ , ప్రసాదాలు ఇచ్చారు అర్చక తాంత్రులు ! ‘‘భక్తులారా ! స్వామిని మీరీవిధంగా రోజూ దర్శించుకోవచ్చును ! మీరు తనివితీరా దర్శించుకుని మీ నివాసాలకు తిరిగి వెళ్లి మీ గృహాలలో స్వామి రూపాలను చిత్రపటాలుగా గానీ , విగ్రహాలుగా గానీ పవిత్రమైన స్థలంలో వుంచుకుని పూజించుకోండి !’’ అంటూ వాళ్లకు చిత్ర పటాలు , విగ్రహాలు ఇచ్చారు!
🌿 ‘‘రాజా ! పరశురాములవారు , అగస్త్య మహర్షి మీ అందరికోసం ఈ పటాలను , విగ్రహాలను ఇచ్చి వెళ్లారు ! స్వామికి రోజూ పూజార్చనలు చేసుకోండి ! మీకు మనస్సు కలిగినప్పుడు వచ్చి ఈ శబరిగిరి క్షేత్రంలో స్వామిని దర్శించుకోండి ! మీకు పూజా విధానం తెలియజేస్తాము !
🌸 మీరు మీ రాజ్యానికి తిరిగి వెళ్లి అక్కడ కూడా స్వామికి ఆలయం నిర్మింపజేయండి నిపుణులైన శిల్పులతో ! స్వామి విగ్రహ ప్రతిష్ఠ మేము కావించుతాము !’’ అంటూ ప్రధాన తాంత్రి చెప్పినది విని ‘‘తప్పకుండా అట్లాగే చేస్తాను ! అర్చకస్వాములారా ! నాదొక విన్నపం !
🌿మణికంఠుడు మా కన్నుల వెలుగు రాజకుమారునిగా అమూల్యమైన ఆభరణాలు ధరించి ఆనందాన్ని పంచిన రోజులు ఇంకా మా కళ్లముందు కదలాడుతూనే వున్నాయి ! పులిపాల కోసం అరణ్యానికి బయలుదేరినప్పుడు ఆ ఆభరణాలు తీసివేసి నార బట్టలు ధరించి వెళ్లాడు ! ఆ నగలు రాజభవనంలో జాగ్రత్త చేయబడి వున్నాయి ! వాటిని స్వామి విగ్రహానికి అలంకరింప జేయాలని ఆశిస్తున్నాను !’’ అన్నాడు ప్రార్థన పూర్వకంగా నమస్కరించి !
🌸 ‘‘తప్పకుండా ! ప్రతి సంవత్సరం మకరజ్యోతిగా స్వామి దర్శనమిచ్చే సమయంలో మీరు ఆ ఆభరణాలను స్వయంగా తీసుకుని వచ్చి మాకందిస్తే వాటిని విగ్రహనికి అలంకరిస్తాము ! మీరు తృప్తితీరా చూడవచ్చును ! తిరిగి వాటిని మర్నాడు తీసుకువెళ్లి మీ రక్షణలో వుంచి మరు సంవత్సరం తిరిగి తీసుకుని రావాలి ! ప్రతి రోజూ విగ్రహానికి స్వామి స్వయంగా వ్యక్తమైనపుడు వుండిన ఆభరణాలు మాత్రమే అలంకరింపజేయడం జరుగుతుంది’’ అని వాళ్ళు చెప్పింది విని తృప్తిగా నిశ్వసించాడు రాజు !
🌿‘‘శౌనకాది మునులారా ! ఆ విధంగా అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ! ప్రధాన తంత్రుల ద్వారా స్వామి పూజా విధానం సామాన్యజనులు నేర్చుకుని వ్యాప్తి కావించారు. పందళ రాజ్యంలోనూ, చుట్టుప్రక్కల క్రమంగా ఆలయాలు వెలసి స్వామి విగ్రహ ప్రతిష్ఠలు శాస్త్రోక్తంగా జరిగాయి.
🌸ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ! ఇండ్లలో తమ ప్రాంతాలలోని గుడులలో స్వామి అర్చించుకుంటున్నా శబరిగిరి మీది స్వామిని దర్శించుకోవడంలో లభించే ఆనందం, తృప్తి వర్ణనాతీతమైవని గ్రహించారు పందళ ప్రజలు !
🌿అందుకే శబరిగిరి కి ప్రయాణమవాలని ఉబలాటపడేవారు ! మెట్లెక్కి వెళ్లి స్వామి సన్నిధానం చేరాలన్న ఆశే అందరిలో ! అది గమనించి ప్రధాన తాంత్రులు (మేల్శాంతి) వారి ఆశ నెరవేరడానికి అయ్యప్ప స్వామి నిర్దేశించిన దీక్షావిధి, నియమాలు పాటించవలసి వుంటుందనీ, అప్పుడే ఆ స్వామిని మెట్లెక్కి వెళ్లి దర్శించే అర్హత కలుగుతుందని చెప్పడంతో అందరూ భక్తివిశ్వాసాలకు, ఉత్సాహం తోడుకాగా ప్రధాన తంత్రులనుండి ఆ విధుల గూర్చి
🌸ఉపదేశం పొంది ఆ ప్రకారం ఆచరించి స్వామిని పద్దెనిమిది మెట్లెక్కి వెళ్లి దర్శించుకుని జీవితాలు ధన్యం కావించుకునేవారు ! ఇహపర సౌఖ్యాలు ప్రసాదించి మెల్లగా చూసేవాడు అయ్యప్ప.
🌿పంబళ రాజు రాజశేఖరుడు మరు సంవత్సరం మణికంఠుని ఆభరణాలను ఉత్సవంగా మకర జ్యోతిగా దర్శనమిచ్చే రోజున శబరిగిరికి తీసుకువెళ్లి ప్రధాన తంత్రులు వాటిని స్వామి మూల విగ్రహానికి ధరింపజేయడం కన్నుల కరువు తీరా చూసి పులకించిపోతాడు ! ఆయనకు జీవితంలో ఇక కావలసినదేమీ లేదనిపించింది ! తనకు తిరిగి జన్మ లేకుండా స్వామిలో లీనమై మోక్షాన్ని పొందాలని తహతహలాడాడు ! స్వామికి మొరపెట్టుకున్నాడు !
🌸 ‘‘ఆర్తితో నీవు నన్ను మోక్షప్రాప్తిని అనుగ్రహించమని కోరుతున్నావు ! రాజా ! నీవు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ! ఇకపై ప్రతి సంవత్సరం నీ వంశీయులు నా ఆభరణాలను మకర సంక్రమణం రోజున తీసుకురావడం , వాటిని నా విగ్రహానికి ధరింపజేయడం జరుగుతుంది !
🌿నీ పేరు భూమిపై చిరస్థాయిగా నిలిచిపోతుంది’’ అని
స్వామి విగ్రహం నుండి పలుకులు వినరావడంతో ‘‘ధన్యుడిని స్వామి ధన్యుడిని ! అయ్యప్ప స్వామి ! నీ పాదాలే భక్తులందరికీ ఆశ్రయమిచ్చి కాపాడాలి ! స్వామి శరణం ! అయ్యప్ప.శరణం !’’ అని భక్తి పారవశ్యంతో భజిస్తూ వుండగా , ఆయనలోనుండి జీవాత్మ జ్యోతిరూపంలో వెలువడి పరమాత్మలో లీనమైంది ! రాజశేఖరుడికి మోక్షప్రాప్తి లభించింది ! అంటూ చెప్పటం ఆపారు సూతమహర్షి !
🌸‘‘మహర్షి ! మీ నోట అయ్యప్పస్వామి దివ్యచరితాన్ని విని ధన్యులమైనాము ! దుష్టశిక్షణ , శిష్టరక్షణ అవతార లక్ష్యాలుగా హరిహర పుత్రునిగా జన్మించిన మణికంఠుడు అయ్యప్పస్వామిగా శబరిగిరిమీద వెలసి భక్తులను అనుగ్రహిస్తున్న దివ్యచరితాన్ని ఎన్నిసార్లు విన్నా తనివితీరదినిపిస్తున్నది ! శబరిగిరి దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి ఆచరించవలసిన దీక్షా విధులగూర్చి గూడా వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అంటూ అందరూ ముక్తకంఠాలతో ప్రార్థించారు.
🌿 అలా వారు అడుగుతున్న తీరు చూసి ‘‘తప్పకుండా చెబుతాను ! అయ్యప్పస్వామి దివ్య చరితంతోపాటు ఆ స్వామి భక్తులకోసం ఏర్పరిచిన దీక్షా నియమాలను గూర్చి తెలుసుకోవడంవల్ల అయ్యప్పస్వామి అనుగ్రహంతో సర్వాభీష్టాలు నెరవేరి శాంతితో సన్మార్గంలో జీవించి స్వామి సన్నిధిని చేరుకుంటారు ! ఏదీ అందరూ ముక్తకంఠాలతో ముందుగా గురుమూర్తి అయిన అయ్యప్పస్వామిని స్తుతించండి !’’ అన్నారు.
🌸‘‘పరమ పావనం స్వామి విశ్వ విశృతం వరగుణప్రదం స్వామి భక్తపాలకం గిరిగుహాప్రియం స్వామి నిత్య నిర్మలం హరహరాత్మజం స్వామి దేవ మాశ్రయేత్ !’’* అని అందరూ భక్తి పూర్వకంగా భజన చేస్తుంటే ఆ ప్రాంతమంతా భక్తిపూరిత ప్రశాంత వాతావరణంతో విలసిల్లింది !
🌹దీక్ష - వ్రత నియమాలు గురు ప్రార్థన:
🌸‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్ద్రేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మా
తస్మై శ్రీగురవే నమః’’
అంటూ గురు పరంపరకు మూలపురుషుడు , త్రిమూర్త్యాత్మకుడు అయిన దత్తాత్రేయస్వామికి ముందుగా నమస్కరించారు సూత మహర్షి ! ముని ముఖ్యులను కూడా స్మరించారు.
🌿‘‘జ్ఞాన విజ్ఞాన సిద్ధర్థ్యం భజేహం నారదమునిం
వ్యాసం వాల్మీకి వౌనీంద్రం వశిష్టం బ్రహ్మవాదినమ్!
సర్వశాస్త్రార్థ యోగ్యార్థం సర్వగ్రంథి విభేదనమ్
బ్రహ్మ విష్ణు శివం మూర్తింగురు రూపముపాస్మహే’’ అంటూ స్తుతించి చెప్పసాగారు.
🌸సద్గురువు ఆవశ్యకత
పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లడానికి గురువు అనుజ్ఞ , దీక్ష , నియమాలు ఆవశ్యకం కావు ! కాని అయ్యప్పస్వామి దర్శనానికి ఆయన ఎక్కి వెళ్లిన పద్ధెనిమిది మెట్లమీద నుండి ఎక్కి వెళ్లడానికి మాత్రం గురువు , వ్రతదీక్ష , మాలధారణ మొదలైనవి తప్పక అవసరమౌతాయి.
🌿గురువులలో చదువు నేర్పే గురువులు కాకుండా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన సద్గురువుల వల్ల పొందే మంత్రోపదేశం అయ్యప్పస్వామి వ్రతదీక్షకులకు సత్ఫలితాలనిస్తుంది ! ప్రధాన అర్చకుల నుండి మంత్రోపదేశం పొంది దీక్ష స్వీకరించి మెట్లెక్కి వెళ్లి స్వామి దర్శనం చేయటంవల్ల ఆ మనిషిలో దైవభక్తి , ఆధ్యాత్మికచింతన పెంపొందుతాయి ! సద్గుణాలు అలవడతాయి ! రాగద్వేషాలు విడిచిపెట్టి , అహంకారం, ఆడంబరం లేకుండా అందరిపట్ల దయాభావంతో సమానతలు దృక్పథంతో చూడగలుగుతారు.
🌸 భగవంతుడే పరబ్రహ్మ ! ఆ పరబ్రహ్మను చేరడానికి సద్గురువు ఉపదేశం పొందడమే మార్గం అన్న వివేచన కలుగుతుంది ! అప్పయ్యస్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించే అర్చకస్వాములు, పది సంవత్సరాలు వరుసగా దీక్ష స్వీకరించి పద్ధెనిమిది మెట్లక్కి స్వామి దర్శనం చేసుకువచ్చిన గురుస్వాములు ఇతరులకు దీక్ష ఇవ్వడానికి అర్హతను కలిగి వుంటారు ! వీరు మానసిక పరిపక్వత కలిగిన
🌸ఉపదేశం పొంది ఆ ప్రకారం ఆచరించి స్వామిని పద్దెనిమిది మెట్లెక్కి వెళ్లి దర్శించుకుని జీవితాలు ధన్యం కావించుకునేవారు ! ఇహపర సౌఖ్యాలు ప్రసాదించి మెల్లగా చూసేవాడు అయ్యప్ప.
🌿పంబళ రాజు రాజశేఖరుడు మరు సంవత్సరం మణికంఠుని ఆభరణాలను ఉత్సవంగా మకర జ్యోతిగా దర్శనమిచ్చే రోజున శబరిగిరికి తీసుకువెళ్లి ప్రధాన తంత్రులు వాటిని స్వామి మూల విగ్రహానికి ధరింపజేయడం కన్నుల కరువు తీరా చూసి పులకించిపోతాడు ! ఆయనకు జీవితంలో ఇక కావలసినదేమీ లేదనిపించింది ! తనకు తిరిగి జన్మ లేకుండా స్వామిలో లీనమై మోక్షాన్ని పొందాలని తహతహలాడాడు ! స్వామికి మొరపెట్టుకున్నాడు !
🌸 ‘‘ఆర్తితో నీవు నన్ను మోక్షప్రాప్తిని అనుగ్రహించమని కోరుతున్నావు ! రాజా ! నీవు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ! ఇకపై ప్రతి సంవత్సరం నీ వంశీయులు నా ఆభరణాలను మకర సంక్రమణం రోజున తీసుకురావడం , వాటిని నా విగ్రహానికి ధరింపజేయడం జరుగుతుంది !
🌿నీ పేరు భూమిపై చిరస్థాయిగా నిలిచిపోతుంది’’ అని
స్వామి విగ్రహం నుండి పలుకులు వినరావడంతో ‘‘ధన్యుడిని స్వామి ధన్యుడిని ! అయ్యప్ప స్వామి ! నీ పాదాలే భక్తులందరికీ ఆశ్రయమిచ్చి కాపాడాలి ! స్వామి శరణం ! అయ్యప్ప.శరణం !’’ అని భక్తి పారవశ్యంతో భజిస్తూ వుండగా , ఆయనలోనుండి జీవాత్మ జ్యోతిరూపంలో వెలువడి పరమాత్మలో లీనమైంది ! రాజశేఖరుడికి మోక్షప్రాప్తి లభించింది ! అంటూ చెప్పటం ఆపారు సూతమహర్షి !
🌸‘‘మహర్షి ! మీ నోట అయ్యప్పస్వామి దివ్యచరితాన్ని విని ధన్యులమైనాము ! దుష్టశిక్షణ , శిష్టరక్షణ అవతార లక్ష్యాలుగా హరిహర పుత్రునిగా జన్మించిన మణికంఠుడు అయ్యప్పస్వామిగా శబరిగిరిమీద వెలసి భక్తులను అనుగ్రహిస్తున్న దివ్యచరితాన్ని ఎన్నిసార్లు విన్నా తనివితీరదినిపిస్తున్నది ! శబరిగిరి దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి ఆచరించవలసిన దీక్షా విధులగూర్చి గూడా వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అంటూ అందరూ ముక్తకంఠాలతో ప్రార్థించారు.
🌿 అలా వారు అడుగుతున్న తీరు చూసి ‘‘తప్పకుండా చెబుతాను ! అయ్యప్పస్వామి దివ్య చరితంతోపాటు ఆ స్వామి భక్తులకోసం ఏర్పరిచిన దీక్షా నియమాలను గూర్చి తెలుసుకోవడంవల్ల అయ్యప్పస్వామి అనుగ్రహంతో సర్వాభీష్టాలు నెరవేరి శాంతితో సన్మార్గంలో జీవించి స్వామి సన్నిధిని చేరుకుంటారు ! ఏదీ అందరూ ముక్తకంఠాలతో ముందుగా గురుమూర్తి అయిన అయ్యప్పస్వామిని స్తుతించండి !’’ అన్నారు.
🌸‘‘పరమ పావనం స్వామి విశ్వ విశృతం వరగుణప్రదం స్వామి భక్తపాలకం గిరిగుహాప్రియం స్వామి నిత్య నిర్మలం హరహరాత్మజం స్వామి దేవ మాశ్రయేత్ !’’* అని అందరూ భక్తి పూర్వకంగా భజన చేస్తుంటే ఆ ప్రాంతమంతా భక్తిపూరిత ప్రశాంత వాతావరణంతో విలసిల్లింది !
🌹దీక్ష - వ్రత నియమాలు గురు ప్రార్థన:
🌸‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్ద్రేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మా
తస్మై శ్రీగురవే నమః’’
అంటూ గురు పరంపరకు మూలపురుషుడు , త్రిమూర్త్యాత్మకుడు అయిన దత్తాత్రేయస్వామికి ముందుగా నమస్కరించారు సూత మహర్షి ! ముని ముఖ్యులను కూడా స్మరించారు.
🌿‘‘జ్ఞాన విజ్ఞాన సిద్ధర్థ్యం భజేహం నారదమునిం
వ్యాసం వాల్మీకి వౌనీంద్రం వశిష్టం బ్రహ్మవాదినమ్!
సర్వశాస్త్రార్థ యోగ్యార్థం సర్వగ్రంథి విభేదనమ్
బ్రహ్మ విష్ణు శివం మూర్తింగురు రూపముపాస్మహే’’ అంటూ స్తుతించి చెప్పసాగారు.
🌸సద్గురువు ఆవశ్యకత
పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లడానికి గురువు అనుజ్ఞ , దీక్ష , నియమాలు ఆవశ్యకం కావు ! కాని అయ్యప్పస్వామి దర్శనానికి ఆయన ఎక్కి వెళ్లిన పద్ధెనిమిది మెట్లమీద నుండి ఎక్కి వెళ్లడానికి మాత్రం గురువు , వ్రతదీక్ష , మాలధారణ మొదలైనవి తప్పక అవసరమౌతాయి.
🌿గురువులలో చదువు నేర్పే గురువులు కాకుండా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన సద్గురువుల వల్ల పొందే మంత్రోపదేశం అయ్యప్పస్వామి వ్రతదీక్షకులకు సత్ఫలితాలనిస్తుంది ! ప్రధాన అర్చకుల నుండి మంత్రోపదేశం పొంది దీక్ష స్వీకరించి మెట్లెక్కి వెళ్లి స్వామి దర్శనం చేయటంవల్ల ఆ మనిషిలో దైవభక్తి , ఆధ్యాత్మికచింతన పెంపొందుతాయి ! సద్గుణాలు అలవడతాయి ! రాగద్వేషాలు విడిచిపెట్టి , అహంకారం, ఆడంబరం లేకుండా అందరిపట్ల దయాభావంతో సమానతలు దృక్పథంతో చూడగలుగుతారు.
🌸 భగవంతుడే పరబ్రహ్మ ! ఆ పరబ్రహ్మను చేరడానికి సద్గురువు ఉపదేశం పొందడమే మార్గం అన్న వివేచన కలుగుతుంది ! అప్పయ్యస్వామి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించే అర్చకస్వాములు, పది సంవత్సరాలు వరుసగా దీక్ష స్వీకరించి పద్ధెనిమిది మెట్లక్కి స్వామి దర్శనం చేసుకువచ్చిన గురుస్వాములు ఇతరులకు దీక్ష ఇవ్వడానికి అర్హతను కలిగి వుంటారు ! వీరు మానసిక పరిపక్వత కలిగిన
🌿పరబ్రహ్మతత్వాన్ని ఆకళింపు చేసుకుని వుండగలరు !
🌹మాలధారణ :🌹
🌸దీక్ష స్వీకరించాలని సంకల్పం చేసుకున్నవాళ్ళు ముందురోజు తాము ఎంచుకున్న గురుస్వామివారిని దర్శించి తమకు దీక్ష ఇవ్వవలసిందిగా ప్రార్థించాలి ! ఆ సద్గురువు ఆశీర్వాదం చేసి మాలను ధరింపజేయడానికి అంగీకరించి స్థల నిర్ణయం చేస్తారు .
🌿గురువు ఆశ్రమము , ఇంట్లో పవిత్రంగా , ప్రత్యేకంగా వుంచుకునే పూజాగృహం , అయ్యప్పస్వామి దేవాలయం , ఇతర దేవీ దేవతల దేవాలయాలు దీక్షాస్వీకారానికి అనుకూలమైనవి !
🌹కాలవ్యవధి :🌹
🌸వృశ్చిక మాసం (వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరించే నెల రోజులు) మొదటి రోజునుండి 41 రోజుల కాలాన్ని మండల కాలంగా వ్యవహరిస్తారు ! ఈ 41 రోజులు దీక్షాకాలం వ్రతకాలాన్ని పరమ పవిత్రంగా గడపాలి !
🙏దీక్ష స్వీకారం:🌹
🌿ముందు రోజు గురుస్వామిని కలుసుకుని ఆయన చెప్పిన స్థలానికి (సాధారణంగా అయ్యప్పస్వామి గుడిలో దీక్ష ఇచ్చి మాలధారణ జరుపుతారు) పగటిపూట గుడి మూయడానికి పూర్వం గురుస్వామి నిర్ణయించిన సమయానికి చేరుకోవాలి ! ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుని చల్లని నీటితో తలస్నానం ఆచరించి శుభ్ర వస్త్రాలు ధరించాలి ! దీక్ష స్వీకరించేవారు నల్లనిరంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి !
🌹అయ్యప్ప నల్లరంగు వస్తధ్రారణ ఆంతర్యం:🌹
🌸తెలుపు , ఎరుపు , పసుపు రంగుల కలయికవల్ల నల్లరంగు ఏర్పడుతుంది ! వీటిలో సత్వగుణానికి తెలుపు రంగు , రజోగుణానికి ఎరుపు రంగు , తమోగుణానికి పసుపు రంగు ప్రతీకలు ! ఈ మూడు రంగుల కలయికతో ఏర్పడే నల్లని వస్త్రాలను ధరించటం వల్ల మనిషిలోని ఈ మూడు గుణాలను తగిన రీతిలో అదుపులో ఉంచుకోవాలని నలుపు రంగు గుర్తుచేస్తుంటుంది.
🌿నల్ల రంగు వస్త్రాలను ధరించి నుదుట విభూది , చందనము , కుంకుమ బొట్టు పెట్టుకోవాలి.
🌹మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు :🌹
🌸నలుపు , కావి , నీలిరంగు దుస్తులు రెండేసి జతలు , తులసి , రుద్రాక్షమాలలు 108 సంఖ్యగలవి రెండు మాలలు తీసుకోవాలి !
🌹పూజాద్రవ్యాలు🌹
🌿కంకుమ , విభూది , చందనం , అరటిపండ్లు , కొబ్బరికాయ , ఆవు నెయ్యి , దీపారాధాన వస్తువులు , పుష్పాలు మొదలైనవి తీసుకుని గుడిలో గురుస్వామి వారిని కలుసుకోవాలి ! గురుస్వామి వారు దేవాలయాలలో పూజ జరిపి మెడలో మాలలు వేసి చెవిలో అయ్యప్పస్వామి మంత్రం ఉపదేశించి దీక్ష ఇవ్వటం జరుగుతుంది !
🌹మాలాధారణ మంత్రం:🌹
మాలను ధరింపజేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠింపచేస్తారు గురుస్వామి !
🌸‘‘జ్ఞానముద్రాం , శాస్తమ్రుద్రాం ,
గురుముద్రాం నమామ్యహం
వనముద్రాం , శ్రద్ధాముద్రాం ,
రుద్రముద్రాం , నమామ్యహం ,
శాంతముద్రాం , సత్యముద్రాం ,
వ్రతముద్రాం నమామ్యహం
శబర్యాశ్రమ సత్యేన ముద్రాం
పాతు సదాపిమే గురు దక్షిణాయా ,
పూర్వ తస్మానుగ్రహకారిణే శరణాగతముద్రాఖ్యం ,
తన్ముద్రాం ధారయామ్యహం చిన్ముద్రాం ఖేచరీముద్రాం ,
భద్రముద్రాం నమామ్యహం శబర్యాచలముద్రాయై ,
నమస్త్భ్యుం నమో నమః
‘ఓం స్వామియే శరణం అయ్యప్ప’
అంటూ దీక్ష ముద్ర వున్న మాలను ధరింపజేస్తారు గురుస్వామి !
🌿 మండల దీక్షా స్వీకారానికి ఆశీర్వాదం , ఆమోదం తెలియజేస్తారు ! దీక్ష ముద్ర మాలను ధరించినవారు అప్పటినుండి మండలకాలంలో ఎంతో పవిత్రంగా , నియమ నిష్ఠలతో గడపవలసి వుంటుంది!
🌹అయ్యప్ప దీక్షను స్వీకరించిన స్వాముల దినచర్య🌹
🌸ఉదయం: బ్రాహ్మముహూర్తంలో (తెల్లవారు జామున గం.3.30) లేచిn సూర్యోదయానికి ముందుగానే కాలకృత్యాలు పూర్తిచేసి , చల్లనీళ్ళతో తలస్నానం ఆచరించాలి ! శుభ్రమైన నల్లని వస్త్రాలు ధరించి నుదుట విభూతి , చందనము , కుంకుమ బొట్లు ధరించాలి ! మెడలో వున్న మాలలోని ముద్రకు కూడా విభూది , కుంకుమ , చందనము అద్ది కళ్లకద్దుకోవాలి !
🌿 సూర్యునికి నమస్కరించి పూజ గదిలోకి ప్రవేశించాలి ! పూజాగృహంలో అయ్యప్పస్వామి చిత్రపటాన్ని మధ్యలో అమర్చిన పీఠంమీద అరిటాకు వేసి , దానిమీద వుంచి చందనపు బొట్టు పెట్టి , కుంకుమ అద్ది పూలమాలలతో అలంకరించి రెండు వైపులా దీపపు కుందులు వుంచి దీపారాధన చేయాలి !
🌸 స్వామిని షోడశోపచారాలతో పూజించాలి ! నైవేద్యంగా అరటిపండ్లు , బెల్లం , అటుకులు మొదలైనవి సమర్పించి హారతి చూపుతూ 108 నామాల శరణు ఘోష చదివి , సాష్టాంగ నమస్కారాలు చేయాలి !
🌿 మెడలోని ముద్రమాలకు హారతి చూపించాలి ! పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత దేవాలయానికి వెళ్లి దైవదర్శనం , గురుస్వామి దర్శనం చేసుకుని ఇంటికివచ్చి పాలు , పండ్లు స్వీకరించాలి .
( వయసు , ఆరోగ్యరీత్యా ) అల్పాహారం (భిక్ష) స్వీకరించవచ్చు !
🌸మధ్యాహ్నం: రోజువారీ పనులు చేసుకుని మధ్యాహ్నం తిరిగి స్నానం చేసి సద్ది (భోజనం) స్వీకరించాలి !
సాయంత్రం: సూర్యాస్తమయం తర్వాత తిరిగి స్నానం చేసి పూజ చేయాలి. ఉదయం చేసిన విధంగానే ! స్వామికి భజన ప్రీతికరం ! అందుచేత రాత్రి కొంతసేపు భజన నిర్వర్తించాలి ! ఆపైన దేవాలయాన్ని , గురుస్వామిని దర్శించి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి అల్పాహారం స్వీకరించాలి !
🌿రాత్రి: నిద్రించడానికి కొత్తచాప , దుప్పటి నేలపై పరుచుకుని నిద్రించాలి ! ఈ విధమైన దినచర్యను మండల కాలంలో పాటించాలి !
🌹ఆహార నియమాలు:🌹
🌹మాలధారణ :🌹
🌸దీక్ష స్వీకరించాలని సంకల్పం చేసుకున్నవాళ్ళు ముందురోజు తాము ఎంచుకున్న గురుస్వామివారిని దర్శించి తమకు దీక్ష ఇవ్వవలసిందిగా ప్రార్థించాలి ! ఆ సద్గురువు ఆశీర్వాదం చేసి మాలను ధరింపజేయడానికి అంగీకరించి స్థల నిర్ణయం చేస్తారు .
🌿గురువు ఆశ్రమము , ఇంట్లో పవిత్రంగా , ప్రత్యేకంగా వుంచుకునే పూజాగృహం , అయ్యప్పస్వామి దేవాలయం , ఇతర దేవీ దేవతల దేవాలయాలు దీక్షాస్వీకారానికి అనుకూలమైనవి !
🌹కాలవ్యవధి :🌹
🌸వృశ్చిక మాసం (వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరించే నెల రోజులు) మొదటి రోజునుండి 41 రోజుల కాలాన్ని మండల కాలంగా వ్యవహరిస్తారు ! ఈ 41 రోజులు దీక్షాకాలం వ్రతకాలాన్ని పరమ పవిత్రంగా గడపాలి !
🙏దీక్ష స్వీకారం:🌹
🌿ముందు రోజు గురుస్వామిని కలుసుకుని ఆయన చెప్పిన స్థలానికి (సాధారణంగా అయ్యప్పస్వామి గుడిలో దీక్ష ఇచ్చి మాలధారణ జరుపుతారు) పగటిపూట గుడి మూయడానికి పూర్వం గురుస్వామి నిర్ణయించిన సమయానికి చేరుకోవాలి ! ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి నిత్యకృత్యాలు తీర్చుకుని చల్లని నీటితో తలస్నానం ఆచరించి శుభ్ర వస్త్రాలు ధరించాలి ! దీక్ష స్వీకరించేవారు నల్లనిరంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి !
🌹అయ్యప్ప నల్లరంగు వస్తధ్రారణ ఆంతర్యం:🌹
🌸తెలుపు , ఎరుపు , పసుపు రంగుల కలయికవల్ల నల్లరంగు ఏర్పడుతుంది ! వీటిలో సత్వగుణానికి తెలుపు రంగు , రజోగుణానికి ఎరుపు రంగు , తమోగుణానికి పసుపు రంగు ప్రతీకలు ! ఈ మూడు రంగుల కలయికతో ఏర్పడే నల్లని వస్త్రాలను ధరించటం వల్ల మనిషిలోని ఈ మూడు గుణాలను తగిన రీతిలో అదుపులో ఉంచుకోవాలని నలుపు రంగు గుర్తుచేస్తుంటుంది.
🌿నల్ల రంగు వస్త్రాలను ధరించి నుదుట విభూది , చందనము , కుంకుమ బొట్టు పెట్టుకోవాలి.
🌹మాలాధారనరోజు గుడికి తీసుకువెళ్ళవలసిన వస్తువులు :🌹
🌸నలుపు , కావి , నీలిరంగు దుస్తులు రెండేసి జతలు , తులసి , రుద్రాక్షమాలలు 108 సంఖ్యగలవి రెండు మాలలు తీసుకోవాలి !
🌹పూజాద్రవ్యాలు🌹
🌿కంకుమ , విభూది , చందనం , అరటిపండ్లు , కొబ్బరికాయ , ఆవు నెయ్యి , దీపారాధాన వస్తువులు , పుష్పాలు మొదలైనవి తీసుకుని గుడిలో గురుస్వామి వారిని కలుసుకోవాలి ! గురుస్వామి వారు దేవాలయాలలో పూజ జరిపి మెడలో మాలలు వేసి చెవిలో అయ్యప్పస్వామి మంత్రం ఉపదేశించి దీక్ష ఇవ్వటం జరుగుతుంది !
🌹మాలాధారణ మంత్రం:🌹
మాలను ధరింపజేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠింపచేస్తారు గురుస్వామి !
🌸‘‘జ్ఞానముద్రాం , శాస్తమ్రుద్రాం ,
గురుముద్రాం నమామ్యహం
వనముద్రాం , శ్రద్ధాముద్రాం ,
రుద్రముద్రాం , నమామ్యహం ,
శాంతముద్రాం , సత్యముద్రాం ,
వ్రతముద్రాం నమామ్యహం
శబర్యాశ్రమ సత్యేన ముద్రాం
పాతు సదాపిమే గురు దక్షిణాయా ,
పూర్వ తస్మానుగ్రహకారిణే శరణాగతముద్రాఖ్యం ,
తన్ముద్రాం ధారయామ్యహం చిన్ముద్రాం ఖేచరీముద్రాం ,
భద్రముద్రాం నమామ్యహం శబర్యాచలముద్రాయై ,
నమస్త్భ్యుం నమో నమః
‘ఓం స్వామియే శరణం అయ్యప్ప’
అంటూ దీక్ష ముద్ర వున్న మాలను ధరింపజేస్తారు గురుస్వామి !
🌿 మండల దీక్షా స్వీకారానికి ఆశీర్వాదం , ఆమోదం తెలియజేస్తారు ! దీక్ష ముద్ర మాలను ధరించినవారు అప్పటినుండి మండలకాలంలో ఎంతో పవిత్రంగా , నియమ నిష్ఠలతో గడపవలసి వుంటుంది!
🌹అయ్యప్ప దీక్షను స్వీకరించిన స్వాముల దినచర్య🌹
🌸ఉదయం: బ్రాహ్మముహూర్తంలో (తెల్లవారు జామున గం.3.30) లేచిn సూర్యోదయానికి ముందుగానే కాలకృత్యాలు పూర్తిచేసి , చల్లనీళ్ళతో తలస్నానం ఆచరించాలి ! శుభ్రమైన నల్లని వస్త్రాలు ధరించి నుదుట విభూతి , చందనము , కుంకుమ బొట్లు ధరించాలి ! మెడలో వున్న మాలలోని ముద్రకు కూడా విభూది , కుంకుమ , చందనము అద్ది కళ్లకద్దుకోవాలి !
🌿 సూర్యునికి నమస్కరించి పూజ గదిలోకి ప్రవేశించాలి ! పూజాగృహంలో అయ్యప్పస్వామి చిత్రపటాన్ని మధ్యలో అమర్చిన పీఠంమీద అరిటాకు వేసి , దానిమీద వుంచి చందనపు బొట్టు పెట్టి , కుంకుమ అద్ది పూలమాలలతో అలంకరించి రెండు వైపులా దీపపు కుందులు వుంచి దీపారాధన చేయాలి !
🌸 స్వామిని షోడశోపచారాలతో పూజించాలి ! నైవేద్యంగా అరటిపండ్లు , బెల్లం , అటుకులు మొదలైనవి సమర్పించి హారతి చూపుతూ 108 నామాల శరణు ఘోష చదివి , సాష్టాంగ నమస్కారాలు చేయాలి !
🌿 మెడలోని ముద్రమాలకు హారతి చూపించాలి ! పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత దేవాలయానికి వెళ్లి దైవదర్శనం , గురుస్వామి దర్శనం చేసుకుని ఇంటికివచ్చి పాలు , పండ్లు స్వీకరించాలి .
( వయసు , ఆరోగ్యరీత్యా ) అల్పాహారం (భిక్ష) స్వీకరించవచ్చు !
🌸మధ్యాహ్నం: రోజువారీ పనులు చేసుకుని మధ్యాహ్నం తిరిగి స్నానం చేసి సద్ది (భోజనం) స్వీకరించాలి !
సాయంత్రం: సూర్యాస్తమయం తర్వాత తిరిగి స్నానం చేసి పూజ చేయాలి. ఉదయం చేసిన విధంగానే ! స్వామికి భజన ప్రీతికరం ! అందుచేత రాత్రి కొంతసేపు భజన నిర్వర్తించాలి ! ఆపైన దేవాలయాన్ని , గురుస్వామిని దర్శించి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి అల్పాహారం స్వీకరించాలి !
🌿రాత్రి: నిద్రించడానికి కొత్తచాప , దుప్పటి నేలపై పరుచుకుని నిద్రించాలి ! ఈ విధమైన దినచర్యను మండల కాలంలో పాటించాలి !
🌹ఆహార నియమాలు:🌹
దీక్ష స్వీకరించిన స్వాములు ఆహార నియమాలను సక్రమంగాపాటించవలసి వుంటుంది ! వారికి ఆహారం తయారుచేసేవారు స్నానం చేసి శుచిగా వంట చేయాలి ! సాత్వికాహారం మాత్రమే స్వీకరించాలి ! ఎక్కువగా తీపి , ఉప్పు , పులుపు , కారం , ఉల్లి , వెల్లుల్లి , మసాలా దినుసులు కలిపిన ఆహారాన్ని భుజించకూడదు ! అపరిశుభ్రమైన పదార్థాలు అకాలంలో , అమితంగా తినకూడదు !...సశేషం... 🙏
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో తెలుసుకుందాం...🌞
Subscribe to:
Comments (Atom)